పెరగనున్న పత్తి, కంది సాగు
వానాకాలం సాగుకు సంబంధించిన పంటల ప్రణాళిక ఖరారయ్యింది. జిల్లా వ్యవసాయాధికారులు దీనిని రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ డివిజన్ల పరిధిలో 5.95 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు
ఖరీఫ్ పంటల ప్రణాళిక ఖరారు
న్యూస్టుడే, వికారాబాద్, పరిగి
ఎరువు కలుపుతున్న రైతులు
వానాకాలం సాగుకు సంబంధించిన పంటల ప్రణాళిక ఖరారయ్యింది. జిల్లా వ్యవసాయాధికారులు దీనిని రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ డివిజన్ల పరిధిలో 5.95 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేశారు. విస్తీర్ణానికి తగ్గట్లుగా ఎరువులు, విత్తనాల అవసరాలను కూడా రూపొందించారు. అధికారుల లెక్కల ప్రకారం ఈ సీజన్లో పంటల సాగు విస్తీర్ణం స్వల్పంగా పెరగనుంది. గత సీజన్లో 5.92 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు.
తెల్లబంగారం వైపే మొగ్గు..
ప్రస్తుత వానాకాలం సీజన్లో అత్యధికంగా పత్తి పంట వేయడం వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తి క్వింటాలు ప్రభుత్వ మద్ధతు ధర రూ.6,225 ఉండటం, బహిరంగ విపణిలో ధర రూ.10 వేల పైచిలుకు పలకడంతో అధిక శాతం రైతులు పత్తి సాగు వైపే మొగ్గుచూపుతున్నారు. నిరుడు కూడా ప్రతికూల వాతావరణంతో పత్తి దిగుబడి తగ్గినా విపణిలో మంచి గిట్టుబాటు ధర లభించడంతో లాభాలు ఆర్జించారు. గతేడాది జిల్లాలో 1.96 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగు చేయగా, పంట నష్టపోయి ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. దిగుబడి తగ్గినా గరిష్ఠంగా పత్తి క్వింటాలుకు రూ.9,500 అమ్ముడుపోయింది. పత్తికి బదులు ఇతర పంటలు సాగు చేసిన రైతులు నష్టాలనెదుర్కొన్నారు. నాలుగేళ్ల అనుభవాల దృష్ట్యా అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు.
విత్తనాలు, ఎరువులు
పంటలకు అనుగుణంగా విత్తనాలను సైతం అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 2.5 లక్షల ఎకరాల పత్తి పంటకు ఎకరానికి రెండు పొట్లాలు(ప్యాకెట్లు) చొప్పున 5 లక్షల పొట్లాలు అవసరమవుతాయని అంచనా. కందికి 11 వేల క్వింటాళ్లు, వరికి 22,500 క్వింటాళ్లు, మొక్కజొన్నకు 4,100 క్వింటాళ్లు, సోయాబిన్ 100 క్వింటాళ్లు, మినుములు 800 క్వింటాళ్లు, పెసర 1,200 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కానున్నాయి. రాయితీ లేనందున్న వీటిని కొనుగోలు చేయల్సిందే. జిల్లాలో ఆయా రకాల పంటలు సాగు చేసేందుకు 95 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కానున్నాయని అధికారులు అంచనా వేశారు.
కంది: గత సీజన్లో 1.8 లక్షల ఎకరాల్లో కంది పంట సాగయింది. ఈసారి అదనంగా 45 వేల ఎకరాల్లో సాగు చేయాలని అధికారులు అంచనా వేసి ఆ దిశగా రైతులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం మద్ధతు ధర క్వింటాలుకు రూ.6,159 ప్రకటించగా, బహిరంగ విపణిలో మద్దతు మించి రూ.6,500 వరకు పలుకుతోంది. వరి తగ్గించి కంది సాగు వైపు రైతులను మొగ్గు చూపేలా అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కందిలో అంతర పంటగా అపరాలు(పెసర), మినుము, మొక్కజొన్న పంటలు సాగు చేసుకునే అవకాశం ఉండటంతో రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
మొక్కజొన్న: బహిరంగ విపణిలో మక్కలకు మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వ మద్దతు ధర రూ.1870 కాగా, బహిరంగ విపణిలో క్వింటాలు ధర రూ.2200 నుంచి రూ.2350 వరకు పలుకుతోంది. ధర లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకుంటే క్వింటాకు రూ.600 నష్టాన్ని ప్రభుత్వమే భరించాల్సి వస్తోందని, అందుకే మొక్కజొన్న సాగు చేపట్టకూడదని, ఒకవేళ సాగు చేస్తే ప్రభుత్వం కొనుగోలు చేయదని తేల్చి చెప్పారు. అయినా మొక్కజొన్న సాగు చేసిన రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించడంతో గత వానాకాలం సీజన్లో 66 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఈసారి అధికంగా సాగుకానుంది.
వరి: గత సీజన్లో 1.2 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈసారి 30 వేల విస్తీర్ణం తగ్గించేలా అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం, విద్యుత్తు, రోజు విడిచి రోజు నీటి తడులు పెట్టడం వంటి సమస్యలను ఏకరువు పెట్టి వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపుగా రైతులను మళ్లించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పంట మార్పిడి విధానం పాటించాలి
గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
గతంలో కంటే ఈసారి అధిక విస్తీర్ణంలో పత్తి, కంది పంటలు సాగయ్యే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. తొలిసారిగా క్లస్టర్ల వారీగా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నాం. విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు కచ్చితంగా రసీదు తీసుకోవాలి. పంట మార్పిడి విధానం అవలంభించాలని, వేసిన పంటలే వేస్తే భూసారం తగ్గడం, చీడపీడల బెడదతో పంటల దిగుబడులు తగ్గుతాయన్నది గుర్తుంచుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు