logo

ప్రెస్‌ అకాడమీ మాజీ ఛైర్మన్‌ శ్రీనాథ్‌రెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ మాజీ ఛైర్మన్‌, సీనియర్‌ జర్నలిస్టు దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి(67) మృతిపై మాజీమంత్రులు ఎంవీ మైసురారెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి సంతాపం తెలిపారు.

Published : 24 Mar 2023 02:40 IST

దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి

బండ్లగూడజాగీర్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ మాజీ ఛైర్మన్‌, సీనియర్‌ జర్నలిస్టు దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి(67) మృతిపై మాజీమంత్రులు ఎంవీ మైసురారెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి సంతాపం తెలిపారు. భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జర్నలిస్టుల సంక్షేమానికి శ్రీనాథ్‌రెడ్డి ఎంతో కృషి చేశారని ఏపీ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ పేర్కొన్నారు. భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనాథ్‌రెడ్డి పార్థివదేహాన్ని ఏపీలోని వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం మండలం కోరగుంటపల్లిలోని ఆయన స్వగృహానికి తరలించనున్నట్లు సమీప బంధువులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని