నేర వార్తలు
‘సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోకుండా తనను అనవసరంగా జైలుకు తరలించారు. ఈ విషయమై గతంలో మోమిన్పేట ఎస్సైగా పనిచేసిన కరంపురి రాజుకు, అప్పటి అదనపు న్యాయముర్తి లక్ష్మికి హైకోర్టు తాఖీదులు జారీ చేసిందని’ హక్కు చట్టం
ఉద్యోగం వచ్చిందంటూ బురిడీ రూ.1.10 లక్షలు మాయం
మనోహరాబాద్, న్యూస్టుడే: మీకు ఉద్యోగం వచ్చింది.. నగదు కడితే సరిపోతుందని ఫోన్ రావడంతో ఆ యువకుడు ఎగిరి గంతేశాడు. వారు సూచించిన మేర వివిధ నెంబర్లుకు ఆన్లైన్ ద్వారా నగదు పంపించాడు. ఆ తర్వాత ఎలాంటి సమాచారం రాకపోవడంతో తిరిగి తనకు వచ్చిన ఫోన్ నెంబర్లకు కాల్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించారు. ఈ ఘటన మనోహరాబాద్ మండలం దండుపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా తాండావాల్గా గ్రామానికి చెందిన మేత్రి నాగేశ్ దండుపల్లిలోని ఐటీసీ పరిశ్రమలో సూపర్వైజర్గా పని చేస్తూ ఇక్కడే ఓ గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. ఈ నెల 16న గూగుల్లో ఎల్అండ్టీ పరిశ్రమలో ఉద్యోగాలు ఉంటూ వచ్చిన ప్రకటన చూసి అందులో సూచించిన నెంబరుకు మేసేజ్ పంపించాడు. మరుసటి రోజు 17వ తేదీన ఓ వ్యక్తి ఎల్అండ్టీ సంస్థ నుంచి మాట్లాడుతున్నానని 94329-20178 నెంబరు నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి మీ బయోడేటా పంపించి టోకెన్ నగదుగా రూ.2,999 పంపించాలని చెప్పాడు. దీంతో నాగేశ్ అదే నెంబరు నగదు పంపించాడు. ఆ తర్వాత 18న అదే నెంబర్ నుంచి ఫోన్ రాగా, ప్రాసెస్లో ఉంది, నగదు పంపించాలని సూచించడంతో పలు దఫాలుగా గూగుల్పే, పేటీఎం, ఫోన్పే ద్వారా అవతలి వ్యక్తి సూచించిన మేర యూకో బ్యాంకు ఖాతాకు రూ.96 వేలు పంపించాడు. ఈ నెల 22న మళ్లీ ఫోన్ చేసి నగదు పంపాలని కోరగా అనుమానం వచ్చిన నాగేశ్ సైబర్ క్రైమ్ టోల్ ప్రీ నెంబరు 155260కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు 84819-96937 నెంబరు ఫోన్ చేసి మీ ఉద్యోగం ఖరారైందని, రూ.10 వేలు పంపించాలని కోరడంతో పేటీఎం ద్వారా బదిలీ చేశాడు. అప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అనుమానం వచ్చి తనకు వచ్చిన నెంబర్లకు ఫోన్ చేయగా.. స్విచ్చాఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించాడు. ఈ మేరకు స్థానిక పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సెల్ఫోన్ దొంగను పట్టిచ్చిన యాప్
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: సెల్ఫోన్ను చోరీ చేసిన దొంగ ఆ ఫోన్లో ఉన్న యాప్ ఆధారంగా పట్టుబడ్డాడు. సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీను, ఎస్సై మాజీద్ తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్కు చెందిన సాయిసర్ రాహుల్(22) క్యాటరింగ్ వర్కర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా రైళ్లలో ప్రయాణిస్తూ బ్యాగులు, సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్నాడు. ఈనెల 23 రాత్రి నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్కు వస్తున్న రైల్లో సిద్దుసాయి అనే యువకుడు నగరానికి వస్తున్నాడు. ఆ సమయంలో ఛార్జింగ్ పెట్టిన కొద్దిసేపటి తర్వాత సెల్ఫోన్ కనిపించలేదు. విజయవాడకు పనిమీద వెళ్లిన రాహుల్ తిరిగి అదే రైల్లో నగరానికి వస్తున్నాడు. రైలు సత్తెనపల్లి-నడికుడి ప్రాంతానికి చేరుకున్న సమయంలో సెల్ఫోన్ను దొంగిలించాడు. ఫోన్ కోసం వెతుకున్న సిద్దుసాయి తన ఫోన్లో ఉన్న యాంటీ తఫె్ట్ అప్లికేషన్ ద్వారా ఫోన్ను గుర్తించి నిందితుడిని ప్రయాణికుల సాయంతో పట్టుకున్నాడు. రైలు సోమవారం సికింద్రాబాద్కు చేరుకున్న అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడిని విచారించిన పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఫోన్లను గుర్తించే విధంగా యాప్లు ఉంచుకుంటే మంచిందని ఇన్స్పెక్టర్ శ్రీను సూచించారు.
ఎస్సైకి, అదనపు న్యాయమూర్తికి తాఖీదులు జారీ
మోమిన్పేట: ‘సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోకుండా తనను అనవసరంగా జైలుకు తరలించారు. ఈ విషయమై గతంలో మోమిన్పేట ఎస్సైగా పనిచేసిన కరంపురి రాజుకు, అప్పటి అదనపు న్యాయముర్తి లక్ష్మికి హైకోర్టు తాఖీదులు జారీ చేసిందని’ హక్కు చట్టం ఉద్యమకారుడు తెలంగాణ సీపీఐ జిల్లా ఇన్ఛార్జి కె.కళప్ప తెలిపారు. మంగళవారం ఆయన మోమిన్పేటలో మాట్లాడుతూ 2017 జనవరి 4న తనపై 354, 506 సెక్షన్ల కింద మోమిన్పేట పోలీసు స్టేషన్లో అప్పటి ఎస్సై కరంపురి రాజు (ప్రస్తుతం ఈయన సైబరాబాద్ పరిధి పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు.) కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల కింద తనకు ఏడేళ్ల జైలు శిక్ష పడే వీలుంది. అయితే ఇలాంటి కేసుల విషయంలో గతంలో (2014) సుప్రీం కోర్టు స్థానిక పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వవచ్చని తీర్పు చెప్పింది. కోర్టు తీర్పును పరిధిలోకి తీసుకోకుండా తనని ఎస్సై రిమాండ్కు తరలించారు. అదే సమయంలో అప్పటి వికారాబాద్ మొదటి తరగతి అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ లక్ష్మికూడా (ప్రస్తుతం జడ్చర్లలో కొనసాగుతున్నారు). తీర్పును గమనించక జైలుకు పంపించారు. న్యాయం కోసం వీరిద్దరిపై గత సంవత్సరం డిసెంబర్ 6న తాను హైకోర్టును ఆశ్రయించగా ఇరువురికీ ఈనెల 28న హైకోర్టుకు రావాలని నోటీసులు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. ప్రజలు సమాచారం హక్కు చట్టంపై అవగాహన పెంపొందించుకుంటే ఎంతో మేలు జరుగుతుందన్నారు.
తనిఖీల్లో గంజాయి పట్టివేత.. ముగ్గురిపై కేసు
పరిగి గ్రామీణ: అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తితోపాటు కొంటామని చెప్పిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పరిగి పురపాలిక పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం నగరానికి వెళ్లే రహదారిపై పోలీస్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. మన్నెగూడ నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని (స్కూటీ) ఆపి పత్రాలు అడగగా వాహనదారుడు తడబడుతూ సమాధానం ఇచ్చాడు. అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి దొరికింది. వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించి రెవెన్యూ అధికారుల సమక్షంలో పరిశీలించి తూకం వేయగా 250 గ్రాముల బరువున్న గంజాయిగా తేలింది.ఆ వ్యక్తి నగరంలోని ధూల్పేట్ ప్రాంతానికి చెందిన మహేందర్ సింగ్గా గుర్తించారు. పరిగికి చెందిన శ్రీవదన్, సాయిప్రణీత్లు కొనుగోలు చేస్తామని చెప్పడంతో గంజాయిని తీసుకుని వచ్చినట్లు నిందితుడు తెలపడంతో ముగ్గురిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బాలికపై లైంగిక వేధింపులు.. యువకుడి అరెస్టు
పంజాగుట్ట: బాలికను లైంగికంగా వేధించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి వివరాల ప్రకారం.. జహీరాబాద్కు చెందిన మహమద్ మోహిజ్ (19) ఎంఎస్ మక్తాలో నివాసం ఉంటూ వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. సమీపంలో ఉంటున్న 13 ఏళ్ల బాలికను 3 నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవనంపైకి తీసుకెళ్లి, మెట్లపైన బాలికను వేధించేవాడు. ఒంటిపై కొరకడంతో బాలికకు జ్వరం వచ్చింది. తల్లి గమనించి.. గాయాలు ఏమిటని ప్రశ్నించింది. బాలిక అసలు విషయం చెప్పడంతో అతడికి దేహశుద్ధి చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
గుట్కా, బాణసంచా నిల్వలు స్వాధీనం
దుబ్బాక, న్యూస్టుడే: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను, ఎలాంటి అనుమతులు లేకుండా లక్షల విలువ చేసే బాణసంచా అక్రమంగా నిల్వ ఉంచి, అమ్ముతున్న ఇంటిపై దాడి చేసి, వాటిని స్వాధీనం చేసుకున్న ఘటన దుబ్బాక మండలంలోని హబ్షీపూర్లో మంగళవారం చోటుచేసుకుంది. సిద్దిపేట టాస్క్ఫోర్స్ సీఐ దిలీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హబ్షీపూర్ గ్రామంలో వీరమల్లు మధుకర్ అనే వ్యక్తి కిరాణంతో పాటు మెడికల్ షాప్ నిర్వహించేవాడు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడులు చేపట్టారు. రూ.2.25 లక్షల విలువైన గుట్కాలు, రూ.4 లక్షల విలువైన పటాకులను స్వాధీనం చేసుకున్న దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏటీఎం కార్డు కొట్టేశారు.. డబ్బులు తీయబోయి దొరికారు
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: రైల్లో ప్రయాణికుడి ల్యాప్లాప్, ఏటీఎం కార్డు దొంగిలించి డబ్బులు తీయబోయిన ఇద్దరిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై మాజీద్ తెలిపిన వివరాల ప్రకారం.. బన్సీలాల్పేట్కు చెందిన నానీ(22), మహబూబాబాద్కు చెందిన రాము(29)లు సికింద్రాబాద్లోని పెట్రోల్ బంక్ల వద్ద కార్పాలిష్ బాటిళ్లు విక్రయిస్తుంటారు. ఆ ఆదాయం సరిపోక చోరీల బాటపట్టారు. ఈనెల 21న మణుగూరు ఎక్స్ప్రెస్లో ఓ ప్రయాణికుడు సీట్పై ఉంచిన ల్యాప్లాప్ బ్యాగుతోపాటు అందులో ఉన్న ఏటీఎం కార్డును దొంగిలించారు. మంగళవారం సికింద్రాబాద్ ప్రాంతంలోని ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. బాధితునికి వచ్చిన సందేశం ఆధారంగా పోలీసులు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై దగ్గరలోనే ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లి అక్కడున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణంలో వారు నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి ల్యాప్టాప్, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434