ఖర్చుకు వెనుకాడకుండా దవాఖానాల ఆధునికీకరణ
రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోకంటే రెండింతల నిధులు రూ.11,440 కోట్లు కేటాయించారని వైద్యారోగ్య శాఖ మంత్రి
తొలిసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు
వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
క్యాథ్ల్యాబ్ను ప్రారంభించి పరిశీలిస్తున్న మంత్రులు హరీశ్రావు, తలసాని తదితరులు
గాంధీ ఆసుపత్రి, న్యూస్టుడే: రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోకంటే రెండింతల నిధులు రూ.11,440 కోట్లు కేటాయించారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ఏకంగా రూ.2679కోట్లతో నాలుగు సూపర్స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు కాబోతున్నాయని చెప్పారు. ఆదివారం గాంధీఆసుపత్రిలో రూ.13కోట్లతో ఏర్పాటుచేసిన అత్యాధునిక ఎమ్మారై స్కానింగ్ యంత్రం, రూ.9కోట్లతో సమకూర్చిన క్యాథ్ల్యాబ్లను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేష్రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావులతో కలిసి హరీశ్రావు ప్రారంభించారు. రూ.2.70కోట్లతో నిర్మించనున్న అధునాతన డైట్ క్యాంటీన్ కిచెన్కు శంకుస్థాపన చేశారు.
అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ.. ఖర్చులకు వెనకాడకుండా ఆసుపత్రుల ఆధునికీకరణ, వైద్యపరికరాలు సమకూర్చడంవల్ల ఖరీదైన వైద్యసేవలు పేదలకు అందేలా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలు (ఇన్ఫెర్టిలిటీ సెంటర్) త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు. రూ.7.50కోట్లతో గాంధీఆసుపత్రి, పేట్లబురుజు, వరంగల్ ఆసుపత్రులలో వీటిని ఏర్పాటుచేస్తున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా, నిజామాబాద్, వేములవాడ, సిద్దిపేటలో మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లను ప్రారంభించామన్నారు. గాంధీలో 48 మోకీలు ఆపరేషన్లు జరగగా, ఉస్మానియాలో ఆరు నెలల్లో 50పైగా జరిగాయన్నారు.
పేదలకు ఉపయుక్తం
గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించిన క్యాథ్ల్యాబ్ పేదరోగులకు ఎంతగానో ఉపయోగపడనుందని తెలిపారు. గాంధీలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయనీ, రూ.100కోట్లతో అధునాతన వైద్యపరికరాలు, సదుపాయాలు సమకూర్చుతున్నామని తెలిపారు. ఆసుపత్రిలో రూ.30కోట్లతో స్టేట్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
కార్పొరేటుకు దీటుగా...ఉస్మానియాలో ప్రారంభించిన క్యాథ్ల్యాబ్వల్ల 250మందికి గుండె సంబంధ రోగులకు యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్ చికిత్సలు అందించామన్నారు. ఇప్పటికే వరంగల్ ఎంజీఎం, ఖమ్మం, అదిలాబాద్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, చెస్ట్, ఎంజీఎం, ఈఎన్టీ, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ఆసుపత్రులకు 21 సీటీస్కానింగ్ యంత్రాలను పంపిణీ చేశామన్నారు. ఇలాంటి సదుపాయాలు ఇదివరకు కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే ఉండేవని, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా అందుతున్నాయన్నారు.
రూ.20 కోట్లతో పరికరాల నిర్వహణ పాలసీ
అత్యాధునిక యంత్రాలు, పరికరాల నిర్వహణ, మరమ్మతులకు దారితీస్తే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా సీఎం కేసీఆర్ ఆలోచనమేరకు ప్రభుత్వం రూ.20కోట్లతో తొలిసారి బయోమెడికల్ ఎక్విప్మెంట్ మెయింటనెన్స్ పాలసీని తీసుకొచ్చిందని తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో వైద్యపరికరాలు ఎల్లప్పుడూ క్రియాశీలకంగా ఉండనున్నాయన్నారు. హైదరాబాద్లో 259 బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేశామని, మరో 91 ప్రాంతాల్లో రానున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఏర్పాటుచేసిన టీ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో 57 రకాల పరీక్షలు చేస్తుండగా, వాటి సంఖ్య 134కు పెంచబోతున్నాని తెలిపారు. ఆసుపత్రుల్లో రోగుల సహాయకుల కోసం 18 ప్రాంతాల్లో రూ.5కే భోజనం అందిస్తున్నామని, వారికి షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434