తాడేపల్లిలో ఇల్లన్నావు.. తోడేళ్లకు తోడున్నావు..
ఇసుక.. సహజ వనరు. జిల్లా వాసులు అందరికీ చెందాల్సిన సహజ సంపద. పాలకుడు సచ్ఛీలుడైతే ఆ ఫలాలను ప్రజలు అందరికీ పంచుతాడు. కానీ పాలకుడే దోపిడీ చేస్తుంటే.. అనుచరగణం ఆగుతుందా? అధికారమే అండగా ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది.
వైకాపా నాయకుల అరాచకం
రాయల్టీ ఎగ్గొట్టి ఇసుక తోడేశారు
అడ్డొస్తే అంతుచూస్తామని బెదిరింపులు
ఈనాడు, అమరావతి: ఇసుక.. సహజ వనరు. జిల్లా వాసులు అందరికీ చెందాల్సిన సహజ సంపద. పాలకుడు సచ్ఛీలుడైతే ఆ ఫలాలను ప్రజలు అందరికీ పంచుతాడు. కానీ పాలకుడే దోపిడీ చేస్తుంటే.. అనుచరగణం ఆగుతుందా? అధికారమే అండగా ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. అడ్డగోలుగా తవ్వకాలు చేస్తూ అడ్డుకుంటున్న వారిపై దాడులకు తెగబడుతోంది. నిబంధనలు పాటించమని అడిగితే అంతం చేస్తామని హెచ్చరిస్తోంది. అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే నదీ తీర గ్రామాల ప్రజలను ట్రాక్టర్లతో తొక్కించి చంపడానికి వెనుకాడడం లేదు. అక్రమాలను బహిర్గతం చేస్తున్నారన్న అక్కసుతో దాడులు చేసి బీభత్సం సృష్టిస్తున్నారు.
ఎక్కడెక్కడ ఎలా...
- జిల్లాలో కొల్లిపర మండలం మున్నంగి, బొమ్ము వానిపాలెం-14, 15, తాడేపల్లి మండలం గుండిమెడ రీచ్లలో మాత్రం కూలీలతో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది. ఇందుకు భిన్నంగా తాడేపల్లి మండలం గుండెమెడ, దుగ్గిరాల మండలం పెదకొండూరు, గొడవర్రు, కొల్లిపర మండలం వల్లభాపురం, మున్నంగి, బొమ్మవానిపాలెం రీచ్లలో రాత్రిపగలు తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ యంత్రాలు వాడకూడదన్న నిబంధన మచ్చుకైనా అమలుకావడం లేదు. నిత్యం వందల లారీల్లో ఇసుక తరలిస్తూ వైకాపా నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. నదిలో ఎక్కడపడితే అక్కడ 20 అడుగుల లోతుకుపైగా తవ్వకాలు చేస్తున్నారు.
- జిల్లాలో జీసీకేసీ కంపెనీ ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి. కంపెనీ సిబ్బందికి ప్రతి రీచ్లో స్థానికంగా వైకాపా నేతలు సహకారం అందించి లబ్ధి పొందుతున్నారు. లారీలకు స్లిప్పులు ఇచ్చి డబ్బులు తీసుకోవడానికి, వరుసలో ఇసుక నింపడానికి, రీచ్లో పనులు పర్యవేక్షించడానికి వైకాపా నేతల అనుచరులను కంపెనీ ఉద్యోగులుగా పెట్టుకుంది. ఇందుకు ప్రతిఫలంగా వైకాపా నేతలకు తక్కువ ధరకే వరుసలో లేకుండా వచ్చిన లారీలకు వచ్చినట్టే ఇసుక లోడ్ చేస్తున్నారు. తక్కువ ధర, పన్నులు ఎగ్గొట్టడం, రీచ్లోకి లారీ వెళ్లిన వెంటనే లోడ్ చేస్తుండడంతో వైకాపా వారికి ఇసుక వ్యాపారం అత్యంత లాభదాయకంగా మారింది.
- నేతలు పెట్టిన కుర్రాళ్లు రీచ్లో పనిచేసినందుకు సొమ్ము ముట్టజెప్పుతున్నారు. వైకాపా నేతలకు అప్పనంగా సొమ్ము వస్తుండడంతో ఇసుక తవ్వకాలను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే వైకాపా నేతలు రీచ్లో పనిచేసే కుర్రాళ్లను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పుతున్నారు. దాడులు చేస్తే కేసులు, ఇతరత్రా వ్యవహారాలన్నీ నేత చూసుకుంటుండడంతో కుర్రాళ్లు రెచ్చిపోయి సొంత గ్రామస్థులపైనే దాడులకు తెగబడుతున్నారు.
- సాక్షాత్తూ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అయిదేళ్లలో వైకాపా ఇసుక మాఫియా రూ.వందల కోట్ల విలువైన సహజ సంపదను కొల్లగొట్టింది. ఒకప్పుడు స్థానికులకు ఇసుక ఉచితంగా దొరికేది. దూరంగా ఉన్నవారికి తక్కువ ధరకైనా అందేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇసుక తోడేళ్లదే అంతా. వారు చెప్పిందే ధర.. వారు చెప్పిన వారికే లోడింగ్.. వెరసి భవన నిర్మాణాలకు ఇసుక దొరకని పరిస్థితి. కూలీలకు ఉపాధి కరవైన దౌర్భాగ్యం. వాళ్లు తవ్వుకుపోతే మనదేం పోయిందని మౌనంగా ఉన్నందుకు ఆ నష్టం మన ఇంటి దాకా వచ్చింది.
కడప నేతల ఆధ్వర్యంలో తవ్వకాలు
- కూలీల చేత ఇసుక తీసి వాహనాలకు నింపి రవాణా చేసేందుకు రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ(సియా) అనుమతులు ఇచ్చింది. నిబంధనలకు నీళ్లొదిలి భారీ పొక్లెయిన్లు పెట్టి ఇసుక తరలించారు. జిల్లాలో ఇసుక తవ్వుకోవడానికి జీసీకేసీ సంస్థకు అనుమతులు ఇచ్చారు. కడప జిల్లాకు చెందిన ముఖ్యనేతలకు సమీప బంధువు ఒకరు ఇసుక తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు. ఇతనికి స్థానికంగా ఉన్న వైకాపా నేతల అనుచరులు అన్నివిధాలా సహకారం అందిస్తున్నారు. ఇసుకాసురుల కాసుల కక్కుర్తితో రాత్రీ పగలు తేడా లేకుండా కృష్ణానదికి తూట్లు పొడుస్తున్నారు.
- కలెక్టర్ స్వయంగా ఇసుక రీచ్లు తనిఖీలు చేసి అక్రమ తవ్వకాలు జరగడం లేదని నివేదికలు ఇవ్వడంతో దొంగచేతికి తాళాలు ఇచ్చినట్లయింది. ఇదే అదునుగా ప్రభుత్వానికి రాయల్టీ సైతం చెల్లించకుండా ఇసుక కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వకుండా ఎంతలోతు వరకైనా తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
తాగునీటి పథకాలపై ప్రభావం
కృష్ణానదీ తీరంలో రక్షిత నీటి పథకాల ద్వారా గ్రామీణ నీటి సరఫరా విభాగం తాగు నీరు సరఫరా చేస్తోంది. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల వల్ల నదిలో భారీ గోతులు ఏర్పడి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. తీరంలో తాగు నీటి పథకాలకు నీటి లభ్యత తగ్గి లక్షల మందికి నీటి సరఫరాపై ప్రభావం పడింది. ఒకప్పుడు 20 అడుగుల లోపు నీటి లభ్యత ఉంటే ఇప్పుడు వంద అడుగులపైగా బోర్లు వేయించాల్సి వస్తోందŸని సాగుదారులు వాపోతున్నారు.
ప్రవాహ దిశ మార్చుకునే ప్రమాదం
కృష్ణానదిలో గట్టు వెంబడి ఉన్న ఇసుక కొల్లగొట్టిన మాఫియా నదీగర్భంలో ఉన్న ఇసుక తవ్వి తరలించడానికి నదిలోనే రహదారులు నిర్మిస్తున్నారు.. నదీపాయలకు అడ్డంకులు సృష్టించడంతో వరదలు వచ్చినప్పుడు ప్రవాహం దిశ మార్చుకుంటే తీరప్రాంతాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిమితికి మించిన లోడుతో లారీలు తిరుగుతుండడంతో రోడ్లు ఛిద్రమవుతున్నాయి.
కొల్లిపర: కోతకు గురైన సాగు భూమి
- తాడేపల్లి మండలం గుండెమెడ క్వారీలో అక్రమ తవ్వకాలను పరిశీలించడానికి వెళ్లిన జనసేన నేతలను మాఫియా అడ్డుకుంది. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని జనసేన నేతలను అక్కడి నుంచి పంపేశారు. తవ్వకాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
- మార్చి 29, 2024.. కొల్లిపర మండలం మున్నంగి ఇసుక రీచ్లో తవ్వకాలను అడ్డుకున్నారని గ్రామస్థులపైనే అదే గ్రామానికి చెందినవారు దాడికి తెగబడ్డారు. ట్రాక్టరుతో మనుషులను తొక్కించడమే కాకుండా కొడవళ్లతో వారిపై దాడి చేసి మాఫియా గాయపరిచింది. ద్విచక్ర వాహనాలను ట్రాక్టరుతో తొక్కించి ధ్వంసం చేశారు. ఇసుక మాఫియా ఎంతకైనా బరి తెగిస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం.
నదిలో అక్రమ బాటలు, తవ్వకాలు
శివరామిరెడ్డి, బొమ్మువానిపాలెం సర్పంచి
కృష్ణానదీ తీరంలోని బొమ్మువానిపాలెం ఒకప్పుడు ప్రశాంతతకు నిలయం. నేడు నిత్యం రణగొణధ్వనులు. ఇసుక తోడుతున్న భారీ యంత్రాలు, తరలిస్తున్న లారీల శబ్దాలు. నదీ గర్భంలో అక్రమ బాటల ఏర్పాటు. అక్రమ తవ్వకాలతో, తరలింపులతో కృష్ణమ్మ దారి మళ్లుతోంది. వరదముంపులో విలువైన పంట భూములు కోతకు గురవుతున్నాయి. కృష్ణా నది సమీప భూముల్లోనూ నీరు అడుగంటుతోంది. అక్రమ తవ్వకాలు నిలువరించాలని, నదిలో బాటలు తొలగించాలని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. అడ్డుకుంటే కేసులు పెడతామని ఇసుకాసురులు బెదిరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
[ 30-04-2024]
కాల్చి పడేస్తా ఎవరు వస్తారో రమ్మనురా అంటూ సస్పెండైన ఎస్సై వీరంగం సృష్టించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. భార్య భర్తల కేసు న్యాయస్థానంలో ఉండగా సస్పెన్స్లో ఉన్న ఓ ఎస్సై.. -
ఎండలో మాడ్చొద్దు.. ఉసురు తీయొద్దు
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వారిని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. -
ఓట్ల వేటలో జగన్నాటకమే
[ 30-04-2024]
పండుటాకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మొన్న పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసింది. అది సరిపోలేదని ఈసారి ఏకంగా కిలోమీటర్ల దూరం వెళ్లి బ్యాంకుల నుంచి పింఛను తెచ్చుకునేలా చేస్తోంది. -
మత్తులో ముంచారు.. మొత్తంగా దోచారు!
[ 30-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు. -
అయిదేళ్ల వేదన.. అరణ్య రోదన
[ 30-04-2024]
సీఎం జగన్ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారు. మాట ఇవ్వడం.. మడమ తిప్పడం అనే పదానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఈ అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. -
పొన్నూరు అభివృద్ధిపై నోరువిప్పని జగన్
[ 30-04-2024]
పట్టణంలోని రేపల్లె బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు. -
పోరు.. ఖరారు!
[ 30-04-2024]
గుంటూరు పార్లమెంటు స్థానానికి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ పోటీకి ఆసక్తి చూపడం గమనార్హం. -
పోరులో నిలిచింది 122 మంది
[ 30-04-2024]
నామినేషన్ల తుది ఘట్టం ముగిసింది. ఉపసంహరణల అనంతరం ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు మొత్తం 122 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల నుంచి ఒక్కరు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. -
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యం
[ 30-04-2024]
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తానని పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
జిల్లాలో 12,91,716 ఓటర్లు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్బాషా సోమవారం ప్రకటించారు. జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు. -
ఎన్నికల బరిలో 104 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో బాపట్ల లోక్సభ నియోజకవర్గం, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 104 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలు తుది గడువుగా ఉంది. -
రెండ్రోజులకోసారి డ్రమ్ము నీరు సరిపోతుందా?
[ 30-04-2024]
రేపల్లె శివారు ప్రాంతమైన 28వ వార్డు ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆరోపిస్తూ వారు ప్రధాన రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ట్యాంకరుతో రెండ్రోజులకోసారి సరఫరా చేస్తున్న నీరు అందరికీ సరిపోవడంలేదని మండిపడ్డారు. -
లోకేశ్తో చిరువ్యాపారులకు మంచి రోజులు
[ 30-04-2024]
నారా లోకేశ్ ఎమ్మెల్యే అయితే మంగళగిరిలో చిరు వ్యాపారులకు మంచి రోజులొస్తాయని, సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. -
వసూళ్లలో ఎగుమతి, దిగుమతి సంఘాల నేతలు
[ 30-04-2024]
వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!