ఖాళీ కడుపులు.. చెవికెక్కని పాఠాలు
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లేదని నిర్వాహకులు నిరవధిక సమ్మెకు దిగారు. డిమాండ్లు పరిష్కరించే వరకు పొయ్యి వెలిగించేదిలేదని జిల్లా విద్యాశాఖకు నోటీసులు అందించారు.
పాఠశాలల్లో నిలిచిన మధ్యాహ్న భోజనం
పెద్దపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లేదని నిర్వాహకులు నిరవధిక సమ్మెకు దిగారు. డిమాండ్లు పరిష్కరించే వరకు పొయ్యి వెలిగించేదిలేదని జిల్లా విద్యాశాఖకు నోటీసులు అందించారు. గడచిన ఆరు రోజులుగా పాఠశాలలో పొయ్యి వెలగడంలేదు. దీంతో విద్యార్థులు ఆర్ధాకలితో పాఠాలు వింటున్నారు. విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ వంట పాత్రల సమస్య ఎదురైంది. ఫలితంగా విద్యార్థులు ఇంటినుంచే భోజనాన్ని తెచ్చుకుంటున్నారు. సోమవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో ‘న్యూస్టుడే’ పరిశీలించింది. స్థానిక విద్యార్థులు ఇంటికి వెళుతుండగా దూర ప్రాంత విద్యార్థులు ఖాళీ కడుపుతోనే పాఠాలు వినే పరిస్థితి నెలకొంది. విద్యాశాఖ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుంటే బోధనపై ప్రభావం చూపనుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా తమకు గౌరవ వేతనాన్ని రూ.11,700కు పెంచాలని, ప్రతి పాఠశాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, మార్కెట్లో కోడిగుడ్డు ధర రూ.6 వరకు పలుకుతుండగా రూ.4 చెల్లించడంతో ఆర్థిక భారం పడుతుందని...ప్రభుత్వమే కోడిగుడ్లు సరఫరా చేయాలని, వంట పాత్రలు కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమ్మె ప్రకటించారు.
పాఠశాలల్లో వెలగని పొయ్యి
జిల్లాలో 358 ప్రాథమిక, 83 ప్రాథమికోన్నత, 101 ఉన్నత, 7 ఆదర్శ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. రోజువారిగా సుమారు 35 వేలకు పైగా విద్యార్థులు భోజనాన్ని తింటున్నారు. మార్కెట్లో రోజు రోజుకూ విపరీతంగా కూరగాయల ధరలు పెరగడంతో నష్టాలు చవిచూస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు. నిర్వాహకులు వంట గదికి తాళంవేడయంతో పాత్రలు అందుబాటులో లేవని ప్రత్యామ్నాయ నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు.
ఇంటి నుంచే భోజనం
పెద్దపల్లి మండలం అప్పన్నపేట జడ్పీ పాఠశాలకు బంధంపల్లి, అందుగులపల్లి, దేవునిపల్లి, క్రషర్నగర్, బ్రహ్మణపల్లి, రాగినేడు, కనగర్తి, కాసులపల్లి, భొంపెల్లి గ్రామాల నుంచి వస్తున్నారు. ఇక్కడ 260 మంది విద్యార్థులు చదువుతున్నారు. వంట చేయకపోవడంతో ఇంటినుంచే తీసుకొస్తున్నారు. స్థానిక విద్యార్థులు ఇళ్లలోకి వెళ్లి భోజనం చేసి వస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
- మాధవి, జిల్లా విద్యాధికారి
నిర్వాహకుల సమ్మె విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించాం. వంటపాత్రల సమస్య ఉంది. కొందరు పిల్లలు ఇంటినుంచి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సారూ.. ఇంటికెళ్లొస్తాం
పాఠశాలలో ఇంటికి పంపించమని ప్రాధేయపడుతున్న చిన్నారులు
మంథని గ్రామీణం, న్యూస్టుడే: మంథని బాలికల పాఠశాలలో మంథని, ముత్తారం మండలాల్లో పది గ్రామాల నుంచి ప్రవేశాలు తీసుకుంటున్నారు. 320 మంది చదువుతుండగా ఎక్కువ మంది దూరప్రాంతాల వారే ఉన్నారు. మధ్యాహ్నం వేళలో భోజనాన్ని తీసుకురాలేదని, ఇంటికి పంపించమని విద్యార్థులు ఉపాధ్యాయున్ని ప్రాథేయపడుతున్నారు. తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే ఇంటికి పంపిస్తామని ఉపాధ్యాయులు అంగీకరించడంలేదు.
ఇంటి బువ్వే దిక్కు
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న వంట మనుషులకు ప్రభుత్వం నుంచి సరైన బిల్లులు మంజూరు కాకపోవడంతో సమ్మె బాట పట్టారు. దీంతో రామగుండం నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేకుండా పోయింది. దీంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇంటి వద్ద నుంచే మధ్యాహ్న భోజనం వెంట తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. గోదావరిఖని ప్రభుత్వ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం పాఠశాలకు 336 మంది హాజరయ్యారు. అందరూ టిఫిన్ బాక్సులో అన్నం వెంట తీసుకుని ఇలా ఒకే చోట కూర్చొని తింటున్నారు.
-న్యూస్టుడే, మార్కండేయకాలనీ
అంతా అయోమయం
సుల్తానాబాద్లో భోజనాన్ని వడ్డిస్తున్న ప్రత్యామ్నాయ నిర్వాహకులు
సుల్తానాబాద్, న్యూస్టుడే: సుల్తానాబాద్ ఉన్నత పాఠశాలలో సమీప గ్రామాల నుంచి విద్యార్థులు చదువుకుంటున్నారు. గత మూడు రోజులుగా వంట నిర్వాహకులు సమ్మె చేయడంతో పాఠశాలల్లో అసలు భోజనం పెడతారో లేదోనని విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. పాఠశాలల్లో భోజనం వండేవారు కరవయ్యారు. విద్యార్థులే ఇంటినుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. సదుపాయం లేనివారు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అస్త్రశస్త్రాలతో ప్రచారానికి సిద్ధం
[ 28-04-2024]
నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు.. ఓటర్ల మన్ననలు పొందేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. -
జిల్లా అభివృద్ధి చెందాలంటే వినోద్ గెలవాలి
[ 28-04-2024]
కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే ప్రజలు భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు కోరారు. -
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు పోటీ
[ 28-04-2024]
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య పోటీ అని.. ఎటు వైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కోరారు. -
పెరిగిన ఓటర్లు.. 8,758
[ 28-04-2024]
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటర్లు పెరిగారు. ఫిబ్రవరి నెల 8వ తేదీన విడుదలైన ఓటరు ముసాయిదా తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం ఓటు వేసే వారి సంఖ్య పెరిగింది. -
విదేశాల్లో ఉన్నా వదిలేదే లే!
[ 28-04-2024]
కరీంనగర్ భూ దందాలో భాగమై కేసులు నమోదైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరు అరెస్టై జైలుకెళ్లగా ఇంకొందరు తప్పించుకు తిరుగుతున్నారు. -
కరీంనగర్లో 6.. పెద్దపల్లిలో 4
[ 28-04-2024]
దేశంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ఆదరించారు. -
66.44 శాతమే అధికం
[ 28-04-2024]
మొదటి రెండు పర్యాయాలు కరీంనగర్ ద్విసభ్య నియోజకవర్గ పరిధిలో ఉన్న పెద్దపల్లి లోక్సభ స్థానానికి 1962 నుంచి విడిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 విడతల్లో ఎన్నికలు జరిగినా ఎప్పుడూ 67 శాతానికి మించి పోలింగ్ నమోదు కాలేదు. -
అనిశా వలలో ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్
[ 28-04-2024]
గిఫ్ట్ డీడ్ కింద పట్టా మార్పిడి కోసం రూ.10 వేల లంచం తీసుకుంటూ గంగాధర ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్ సురేశ్బాబు శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. -
మొత్తం ఓటర్లు 15,96,430
[ 28-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. కొద్ది రోజులుగా క్షేత్ర స్థాయిలో అధికారులు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి నుంచి కొత్తగా స్వీకరించిన దరఖాస్తుల వడబోత చేపట్టారు. -
ఆస్తుల పరిరక్షణ.. చోరీల నియంత్రణ
[ 28-04-2024]
సింగరేణి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని.. చోరీల నియంత్రణకు నిరంతరం అధికారులతో చర్చిస్తున్నామని సింగరేణి ముఖ్య భద్రతాధికారి దీక్షితులు అన్నారు. -
అభివృద్ధి చూపి ఓట్లడగాలి
[ 28-04-2024]
గత ఎంపీ ఎన్నికల్లో తన భార్య మంగళసూత్రాలు అమ్మి పోటీ చేశానని చెబుతున్న బండి సంజయ్ అయిదేళ్లలో రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంతి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ఎన్నికల వేళ... పెరగని మద్యం అమ్మకాలు
[ 28-04-2024]
ఎన్నికలు అనగానే పోటీలో ఉన్న అభ్యర్థులు మద్యం పంపిణీ, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ జిల్లాలో మాత్రం మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం చూపలేదు. -
వెంటాడుతున్న అకాల వర్ష భయం
[ 28-04-2024]
అన్నదాతలు వరి గింజలు పూర్తిగా ఎండకుండానే... కమతాలు తడారకుండానే వరి కోతలు చేపడుతున్నారు. అకాల వర్షాల భయంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ముమ్మరం చేశారు. వరి కోత యంత్రాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. -
విస్తరించని జాతీయ మార్కెట్ వ్యవస్థ
[ 28-04-2024]
రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలందిస్తూ దేశవ్యాప్తంగా విపణిపై పట్టుసాధించటం.. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నల్లబజారుకు తరలకుండా చూసి.. సరకుల నియంత్రణతో ధరల అదుపు ప్రధాన ఉద్దేశంగా కేంద్రప్రభుత్వం ఈ-నామ్(ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్)ను 2016 ఖరీఫ్నకు ముందు ప్రవేశపెట్టింది. -
కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమ పథకాలు
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుతో కలిసి కార్నర్ సమావేశంలో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..