logo

‘గాంధీ’లో భవనంపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

గాంధీ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి(50) ఓపీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఓపీ భవనం మూడో అంతస్తుపై నుంచి బుధవారం ఉదయం 11:45 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి కిందకు దూకాడు.

Published : 20 Jan 2022 03:11 IST
మృతిచెందిన వ్యక్తి

గాంధీఆసుపత్రి, న్యూస్‌టుడే: గాంధీ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి(50) ఓపీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఓపీ భవనం మూడో అంతస్తుపై నుంచి బుధవారం ఉదయం 11:45 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి కిందకు దూకాడు. వార్డులోకి తరలించి పరీక్షించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి గురించి ఎటువంటి ఆధారాలు లభించలేదని ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని