దశాబ్ది.. దశదిశలా అభివృద్ధి
తెలంగాణ రాష్ట్ర సాకారంతో రాజధాని అభివృద్ధి ఊపందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచే బృహత్తర బాధ్యతను జీహెచ్ఎంసీ అప్పగించింది. ఆ మేరకు జీహెచ్ఎంసీ విస్తృత స్థాయి ప్రాజెక్టులను భుజానికెత్తుకుంది.
తెలంగాణ సాకారంతో పురోగమించిన రాజధాని
మౌలిక సౌకర్యాలకు జీహెచ్ఎంసీ పెద్దపీట
జిగేల్మంటున్న గచ్చిబౌలి శిల్పాలేఅవుట్ ఫ్లైఓవర్
తెలంగాణ రాష్ట్ర సాకారంతో రాజధాని అభివృద్ధి ఊపందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచే బృహత్తర బాధ్యతను జీహెచ్ఎంసీ అప్పగించింది. ఆ మేరకు జీహెచ్ఎంసీ విస్తృత స్థాయి ప్రాజెక్టులను భుజానికెత్తుకుంది. పైవంతెనలు, అండర్పాస్లు వంటి పనులను పూర్తి చేసింది. కేవలం.. రోడ్లు, భవనాల వంటి కొత్త ప్రాజెక్టులపైనే రూ.7,644.55కోట్లు వెచ్చించింది. ఇతరత్రా అభివృద్ధి పనులను బేరీజు వేస్తే అభివృద్ధి వ్యయం దాదాపు రెట్టింపవుతుందని అంచనా. మొత్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నాటికి.. జీహెచ్ఎంసీ నగరాభివృద్ధిని దశదిశలా వ్యాపింపజేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈనాడు, హైదరాబాద్
విజయాలు సాధిస్తూ ముందుకు..
* ఐటీ వినియోగంలో: కొత్త రాష్ట్రం ఏర్పాటుతో జీహెచ్ఎంసీ దేశంలోనే మొదటిసారి ఈ-ఆఫీసు విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఈ విధానంలో 3.13లక్షల ఫైళ్లు నడిచాయని జీహెచ్ఎంసీ చెబుతోంది. డిజిటల్ పాలన, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు, మైజీహెచ్ఎంసీ మొబైల్ యాప్, ఆస్తిపన్ను, నిర్మాణ అనుమతుల జారీ, ఇతరత్రా సేవలను డిజిటలీకరించడం వంటి అంశాల్లోనూ జీహెచ్ఎంసీ ఉత్తమ పనితీరు చూపింది. అందుకుగాను కేంద్ర ప్రభుత్వం పలు పురస్కారాలను అందించింది.
* మౌలిక సౌకర్యాల కల్పనలో.. ట్రాఫిక్ సిగ్నళ్లు లేని రహదారులను సాకారం చేయాలని సర్కారు ఆదేశించగా.. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) పేరుతో పైవంతెనలు, అండర్పాస్లు, నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వరద సమస్య నుంచి కాలనీలను గట్టెక్కించడమే లక్ష్యంగా వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎస్ఎన్డీపీ) ప్రారంభించింది. రోడ్ల నిర్వహణకు రహదారుల సమగ్ర నిర్వహణ (సీఆర్ఎంపీ) ప్రాజెక్ట్, హైదరాబాద్ రహదారుల అభివృద్ధి సంస్థ (హెచ్ఆర్డీసీఎల్) ద్వారా రోడ్ల విస్తరణ, లింకు రోడ్ల నిర్మాణం జరుగుతోంది.
* క్షేత్రస్థాయిలో పౌరుల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా హరితహారంలో భాగంగా ఖాళీ స్థలాలన్నింటిలో చెట్ల పెంపకం, థీమ్ పార్కుల అభివృద్ధి, కొత్తగా పార్కుల అభివృద్ధి, కాలనీల్లో వీడీసీసీ రోడ్లు, శ్మశానవాటికల్లో ఆహ్లాదకర వాతావరణం, ఆధునిక నిర్మాణాలు చేపట్టడం, ఇతరత్రా పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. కాలనీల్లో మల్టీ పర్పస్ ఫంక్షన్హాళ్లను నిర్మిస్తోంది. చేపల మార్కెట్లు, మున్సిపల్ మార్కెట్లు, జంతు వధశాలలు, చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణ, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ)లో భాగంగా చుట్టూ ఉన్న రోడ్ల ఆధునీకరణ, వీధి కుక్కల సమస్య పరిష్కారానికి జంతు సంరక్షణ కేంద్రాల నిర్మాణం, బస్తీల కోసం ఆదర్శ మార్కెట్లు, ఇతరత్రా పనులను బల్దియా చేపట్టింది.
* బ్యాంకు రుణాలు.. జీహెచ్ఎంసీ అభివృద్ధి పనుల కోసం అప్పు చేసేందుకు కూడా వెనకడుగు వేయలేదు. ఇప్పటి వరకు బాండ్ల జారీ ద్వారా రూ.495 కోట్లు, బ్యాంకు రుణాల ద్వారా రూ.6035 కోట్ల అప్పు తీసుకుంది.
* సాధారణ నిర్వహణ పనుల్లో భాగంగా రోడుల, వరద కాలువలు, మురుగునీటి కాలువల నిర్వహణకు గడిచిన తొమ్మిదేళ్లలో బల్దియా రూ.9,372.22 కోట్ల నిధులను వెచ్చించగా, మరో రూ.1500 కోట్ల పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సచివాలయం వద్ద పోలీసుల బందోబస్తు
అన్నిరంగాలకు అగ్రాసనం
రూ.76,523 కోట్లతో మౌలిక వసతులు, విస్తరణ పనులు ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తరువాత మహానగరంలో దాదాపు అన్ని రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విస్తరణ పెద్దఎత్తున జరిగింది. జీహెచ్ఎంసీ జలమండలి ఆధ్వర్యంలో ఈ పదేళ్లలో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం రూ.వేల కోట్లను వ్యయం చేశారు. ఫలితంగా రాజధాని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరాయి. కృష్ణా, గోదావరి నదుల నీటిని నగరానికి తీసుకురావడంతో తాగునీటి భరోసా ఏర్పడింది. ఇదే సమయంలో రోడ్ల విస్తరణతోపాటు ఎల్బీనగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి లాంటి రద్దీ ప్రాంతాల్లో ఆకాశమార్గాల నిర్మాణం చేపట్టడంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరికొంది. ఎస్ఆర్డీపీ కింద 35 పైవంతెనలు పూర్తి చేస్తే మరో 15 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. లింకు రోడ్ల నిర్మాణం వల్ల అనేక ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తీరాయి. రద్దీ రోడ్లను ప్రైవేటు సంస్థలకు అయిదేళ్లపాటు అప్పగించడంతో వీటి నిర్వహణ మెరుగుపడింది. హెచ్ఎండీఏ కూడా బాలానగర్, మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశమార్గాల నిర్మాణాన్ని పూర్తి చేసింది. పచ్చదనం పెంపొందించడంలో ఈ విభాగం కీలక ప్రగతిని సాధించింది. దక్షిణమండల విద్యుత్తు సంస్థ కూడా నగరంలో కొత్త సబ్ స్టేషన్లు, అభివృద్ధి పనులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం సైతం నగర పరిధిలోకి వచ్చే జాతీయ రహదారులను రూ.3 వేల కోట్లతో విస్తరించే పనిని మొదలుపెట్టింది. మొత్తమ్మీద నగరంతోపాటు చుట్టపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వం దాదాపు పదేళ్లలో రూ.76,523 కోట్లను అభివృద్ధి పనులపై వినియోగించింది.
విద్యుత్తు కాంతుల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు
[ 26-04-2024]
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై శుక్రవారం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం