logo

ఆహార భద్రతకు దేశం కృషి: అజయ్‌గోయల్‌

 దేశం ఆహార భద్రతకు కృషి చేస్తోందని, తమ వంతుగా గోధుమలతో ప్రజలకు పౌష్టికాహారం అందించే ప్రయత్నం చేస్తున్నామని వీట్‌ ప్రొడక్ట్స్‌ ప్రమోషన్‌ (డబ్ల్యూపీపీఎస్‌) సొసైటీ ఛైర్మన్‌ అజయ్‌ గోయల్‌ అన్నారు.

Published : 25 Mar 2023 02:21 IST

ప్రసంగిస్తున్న అజయ్‌ గోయల్‌, చిత్రంలో వినోద్‌కపూర్‌, ఉన్నికృష్ణన్‌ విజయన్‌, పవన్‌ అగర్వాల్‌

రెడ్‌హిల్స్‌, న్యూస్‌టుడే:  దేశం ఆహార భద్రతకు కృషి చేస్తోందని, తమ వంతుగా గోధుమలతో ప్రజలకు పౌష్టికాహారం అందించే ప్రయత్నం చేస్తున్నామని వీట్‌ ప్రొడక్ట్స్‌ ప్రమోషన్‌ (డబ్ల్యూపీపీఎస్‌) సొసైటీ ఛైర్మన్‌ అజయ్‌ గోయల్‌ అన్నారు. డబ్ల్యూపీపీఎస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ)లోని సభామందిరంలో వీట్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌పై సదస్సు జరిగింది. సొసైటీ మాజీ అధ్యక్షుడు వినోద్‌ కపూర్‌, ఐటీసీ, వేర్‌హౌసింగ్‌, అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఉన్నికృష్ణన్‌ విజయన్‌, విశ్రాంత ఐఏఎస్‌ పవన్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని