లహరి బస్సులకు ఆదరణ
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకెళ్తోంది. ప్రైవేటు రవాణా రంగంతోపాటు పోటీపడి అధునాతన బస్సులు తీసుకొస్తోంది
కరీంనగర్-1 డిపోనకు 54 రోజుల్లో రూ.67 లక్షల ఆదాయం
లహరి బస్సు
న్యూస్టుడే, కరీంనగర్ రవాణా విభాగం: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకెళ్తోంది. ప్రైవేటు రవాణా రంగంతోపాటు పోటీపడి అధునాతన బస్సులు తీసుకొస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ‘లహరి’ పేరుతో స్లీపర్ బస్సులను ప్రవేశ పెట్టింది. కరీంనగర్ రీజియన్కు ఆరు సర్వీసులు కేటాయించగా.. వాటికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది.
వేసవిలో డిమాండ్..
కరీంనగర్-1 డిపో నుంచి బెంగళూరుకు నడుపుతున్న లహరి బస్సులకు సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి మార్చి 25 వరకు రూ.67.15 లక్షల ఆదాయం వచ్చింది. ఒక బస్సు కరీంనగర్ నుంచి బెంగళూరు వెళ్లి (వందశాతం ఓఆర్) రావాలంటే రూ.1.87 లక్షలు రావాలి. ప్రస్తుతం సగటున రూ.96 వేలు ఆదాయం, 52 శాతం ఓఆర్ నమోదవుతోంది. డీజిల్, చోదకుడి వేతనం, టోల్ఛార్జి, ఇతర ఖర్చులు రూ.60 వేలు అవుతాయని డీఎం లక్కు మల్లేశం తెలిపారు. గోదావరిఖని డిపోనకు సంబంధించి వంద శాతం ఓఆర్ వస్తే రూ.1.80 లక్షల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం రూ.60 వేల ఆదాయం, 41 శాతం ఓఆర్ వస్తున్నట్లు ఆ డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. వేసవి కాలం కావడం, ఎండలు పెరిగిపోతుండటంతో ప్రయాణికులు ఏసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. వేసవి కావడంతో లహరి బస్సులకు డిమాండ్ భారీగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
బెంగళూరుకు మూడు సర్వీసులు...
కరీంనగర్-1కు 4, గోదావరిఖని డిపోనకు 2 కేటాయించారు. ఈ బస్సులో 22 సీట్లు, 20 స్లీపర్ బెర్తులు ఉన్నాయి. ఉచిత వైఫై, ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. లహరి బస్సులను కరీంనగర్, గోదావరిఖని నుంచి బెంగళూరుకు నడుపుతున్నారు. కరీంనగర్ నుంచి 2 సర్వీసులు, గోదావరిఖని నుంచి ఒక సర్వీసు నడుపుతున్నారు. ప్రతి రోజు సాయంత్రం 5, 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.30, 6.30కు తిరిగి ప్రయాణమవుతాయి.
టికెట్పై పది శాతం రాయితీ
ప్రస్తుతం వేసవి కావడంతో చాలా మంది ఏసీ బస్సుల్లో ప్రయాణానికి మొగ్గు చూపుతారు. వర్ష, చలికాలాల్లో ఏసీ బస్సుల్లో తక్కువ మంది వెళ్తుంటారు. సందర్భాన్ని బట్టి లహరి ఛార్జీల్లో మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సర్వీసుల్లో టికెట్ ఛార్జీపై పది శాతం రాయితీ ఇస్తున్నారు. ఏప్రిల్ 30 వరకు ఈ రాయితీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఇవీ ప్రత్యేకతలు
- బస్సులో మొత్తం 42 మంది ప్రయాణించవచ్చు. 22 సీట్లు కూర్చోవడానికి, 20 బెర్తులు పడుకోవడానికి ఉంటాయి.
- ఎవరి సీట్ల వద్ద వాళ్లు ఏసీని అవసరం మేరకు కంట్రోల్ చేసుకోవచ్చు.
- బెడ్లైట్ సౌకర్యమూ ఉంది.
- బస్సుకు రివర్స్ కెమెరాతోపాటు లోపల 3 సీసీ కెమెరాలు అమర్చారు.
- అనౌన్స్మెంట్ చేయడానికి చోదకుడి క్యాబిన్లో మైక్ ఉంది.
- జీపీఎస్కు అనుసంధానం ఉండటంతో ప్రయాణికులు గమ్యం యాప్ ద్వారా బస్సు ఎక్కడ వరకు వచ్చిందో తెలుసుకోవచ్చు.
ప్రైవేటు బస్సులకు దీటుగా సేవలు
లహరి బస్సులకు ఇప్పుడిప్పుడే ప్రయాణికుల నుంచి ఆదరణ వస్తోంది. వేసవి కావడంతో మరింత పెరుగుతుందని అనుకుంటున్నాం. ప్రైవేట్ బస్సులకు దీటుగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.
-ఎన్.సుచరిత, ఆర్ఎం, కరీంనగర్ రీజియన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అస్త్రశస్త్రాలతో ప్రచారానికి సిద్ధం
[ 28-04-2024]
నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరు పెంచారు.. ఓటర్ల మన్ననలు పొందేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. -
జిల్లా అభివృద్ధి చెందాలంటే వినోద్ గెలవాలి
[ 28-04-2024]
కరీంనగర్ అభివృద్ధి చెందాలంటే ప్రజలు భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు కోరారు. -
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు పోటీ
[ 28-04-2024]
గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య పోటీ అని.. ఎటు వైపు ఉంటారో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కోరారు. -
పెరిగిన ఓటర్లు.. 8,758
[ 28-04-2024]
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటర్లు పెరిగారు. ఫిబ్రవరి నెల 8వ తేదీన విడుదలైన ఓటరు ముసాయిదా తుది జాబితాతో పోలిస్తే ప్రస్తుతం ఓటు వేసే వారి సంఖ్య పెరిగింది. -
విదేశాల్లో ఉన్నా వదిలేదే లే!
[ 28-04-2024]
కరీంనగర్ భూ దందాలో భాగమై కేసులు నమోదైన వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే కొందరు అరెస్టై జైలుకెళ్లగా ఇంకొందరు తప్పించుకు తిరుగుతున్నారు. -
కరీంనగర్లో 6.. పెద్దపల్లిలో 4
[ 28-04-2024]
దేశంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన సార్వత్రిక, ఉప ఎన్నికల్లో కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులను ఆదరించారు. -
66.44 శాతమే అధికం
[ 28-04-2024]
మొదటి రెండు పర్యాయాలు కరీంనగర్ ద్విసభ్య నియోజకవర్గ పరిధిలో ఉన్న పెద్దపల్లి లోక్సభ స్థానానికి 1962 నుంచి విడిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 విడతల్లో ఎన్నికలు జరిగినా ఎప్పుడూ 67 శాతానికి మించి పోలింగ్ నమోదు కాలేదు. -
అనిశా వలలో ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్
[ 28-04-2024]
గిఫ్ట్ డీడ్ కింద పట్టా మార్పిడి కోసం రూ.10 వేల లంచం తీసుకుంటూ గంగాధర ఇన్ఛార్జి సబ్రిజిస్ట్రార్ సురేశ్బాబు శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. -
మొత్తం ఓటర్లు 15,96,430
[ 28-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. కొద్ది రోజులుగా క్షేత్ర స్థాయిలో అధికారులు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి నుంచి కొత్తగా స్వీకరించిన దరఖాస్తుల వడబోత చేపట్టారు. -
ఆస్తుల పరిరక్షణ.. చోరీల నియంత్రణ
[ 28-04-2024]
సింగరేణి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని.. చోరీల నియంత్రణకు నిరంతరం అధికారులతో చర్చిస్తున్నామని సింగరేణి ముఖ్య భద్రతాధికారి దీక్షితులు అన్నారు. -
అభివృద్ధి చూపి ఓట్లడగాలి
[ 28-04-2024]
గత ఎంపీ ఎన్నికల్లో తన భార్య మంగళసూత్రాలు అమ్మి పోటీ చేశానని చెబుతున్న బండి సంజయ్ అయిదేళ్లలో రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంతి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ఎన్నికల వేళ... పెరగని మద్యం అమ్మకాలు
[ 28-04-2024]
ఎన్నికలు అనగానే పోటీలో ఉన్న అభ్యర్థులు మద్యం పంపిణీ, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ జిల్లాలో మాత్రం మద్యం అమ్మకాలపై ఎన్నికల ప్రభావం చూపలేదు. -
వెంటాడుతున్న అకాల వర్ష భయం
[ 28-04-2024]
అన్నదాతలు వరి గింజలు పూర్తిగా ఎండకుండానే... కమతాలు తడారకుండానే వరి కోతలు చేపడుతున్నారు. అకాల వర్షాల భయంతో ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ముమ్మరం చేశారు. వరి కోత యంత్రాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. -
విస్తరించని జాతీయ మార్కెట్ వ్యవస్థ
[ 28-04-2024]
రైతుల పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలందిస్తూ దేశవ్యాప్తంగా విపణిపై పట్టుసాధించటం.. పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నల్లబజారుకు తరలకుండా చూసి.. సరకుల నియంత్రణతో ధరల అదుపు ప్రధాన ఉద్దేశంగా కేంద్రప్రభుత్వం ఈ-నామ్(ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్)ను 2016 ఖరీఫ్నకు ముందు ప్రవేశపెట్టింది. -
కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమ పథకాలు
[ 28-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుతో కలిసి కార్నర్ సమావేశంలో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..