పోలీసుల చూపు ఒక వైపే..!
జిల్లాలో ఇప్పటికీ ఎవరేమనుకున్నా అధికార వైకాపాకు జీ హుజూర్ అంటోంది పోలీసు యంత్రాంగం. ప్రసుత్తం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కనీసం ఇప్పుడైనా యంత్రాంగం పారదర్శకంగా.. నిష్పక్షపాతంగా పని చేస్తుందని విపక్షాలు భావించాయి.
వైకాపాకు దన్నుగా నిలుస్తున్న యంత్రాంగం
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా వివక్షే
ఈసీకి ఫిర్యాదు చేయడానికి సన్నద్ధం
బాపట్ల అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి తెదేపా అభ్యర్థి నరేంద్రవర్మను వెళ్లిపోవాలని సీఐ శ్రీనివాసులు సూచిస్తుండగానే కార్యకర్తలతో వచ్చిన వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కోన రఘుపతి(పాతచిత్రం)
ఈనాడు-బాపట్ల: జిల్లాలో ఇప్పటికీ ఎవరేమనుకున్నా అధికార వైకాపాకు జీ హుజూర్ అంటోంది పోలీసు యంత్రాంగం. ప్రసుత్తం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కనీసం ఇప్పుడైనా యంత్రాంగం పారదర్శకంగా.. నిష్పక్షపాతంగా పని చేస్తుందని విపక్షాలు భావించాయి. అందుకు భిన్నంగా, యథావిధిగానే కొందరు పోలీసులు విధి నిర్వహణలో వివక్ష చూపుతున్నారు. అడుగడుగునా అధికార అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారు. వారు తప్పు చేసినా ఒప్పు అనేలా వ్యవహరిస్తున్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రం బాపట్లలో స్థానిక జమ్ములపాలెం ఆర్వోబీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడానికి అసెంబ్లీ, పార్లమెంట్ బరిలో ఉన్న అభ్యర్థులు వేగేశన నరేంద్ర వర్మ, తెన్నేటి కృష్ణప్రసాద్లు తొలుత విగ్రహం వద్దకు చేరుకున్నారు. వారు అక్కడ నివాళి అర్పిస్తుండగానే పోటీగా వైకాపా సిటింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి తన మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే వచ్చారు మీరు దిగిపోండని కూటమి అభ్యర్థుల్ని హడావుడి చేసి కిందకు దింపటం స్థానిక పోలీసు అధికారుల తీరుగా ఉంది.. ఒకవైపు తెదేపా అభ్యర్థులు ముందుగా అక్కడకు చేరుకుని పూల దండలు వేస్తుంటే కొద్దిసేపు వేచిచూడాలని వైకాపా వారికి చెప్పి నిలురించాల్సిన పోలీసులు ఆ పని చేయలేదు. ర్యాలీగా వస్తున్న అధికార ఎమ్మెల్యే, వారి కార్యకర్తలకు అభ్యంతరం చెప్పలేదు. కూటమి అభ్యర్థులు, వారి కార్యకర్తలు అక్కడ ఉండగానే ఆ ప్రదేశానికి వైకాపా ఎమ్మెల్యే, వారి కార్యకర్తలను అనుమతించి ఓ రకంగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడేలా పోలీసులు వ్యవహరించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు విగ్రహం వద్ద ఎదురెదురు తారసపడి పోటాపోటీ నినాదాలు చేసుకుని బాహాబాహీకి దిగటంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ వ్యవహారంపై తెదేపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చారని తమను నివాళి అర్పించకుండా, ప్రసంగం పూర్తికాకుండానే పోలీసులు పంపించేయటాన్ని కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ తప్పుబట్టారు. ఈ పక్షపాత వైఖరిపై ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నారు.
- పర్చూరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి యడం బాలాజీ ఆదివారం రాత్రి యద్ధనపూడి మండలం పూనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ప£ల్లె నిద్ర పేరుతో రాత్రిపూట హడావుడి చేశారని తెదేపా నాయకులు తెలిపారు. క్రేన్తో భారీ పూల దండను ప్రధాన కూడలిలో బాలాజీకి వేయించారు. వీటిల్లో కొన్ని కార్యక్రమాల నిర్వహణకు అనుమతులు తీసుకోలేదు. అయినా ఈ నిర్వాకం పోలీసులు, ఎంసీసీ బృందాలకు పట్టలేదు. అదే విపక్షాలైతే ప్రచారం చేయటానికి, క్రేన్తో పూలదండలు వేయించుకోవటానికి అనుమతులు తీసుకున్నారా అని చెప్పి పోలీసులే అడ్డుకునేవారు. కానీ వైకాపా వారి విషయంలో పోలీసు యంత్రాంగానికి అవేం గుర్తుకురావటం లేదా? అని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
- అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం ఏల్చూరులో ఈ మధ్య తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్కు చెందిన ప్రచార వాహనాన్ని స్ధానిక వైకాపా కార్యకర్తలు ఓ బజార్లో తిరగటానికి వీల్లేదని అడ్డుకున్నారు. ఆపై వాహనాన్ని అడ్డుకుని డ్రైవర్పై చేయిచేసుకున్నారు. అసలే అది ఫ్యాక్షన్ గ్రామం. కోడ్ అమల్లోకి రాగానే అక్కడ పోలీసు పికెట్ ఏర్పాటు చేయాలి. అది వైకాపాకు బాగా పట్టున్న గ్రామం కావటంతో పోలీసులు పికెట్ పెట్టకుండా తెదేపా వారి వాహనాలు ప్రచారానికి రాకుండా అడ్డుకుంటున్నారని తెదేపా వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికీ ఆ ఊళ్లో తమ వాహనంపై దాడిచేసిన వారిని గుర్తించినా అదుపులోకి తీసుకోలేదని ఈ పక్షపాత వైఖరిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే రవికుమార్ చెప్పారు.
- ఇటీవల కూటమి ఆధ్వర్యంలో వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ప్రజాగళం సభ జరిగింది. దానికి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. తొలుత వేమూరు మార్కెట్యార్డు నుంచి రోడ్షో ప్రారంభమైంది. చంద్రబాబు కాన్వాయ్కు ఇతర వాహనాలు అడ్డు రాకుండా కట్టడి చేయటంలో పోలీసులు వైఫల్యం చెందారు. పార్టీ వాలంటీర్లే అడ్డువస్తున్న వాహనాలను పక్కకు పంపుతూ కాన్వాయ్ సాగేలా చర్యలు చేపట్టారు. ఈ వివక్షపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి ఈసీకి ఫిర్యాదు చేయాలనే యోచనలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
[ 30-04-2024]
కాల్చి పడేస్తా ఎవరు వస్తారో రమ్మనురా అంటూ సస్పెండైన ఎస్సై వీరంగం సృష్టించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. భార్య భర్తల కేసు న్యాయస్థానంలో ఉండగా సస్పెన్స్లో ఉన్న ఓ ఎస్సై.. -
ఎండలో మాడ్చొద్దు.. ఉసురు తీయొద్దు
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వారిని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. -
ఓట్ల వేటలో జగన్నాటకమే
[ 30-04-2024]
పండుటాకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మొన్న పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసింది. అది సరిపోలేదని ఈసారి ఏకంగా కిలోమీటర్ల దూరం వెళ్లి బ్యాంకుల నుంచి పింఛను తెచ్చుకునేలా చేస్తోంది. -
మత్తులో ముంచారు.. మొత్తంగా దోచారు!
[ 30-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు. -
అయిదేళ్ల వేదన.. అరణ్య రోదన
[ 30-04-2024]
సీఎం జగన్ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారు. మాట ఇవ్వడం.. మడమ తిప్పడం అనే పదానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఈ అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. -
పొన్నూరు అభివృద్ధిపై నోరువిప్పని జగన్
[ 30-04-2024]
పట్టణంలోని రేపల్లె బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు. -
పోరు.. ఖరారు!
[ 30-04-2024]
గుంటూరు పార్లమెంటు స్థానానికి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ పోటీకి ఆసక్తి చూపడం గమనార్హం. -
పోరులో నిలిచింది 122 మంది
[ 30-04-2024]
నామినేషన్ల తుది ఘట్టం ముగిసింది. ఉపసంహరణల అనంతరం ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు మొత్తం 122 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల నుంచి ఒక్కరు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. -
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యం
[ 30-04-2024]
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తానని పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
జిల్లాలో 12,91,716 ఓటర్లు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్బాషా సోమవారం ప్రకటించారు. జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు. -
ఎన్నికల బరిలో 104 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో బాపట్ల లోక్సభ నియోజకవర్గం, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 104 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలు తుది గడువుగా ఉంది. -
రెండ్రోజులకోసారి డ్రమ్ము నీరు సరిపోతుందా?
[ 30-04-2024]
రేపల్లె శివారు ప్రాంతమైన 28వ వార్డు ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆరోపిస్తూ వారు ప్రధాన రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ట్యాంకరుతో రెండ్రోజులకోసారి సరఫరా చేస్తున్న నీరు అందరికీ సరిపోవడంలేదని మండిపడ్డారు. -
లోకేశ్తో చిరువ్యాపారులకు మంచి రోజులు
[ 30-04-2024]
నారా లోకేశ్ ఎమ్మెల్యే అయితే మంగళగిరిలో చిరు వ్యాపారులకు మంచి రోజులొస్తాయని, సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. -
వసూళ్లలో ఎగుమతి, దిగుమతి సంఘాల నేతలు
[ 30-04-2024]
వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం