గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది.
జగిత్యాల, న్యూస్టుడే: సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. ఈ మేరకు మల్టీజోన్-1 ఐజీ ఎ.వి.రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి అంబులెన్స్లో 70 కిలోల గంజాయి రాజస్థాన్కు తరలిస్తుండగా 2023 ఫిబ్రవరి 1న సారంగాపూర్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలించే నలుగురిని రిమాండ్కు పంపించి గంజాయితో సహా అంబులెన్స్ను పోలీసుస్టేషన్ ఆవరణలో ఉంచారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు అంబులెన్స్ అద్దం పగులగొట్టి గంజాయిని మాయం చేశారు. ఈనెల 1న సంఘటన వెలుగు చూడగా జిల్లా ఎస్పీ సన్ప్రీత్సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిపై నివేదిక పంపించిన నేపథ్యంలో అప్పటి ఎస్సై జి.మనోహర్రావు, ప్రస్తుత ఎస్సై ఎ.తిరుపతి, హెడ్కానిస్టేబుల్ బి.రవీందర్రెడ్డి, కానిస్టేబుల్ టి.నరేందర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గంజాయిని పట్టుకున్న హెడ్కానిస్టేబుల్ బి.రవీందర్రెడ్డి సస్పెండ్ కావడం విస్మయానికి గురి చేసింది.
దొరికిన దొంగలు! : పోలీసుస్టేషన్ ఆవరణలో నిలిచి ఉంచిన వాహనం నుంచి గంజాయి మాయమైన సంఘటనను జిల్లా ఎస్పీ సన్ప్రీత్సింగ్ తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు రకాలుగా విచారణ జరపగా గంజాయి మాయం చేసిన వారిని గుర్తించారు. మండలంలోని రంగపేట, రేచపల్లికి చెందిన మైనర్లు సంఘటనకు బాధ్యులుగా తేలినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్యూఆర్ కోడ్తో ఓపీ రిజిస్ట్రేషన్
[ 01-05-2024]
ఓపీ రిజిస్ట్రేషన్ కోసం వరుసలో నిల్చునే అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మెట్పల్లి ప్రభుత్వాసుపత్రిలో బుధవారం నుంచి అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. -
లక్ష ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ లక్ష్యం
[ 01-05-2024]
‘ప్రతి ఇంటికి వెళ్లండి.. చేసిన ప్రగతిని చెప్పండి.. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు లక్ష ఓట్ల ఆధిక్యతను అందించాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. -
పదిలో మెరుగైన ఫలితాలు
[ 01-05-2024]
జిల్లాలో 11,380 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా 10,898 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 95.76 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. -
ఆ రెండు పార్టీలు ఒక్కటే
[ 01-05-2024]
కాంగ్రెస్, భాజపాలు ఒక్కటేనని భారాస నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, -
పదిలో ఎనిమిదో స్థానం
[ 01-05-2024]
జిల్లా పదో తరగతి ఫలితాల్లో అధికారుల సమష్టి సహకారంతో 96.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో 102 జడ్పీ ఉన్నత, 7 ఆదర్శ, 10 కస్తూర్బా, 6 మహాత్మా జ్యోతిబా, 1 తెలంగాణ గురుకులం, -
పోలింగ్ కేంద్రం.. సమగ్ర సమాచారం
[ 01-05-2024]
ఓటర్లకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్ల జాబితా, స్లిప్పుల పంపిణీ నుంచి మొదలుకొని పోలింగు నిర్వహణ వరకు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు -
పెరిగిన వినియోగం.. గృహజ్యోతికి దూరం
[ 01-05-2024]
ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. విద్యుత్తు మీటర్లు గిర్రుగిర్రునా తిరుగుతున్నాయి. అత్యవసరమైతే తప్పా జనాలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. -
ఆ రెండు పార్టీలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా, భారాసలను ఓడిస్తేనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని తెలంగాణ జన సమితి(తెజస) వ్యవస్థాపకుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన భాజపా, భారాసలు
[ 01-05-2024]
భారతీయ జనతా పార్టీ, భారాసలు ప్రజల సంక్షేమాన్ని విస్మరించాయని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. -
మోదీ బహిరంగ సభ విజయవంతానికి పిలుపు
[ 01-05-2024]
వేములవాడ పట్టణంలో మే 8న జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పిలుపునిచ్చారు. -
పది ఫలితాల్లో అదుర్స్
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాల సాధన కోసం జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. మంగళవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పది ఫలితాల్లో 98.27 శాతంతో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. -
శ్రమజీవి గుండె సడి వినండి
[ 01-05-2024]
ఎండనక వాననక కష్టాన్నే నమ్ముకొని జీవించే కార్మికులు.. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు దాటినా హక్కుల కోసం పోరాటాలు చేయాల్సి వస్తోంది. కష్టజీవులు, కర్మ వీరులకు కనీస వసతుల కల్పనలో పాలకులు విఫలమవుతున్నారు. -
గంజాయి చోరీ కేసులో ఆరుగురి అరెస్టు
[ 01-05-2024]
పోలీసుస్టేషన్ నుంచి గంజాయి దొంగిలించిన కేసులో మంగళవారం ఆరుగురిని అరెస్టు చేశారు. జగిత్యాల డీఎస్పీ డి.రఘుచందర్ వివరాలు వెల్లడించారు. -
వాట్సాప్.. ఎన్నికలపై అప్డేట్
[ 01-05-2024]
ఎన్నికల నిర్వహణ తీరుపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చర్యలు తీసుకుంటోంది. -
68 మందిపై అనర్హత వేటు
[ 01-05-2024]
2019లో నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేయగా వీరిలో వివిధ పార్టీల నుంచి ఏడుగురు బరిలో దిగగా, మిగతా వారు స్వతంత్రులు.
తాజా వార్తలు (Latest News)
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్! (Hold)
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య