ఇదీ లెక్క... ఇవ్వండి పక్కా
మౌలిక సౌకర్యాల అభివృద్ధికి జీహెచ్ఎంసీ, జలమండలి రాష్ట్ర సర్కారుకు రూ.7,470 కోట్లు కోరుతూ ప్రతిపాదనలు పంపాయి.
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లపై నగరవాసుల భారీ ఆశలు
శాఖల వారీగా ప్రతిపాదనలు
మౌలిక సౌకర్యాల అభివృద్ధికి జీహెచ్ఎంసీ, జలమండలి రాష్ట్ర సర్కారుకు రూ.7,470 కోట్లు కోరుతూ ప్రతిపాదనలు పంపాయి. అందులో పైవంతెనలు, రహదారులు, నాలాల అభివృద్ధి పనులకు అవసరమైన రూ.1500 కోట్ల కేటాయింపులు జరపాలని బల్దియా ఆర్థిక విభాగం సర్కారును కోరింది. మరోవైపు నగరంలో రెండో దశ మెట్రోకు నిధులివ్వాలని అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రవేశపెట్టనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పద్దుపై నగరవాసులు భారీ ఆశలు పెట్టుకున్నారు. విత్త మంత్రులు ఏ మేరకు కరుణిస్తారో మరి.
ఈనాడు, హైదరాబాద్
ప్రాజెక్టులను పూర్తి చేయాలని..
* రూ.1850కోట్ల అంచనాతో ఐదేళ్లపాటు నగరంలోని 812కి.మీ రోడ్లను మెరుగ్గా నిర్వహించాలని జీహెచ్ఎంసీ మూడేళ్ల క్రితం సీఆర్ఎంపీ(రహదారుల సమగ్ర నిర్వహణ కార్యక్రమం)ని పట్టాలెక్కించింది. ఇప్పటి వరకు రూ.950కోట్లు వెచ్చించింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రెండో దశలో మరో 800కి.మీ రోడ్లను సీఆర్ఎంపీ పరిధిలోకి తేవాలని జీహెచ్ఎంసీ ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించింది. మొదటి దశ పనుల పూర్తికి, రెండో దశ ప్రాజెక్టు వ్యయానికి రూ.500కోట్లు కేటాయించాలని జీహెచ్ఎంసీ సర్కారును కోరింది.
* రెండేళ్ల క్రితం వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని(ఎస్ఎన్డీపీ) ప్రారంభమైంది. ఆ పనులకు బల్దియా రూ.650కోట్ల బ్యాంకు రుణం తీసుకుంది. రెండో దశకు రూ.2,400కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోమారు బ్యాంకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదని నాలాలకు రూ.300కోట్లు ఇవ్వాల్సిందిగా అధికారులు ప్రభుత్వాన్ని కోరారు.
* రూ.30వేల కోట్ల అంచనాతో ఏడేళ్ల క్రితం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని(ఎస్సార్డీపీ) ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారు రూ.5వేల కోట్ల పనులు జరిగాయి. పురోగతిలో ఉన్న రూ.3వేల కోట్ల పనులు, రెండో దశ ఎస్సార్డీపీ పనులను పట్టాలెక్కించేందుకు జీహెచ్ఎంసీ సర్కారును రూ.500కోట్ల సాయం కోరింది.
* లింకు రోడ్ల పనులు ప్రస్తుతం వేర్వేరు దశల్లో ఉండగా, వాటిని వేగవంతం చేసేందుకు రూ.200కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. మూసీపై వంతెనలు, రెండు పడక గదులు, పార్కులు, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకూ కేటాయింపులు జరపాలని అధికారులు అంచనా వ్యయాలను సర్కారును నివేదించారు.
* ఉద్యోగులు, సిబ్బందికి నెలవారీ జీతాల చెల్లింపు, విశ్రాంత ఉద్యోగులకు నగదు ప్రయోజనాల అందజేతకు నానా అవస్థలు పడుతున్న బల్దియాకు ఆర్థిక భరోసా ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.
మెట్రో రెండోదశపై కేంద్రానికి వినతి
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో ఈసారి హైదరాబాద్ అభివృద్ధికి నిధుల కేటాయింపుపై భారీ ఆశలు ఉన్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో బడ్జెట్లో సముచిత ప్రాధాన్యం దక్కుతుందనే అంచనాలున్నాయి. హైదరాబాద్కు సంబంధించి మెట్రోరైలు రెండోదశకు రూ.8,453 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మొదటిదశలో మిగిలిన సర్దుబాటు వ్యయ నిధి రూ.252 కోట్లు ఇవ్వాలని అభ్యర్థించింది. యూపీఏ హయాంలో ప్రకటించిన ఐటీఐఆర్ను ఇవ్వాలని కోరింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే.
మెట్రోరైలు రెండో దశలో మూడు మార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఒక మార్గం రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కి.మీ. మార్గం నిర్మాణానికి అయ్యే రూ.6,250 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించి శంకుస్థాపన కూడా చేసింది. మిగిలిన రెండు మార్గాలకు నిధులివ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. బీహెచ్ఈఎల్ నుంచి కొండాపూర్ మీదుగా లక్డీకాపూల్ వరకు 26 కి.మీ., నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కి.మీ. మార్గం.. మొత్తం 31 కి.మీ.కు రూ.8,453 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్తో సహా ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది.
ఎంఎంటీ‘ఎస్’ అనేదెప్పుడు?
ఈనాడు- హైదరాబాద్: ఎంఎంటీఎస్ రెండో దశను వెంటనే పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. నగరానికి చెందిన ఎంపీలంతా ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశను 95 కిలో మీటర్ల మేర్ల రూ. 816 కోట్ల అంచనాతో చేపట్టారు. పనుల్లో జాప్యంతో అంచనా వ్యయం ప్రస్తుతం రూ.1100 కోట్లకు చేరిందని సమాచారం. సనత్నగర్-మౌలాలి మధ్య రక్షణశాఖకు చెందిన స్థలంలో నిర్మించాల్సిన రెండో లైను (మొత్తం 21కి.మీ.) మినహా మిగతాపనులు, విద్యుదీకరణ కూడా ఇప్పటికే పూర్తయింది. ఆ పనులూ పూర్తిచేసేలా బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి, నగరానికి చెందిన ఎంపీలు పట్టుపట్టాలని.. దీన్ని ఫిబ్రవరి 13న ప్రధాని ప్రారంభించేలా ఒత్తిడి తీసుకురావాలనీ జంటనగరాల ప్రజారవాణా వినియోగదారుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎంపీ రేవంత్రెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఈ దిశగా ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.5970 కోట్లతో జలమండలి..
రానున్న బడ్జెట్లో జలమండలి ప్రభుత్వం ముందు భారీ ప్రతిపాదనలు పెట్టింది. నీటి సరఫరా.. మురుగు నీటి వ్యవస్థ అభివృద్ధి.. కొత్త ప్రాంతాల్లో విస్తరణకు వివిధ పనులు.. గతంలో అభివృద్ధి పనులకు చేసిన అప్పుల చెల్లింపు మొత్తం రూ.5,970 కోట్లు ప్రతిపాదనలు పెట్టింది.
* గోదావరి, కృష్ణా మూడు దశల కోసం చేసిన అప్పుల అసలు చెల్లింపు, వార్షిక వడ్డీకి రూ.700 కోట్లు వరకు ఇవ్వాలని ప్రతిపాదనలు చేసింది.
* సుంకిశాల ప్రాజెక్టు పనులకు రూ.1400 కోట్లు వరకు ప్రతిపాదనలు పంపారు.
* మురుగు శుద్ధి కేంద్రాల పనులకు మరో రూ.1400 కోట్లు కావాలని ప్రతిపాదించారు.
* అవుటర్ రింగ్రోడ్డు ఫేజ్-2లో తాగునీటి నెట్వర్క్, రిజర్వాయర్ల పనులు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.1200 కోట్లు.. ఫేజ్-1లో జరిగిన పనుల చెల్లింపునకు రూ.170 కోట్లు అంచనా వేశారు. పాతబస్తీ జోన్-3లో మురుగు నీటి వ్యవస్థ బలోపేతానికి రూ.300 కోట్ల నిధులను ప్రతిపాదించారు. ఇవి కాకుండా పలు అభివృద్ధి పనుల మరో రూ.800 కోట్లతో అంచనాలు రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం