logo

జుబ్లీహిల్స్‌ ఎంఐఎం అభ్యర్థిగా రాషెద్‌ ఫరాజుద్దీన్‌

జుబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఎంఐఎం అభ్యర్థిగా షేక్‌పేట కార్పొరేటర్‌ మహమ్మద్‌ రాషెద్‌ ఫరాజుద్దీన్‌ (36) బరిలోకి దిగనున్నారు.

Published : 07 Nov 2023 03:15 IST

షేక్‌పేట, న్యూస్‌టుడే: జుబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఎంఐఎం అభ్యర్థిగా షేక్‌పేట కార్పొరేటర్‌ మహమ్మద్‌ రాషెద్‌ ఫరాజుద్దీన్‌ (36) బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ సోమవారం ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ప్రకటించారు. ఇంటర్మీడియట్‌ చదివిన ఆయనకు ట్రావెల్స్‌ వ్యాపారం ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. 2009 నుంచి ఎంఐఎంలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్నారు. షేక్‌ఏట డివిజన్‌ నుంచి 2016, 2020లో కార్పొరేటర్‌గా గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని