logo

మూడుముళ్ల బంధం.. రెణ్నెల్లకే అంతం

పెళ్లైయిన రెండు నెలలకే ఆ ఇంట విషాదం నెలకొంది. నగరంలోనైనా దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుందని అనుకున్నా.. స్మార్ట్‌ఫోన్‌ విషయంలో తలెత్తిన గొడవ నవవధువును ప్రాణాలు తీసుకునేలా చేసింది.

Updated : 09 Dec 2022 05:36 IST

చరవాణి వాడొద్దన్నాడని భార్య ఆత్మహత్య

శైలు

జీడిమెట్ల, న్యూస్‌టుడే: పెళ్లైయిన రెండు నెలలకే ఆ ఇంట విషాదం నెలకొంది. నగరంలోనైనా దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుందని అనుకున్నా.. స్మార్ట్‌ఫోన్‌ విషయంలో తలెత్తిన గొడవ నవవధువును ప్రాణాలు తీసుకునేలా చేసింది. జీడిమెట్ల డీఐ వై.రామకృష్ణ వివరాల మేరకు.. ఏపీలోని విజయవాడకు చెందిన కమల, జనార్దన్‌రెడ్డిల కుమార్తె శైలు(20)ను వైఎస్సార్‌ జిల్లా పులివెందులకు చెందిన ఓబుల్‌రెడ్డి కుమారుడు గంగాప్రసాద్‌రెడ్డికి అక్టోబరు 16న వివాహమైంది. చింతల్‌ శ్రీసాయికాలనీకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. భర్త ప్రైవేటు ఉద్యోగి. శైలు గృహిణి. ఆమె స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా వినియోగించేది. తల్లిదండ్రులు నచ్చజెప్పినా తీరు మార్చుకోలేదు. పెళ్లి చేస్తే మారుతుందనుకున్నా, ఏమ్రాతం మారలేదు. వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టేది. భర్త ఫోన్‌కు దూరంగా ఉండాలని పలుమార్లు చెప్పాడు. మార్పు రాలేదు. వారం క్రితం భర్త ఆమె చరవాణికి కొత్త పాస్‌వర్డ్‌ వేశాడు. తొలగించాలని.. వాగ్వాదానికి దిగింది. బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. భర్త వెంటనే ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. ఫోన్‌లో తల్లిదండ్రులు నచ్చజేప్పేందుకు యత్నించారు. ఆమె స్పందించకపోవడంతో తల్లి విజయవాడ నుంచి వచ్చేందుకు సిద్ధమయ్యారు. శైలు గురువారం తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని