ఇళ్ల నిర్మాణం పూర్తయినా... పంపిణీ జాడేదీ..!
నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పాలకుల నిర్లక్ష్యమో అధికారుల పర్యవేక్షణ లేకనో ఇళ్ల నిర్మాణం పూర్తయినా నేటికీ నిరుపేద లబ్ధిదారులకు వాటిని కేటాయించడం లేదు.
లబ్ధిదారులకు తప్పని ఎదురు చూపులు
ఇల్లంతకుంటలో పూర్తయిన రెండు పడకగదుల ఇళ్లు
న్యూస్టుడే, ఇల్లంతకుంట: నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పాలకుల నిర్లక్ష్యమో అధికారుల పర్యవేక్షణ లేకనో ఇళ్ల నిర్మాణం పూర్తయినా నేటికీ నిరుపేద లబ్ధిదారులకు వాటిని కేటాయించడం లేదు. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, కందికట్కూర్, ఓబులాపూర్, ఇల్లంతకుంట, పెద్దలింగాపూర్ గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. కందికట్కూర్లో 48, ఒబులాపూర్లో 24, పొత్తూరులో 32, పెద్దలింగాపూర్లో 40, ఇల్లంతకుంటలో 40 ఇళ్లు నిర్మించారు. చాలాచోట్ల పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. చిన్నచిన్న పనులు చేపట్టాల్సి ఉండగా వాటిని పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. కొన్ని గ్రామాల్లో అభ్యంతరాలు వచ్చినా అక్కడ గ్రామ సభలను నిర్వహించి లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు లేకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించారు. ఇల్లంతకుంటలో ఇళ్ల నిర్మాణం పూర్తయింది. లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయగా కేటాయింపులకు ఇంకా నిర్ణయించలేదు. దానికి తోడు ఇళ్లలోకి వెళ్లాలంటే సరైనదారి లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అధికారుల అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ దుస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కందికట్కూర్లో డ్రా పద్ధతిలో ఇళ్లు కేటాయించారు. పంపిణీ చేయకముందే పలువురు వాటిని తాత్కాలికంగా వాడుకుంటున్నారు. ఒబులాపూర్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసినా డ్రా నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దలింగాపూర్లో సైతం ఇదే దుస్థితి నెలకొంది. ఇళ్లు పంపిణీ చేస్తామని ఏళ్ల తరబడి ఊరిస్తుండటంతో ఆశావహులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రోజురోజుకూ ప్రభుత్వం నిబంధనలు మార్చుతుండటంతో ఎంపికైన ఏ సమస్యలు వచ్చిపడతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఇళ్లు పంపిణీ చేయాలంటూ ఇటీవల గ్రామం నుంచి ఇల్లంతకుంటకు పాదయాత్ర చేపట్టారు. ముస్కానిపేటలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంకోసం శిలాఫలకం వేసినా నేటికీ అతీగతీలేదు. నిర్మాణాలు మంజూరైన గ్రామాల్లో ఇళ్లు పూర్తి కాగా ఇక్కడ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. పలుచోట్ల ఇప్పటికే ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ఏళ్లు గడిచాయని.. పూర్తయిన వాటిని పంపిణీ చేసేందుకు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందని అర్హులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని వెంటనే రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
ఎంపిక పూర్తయింది
-రవికాంత్, తహసీల్దార్, ఇల్లంతకుంట
మండలంలోని ఐదు గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక సైతం పూర్తిచేశాం. ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతాం. ఐదు గ్రామాల్లో రెండు పడక గదుల ఇళ్ల కాలనీలో ఎలాంటి సమస్యలు నా దృష్టికి రాలేదు. ఉంటే పంపిణీకి ముందే పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తాం.
ఇబ్బందులు తీర్చాలి
-స్వరూప, పెద్దలింగాపూర్
మా గ్రామంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభించి ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. అర్హులైన వారి ఎంపిక పూర్తి చేశారు. పనులు పూర్తి చేసి వెంటనే పంపిణీ చేయాలి. కూలిపోయిన ఇంటిపై కవర్ కప్పుకొని ప్రస్తుతం నివాసం ఉంటున్నాం. పాలకులు, అధికారులు వెంటనే ఇళ్లు అందించి ఇబ్బందులు తీర్చాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయ్యో రైతన్నా..
[ 08-05-2024]
జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. శ్రమ ఫలితం చేతికందే ముందు ధాన్యం తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వ్యూహాలకు పదును!
[ 08-05-2024]
లోక్సభ పోరు చివరి అంకానికి చేరుతోంది. ఓటరు తీర్పు వెల్లడించే సమయం ముంచుకొస్తుండటంతో అభ్యర్థులు ప్రచార వేగం పెంచుతున్నారు. ‘సమయం లేదు మిత్రమా’..అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. -
ఇందూరు.. హోరాహోరీ పోరు
[ 08-05-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో హోరాహోరీ పోరు జరుగుతోంది. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. -
‘చివరి ఎన్నిక.. ఆశీర్వదించండి’
[ 08-05-2024]
‘వయసు మీరింది. మళ్లీ ఓట్లు చూస్తానో.. చూడనో.. ఎన్నికల్లో పోటీకి ఇదే చివరి అవకాశం. ఆపదలో ఉన్నా ఓటుతో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించండి’ అని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ప్రజలను కోరారు. -
హుషారుగా వచ్చి.. ఉసురుమంటూ!
[ 08-05-2024]
కరీంనగర్లో మంగళవారం నిర్వహించాల్సిన సభ గాలివాన బీభత్సంతో రద్దు అయింది. సభాస్థలి వద్ద పరిస్థితి చిన్నాభిన్నమైంది. గాలులకు సభావేదిక వద్ద వేసిన టెంట్లు కుప్పకూలాయి. -
‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విమానాశ్రయం ఆలస్యం’
[ 08-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ఆలస్యం అయిందని, ప్రతిపాదిత భూమిని అప్పగిస్తే ఏడాదిలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి అర్వింద్ పేర్కొన్నారు. -
పట్టణవాసులు కదలాలి
[ 08-05-2024]
పల్లెలతో పోలిస్తే అక్షరాస్యత శాతం అధికంగా ఉన్నా పట్టణవాసులు మాత్రం ఎన్నికల పోలింగ్పై ఆసక్తి చూపడం లేదు. జగిత్యాల జిల్లా అయిదు పురపాలక సంఘాలతో ప్రత్యేకతను చాటుతుండగా ఈ ఒరవడి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తేనే స్పష్టమైన ఫలితం -
పట్టణాల్లో నిర్లక్ష్యం.. పల్లెల్లో ఆదర్శం
[ 08-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతంలో అందరికీ సౌకర్యంగా ఉండేలా ఓటింగ్ రోజున సెలవు ప్రకటించినా ఆశించిన మేరకు ఓటింగ్శాతం నమోదు కావడం లేదు. -
కాంగ్రెస్ గెలుపు జిల్లాకు అవసరం
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్రావు గెలిస్తే.. జిల్లా మరింత అభివృద్ధిని సాధించేందుకు అవకాశముంటుందని, భాజపా, భారాస అభ్యర్థుల గెలుపుతో ప్రయోజనం ఏమీ ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. -
కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదు
[ 08-05-2024]
కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదని, ఆ పార్టీ దళితులకు అన్యాయం చేస్తోందని భాజపా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
పనితీరు బేరీజు వేయండి
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారని భాజపా జతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
అభివృద్ధి కోరుకుంటే భారాసకు ఓటేయండి
[ 08-05-2024]
అన్ని వర్గాల ప్రజలు, రైతులపట్ల కాంగ్రెస్ అనాలోచితంగా వ్యవహరిస్తోందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక వారధి.. అవకాశాల పెన్నిధి
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం అంటేనే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు నెలవు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారు. అందుకే ఏ గ్రామానికి వెళ్లినా అంజన్న, రాజన్న పేర్లు సాధారణంగా వినిపిస్తుంటాయి. -
అతివల ఆదరణ దక్కేదెవరికో!
[ 08-05-2024]
సార్వత్రిక సమరంలో పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు గెలుపు వ్యూహాలు ముమ్మరం చేశారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు యువకుల దుర్మరణం
[ 08-05-2024]
ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. -
రూ.9.42 లక్షల నగదు పట్టివేత
[ 08-05-2024]
జగిత్యాల పట్టణం మోచిబజార్లో ఎస్సై మన్మదరావు ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టగా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి కె.శిరీష ఎలాంటి ఆధారం లేకుండా తీసుకెళ్తున్న రూ.4.84 లక్షలను పట్టుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM