ఇప్పుడిస్తే ఎలా?
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తనిఖీలతో పాఠశాలల్లో అనేక లోపాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా ఉపాధ్యాయులు లెసన్ ప్లాన్ రాయకపోవడం, వర్క్బుక్స్ దిద్దకపోవడం వంటివి ఆయన పరిశీలనలో పలుచోట్ల వెలుగుచూశాయి.
సిలబస్ ముగిసేవేళ... వర్క్బుక్స్ రాక
ప్రిన్సిపల్ సెక్రటరీ తనిఖీలతో అప్రమత్తం
ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తనిఖీలతో పాఠశాలల్లో అనేక లోపాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా ఉపాధ్యాయులు లెసన్ ప్లాన్ రాయకపోవడం, వర్క్బుక్స్ దిద్దకపోవడం వంటివి ఆయన పరిశీలనలో పలుచోట్ల వెలుగుచూశాయి. ఆర్జేడీలు, డీఈఓలు ఇంతమంది యంత్రాంగం ఉండి కనీసం ఎవరేం చేస్తున్నారో కూడా చూడడం లేదని అధికారుల తీరును తప్పుబట్టారు. దీంతో ఉమ్మడి జిల్లాలో గుంటూరు, పల్నాడు, బాపట్ల డీఈఓలు నిత్యం తమ పరిధిలో ఏదో ఒక పాఠశాలను తనిఖీ చేసి టీచర్ల పాఠ్య ప్రణాళిక నుంచి విద్యార్థులు రాసే పుస్తకాల దాకా ప్రతిదీ చూస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటనకు వచ్చినప్పుడు కనీసం చెప్పుకోవడానికి ఉంటుందని ఉమ్మడి గుంటూరులో ముగ్గురు డీఈఓలు పాఠశాలల తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు.
సస్పెన్షన్లు, తాఖీదులు
నాలుగు రోజుల క్రితం గుంటూరు మండలం వెంగళాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలోని విలీన టీచర్లు ఇద్దరు పిల్లలు రాసిన వర్క్బుక్స్ కరెక్షన్ చేయలేదని ఏకంగా వారిపై గుంటూరు డీఈఓ శైలజ సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా బుధవారం నగరంలోని కొత్తపేట 28వ నంబరు స్కూల్కు పరిశీలనకు వెళ్లగా అక్కడ నలుగురు ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదని షోకాజ్ నోటీసులిచ్చారు. ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు వర్క్బుక్స్ రాయించడం లేదని, దిద్దడం లేదని గుర్తించి ఆ మేరకు తాఖీదులు ఇవ్వాలని ఆదేశించారు. మరో పాఠశాలలో టీచర్ ఒకరు వర్క్బుక్ను యూట్యూబ్లో చూసి రాయాలని చెప్పి కనీసం రాయించే విధానం కూడా పిల్లలకు చెప్పటం లేదని తల్లిదండ్రుల నుంచి అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆ బడికి వెళ్లి పరిశీలించగా అక్కడ పిల్లలకు వర్క్బుక్ రాయడం నేర్పించడం లేదని తేలింది. పల్నాడు డీఈఓ వెంకటప్పయ్య సైతం ఇటీవల నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లోని పలు పాఠశాలలు తనిఖీ చేశారు. అక్కడి ఉపాధ్యాయులతో సమావేశాలు పెట్టి లోపాలను అంతర్గత సమీక్షలో చెప్పి అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. మరోసారి పర్యటనకు వచ్చేనాటికి లోపాలను సరిదిద్దుకోకపోతే సస్పెండ్ చేస్తానని సుతిమెత్తగా మందలించి వదిలేశారు. మొత్తంగా ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటనలతో విద్యాశాఖ యంత్రాంగం అప్రమత్తమై స్కూళ్లకు వస్తుండడంతో టీచర్లు వణికిపోతున్నారు. ఇప్పటివరకు విధి నిర్వహణలో అలసత్వంగా ఉన్న వారు తమ లోపాలను సవరించుకుని ముందుకు సాగుతున్నారు.
ఆలస్యంగా ఇచ్చి టీచర్లను తప్పుపడుతూ...
వాస్తవంగా విద్యార్థులకు వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు పునః ప్రారంభమైన తర్వాత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తారు. వాటితో పాటే వర్క్బుక్స్ ఇవ్వట్లేదు. తరగతులు ప్రారంభమైన మూడు నెలల తర్వాత వాటిని అందిస్తే అప్పటికే చాలా వరకు సిలబస్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఇస్తే తిరిగి వెనక్కు వెళ్లి ఏం చెబుతామని చెప్పి ప్రస్తుత సిలబస్కు అనుగుణంగా వర్క్బుక్స్ రాయిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అధికారులు మాత్రం మొదటి నుంచి ఎందుకు రాయించలేదని చెప్పి టీచర్లను ప్రశ్నిస్తున్నారు. సకాలంలో పుస్తకాలిస్తే రాయించేవాళ్లమని అంటున్నారు. ఇప్పటికీ కొన్ని పాఠశాలలకు వర్క్బుక్స్ పంపుతూనే ఉన్నారు. ‘ఈ వ్యవస్థాపరమైన లోపాలను టీచర్లపై రుద్దటం సరికాదు. సకాలంలో పుస్తకాలివ్వకపోతే వర్క్బుక్స్ అన్నీ రాయించటం ఎలా సాధ్యమని’ యూటీఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బసవలింగారావు నిలదీశారు. వర్క్బుక్స్ ఒక్కటే కాదు 8వ తరగతికి చెందిన కొన్ని టైటిళ్లు ఇవ్వలేదు. మరికొన్ని తరగతుల పుస్తకాలు ఇంకా అందాల్సిన విద్యార్థులు ఉన్నారు. ఈ మధ్యే కొన్ని టైటిళ్లను స్కూళ్లకు పంపారు. తొలుత ఇండెంట్ ప్రకారం పంపలేదని చెప్పి వాటిని ఇప్పుడు అందజేస్తున్నారు. ఇవన్నీ వ్యవస్థాపరమైన లోపాలే. వాటికి టీచర్లను సస్పెండ్ చేయటం, షోకాజ్ నోటీసులిచ్చి సంజాయిషీలు కోరటం సరికాదు. అన్నీ సకాలంలో ఇచ్చి టీచర్లు పాఠ్యాంశాలు బోధించకపోయినా, పిల్లలతో వర్క్బుక్స్ రాయించకపోయినా, వాటిని దిద్దకపోయినా చర్యలు తీసుకుంటే తమకేమి అభ్యంతరం లేదని వారు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు