బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
లోక్సభ ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం
జిల్లా కంట్రోల్ రూంలో సిబ్బందితో పర్యవేక్షిస్తున్న జిల్లా నోడల్ అధికారి రవీందర్
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్ : లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుండటంతో బరిలో నిలిచే అభ్యర్థుల కదలికలు, ప్రచారాలపై ఓ కన్నేసింది. నిఘా బృందాలతో నిరంతరం పర్యవేక్షిస్తోంది. స్వేచ్ఛాయుత, పారదర్శకత ఎన్నికలకు అమలు చేస్తున్న సి-విజిల్, 1950 టోల్ ఫ్రీ నంబర్ ఫిర్యాదులపై, ప్రచార అనుమతల కోసం సువిధ యాప్ల నిర్వహణపై ప్రజల్లో చైతన్యం చేయడంతో స్పందన పెరుగుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారాలు, రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలను గమనిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
నియోజకవర్గాల్లో ఈవీఎంలు భద్రం
లోక్సభ ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఈవీఎంలను జిల్లాలో మొదటి విడతలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేశారు. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ప్రతి ఒక యంత్రం పనితీరు, సాంకేతిక సమస్యలను పరిశీలించి సందేహాలను తొలగించారు. ఇక్కడ నుంచి నియోజకవర్గాలకు తరలించారు. రామగుండం నియోజకవర్గంలో 325 బ్యాలెట్ యూనిట్లు, 325 కంట్రోల్ యూనిట్లు, 364 వీవీప్యాట్లు, మంథనిలో 362 బ్యాలెట్, 362 కంట్రోల్ యూనిట్లు, 406 వీవీప్యాట్లు, పెద్దపల్లిలో 362 బ్యాలెట్ యూనిట్లు, 362 కంట్రోల్ యూనిట్లు, 406 వీవీప్యాట్లను ప్రత్యేక గోదాంలో భద్రపరిచారు. నియోజకవర్గ స్థాయిలో రెండోసారి పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు.
పెరుగుతున్న సామాజిక స్పృహ
ఎన్నికల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఫ్లయిండ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్, వీడియో వ్యూవింగ్, ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. మరోవైపు పారదర్శకత ఎన్నికల కోసం ప్రజల్లో సామాజిక స్పృహ పెరుగుతోంది. జిల్లా కంట్రోల్ రూమ్లోని 1950 టోల్ ఫ్రీ నంబర్కు 76, సి-విజిల్ 13, ఎన్జీఎస్పీ (నేషనల్ గ్రీవెన్సెస్ సర్వీసు పోర్టల్) 56 చొప్పున ఫిర్యాదులు రాగా వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తున్నారు. జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి రవీందర్రెడ్డి నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. 24 గంటల పాటు విడతల వారీగా సిబ్బంది విధుల్లో కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్రోల్, డీజిల్పై పన్నులు వేస్తే హైవేలపై టోల్ ఛార్జీలు ఎందుకు?: కేటీఆర్
[ 06-05-2024]
పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల రక్తం పీల్చి రూ.కోట్లు వసూలు చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
దారి పొడవునా గులాబీ దండు!
[ 06-05-2024]
భారాస అధినేత బస్సు యాత్రతో గులాబీ దండులో జోష్ నెలకొంది. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో కొనసాగిన యాత్రకు అపూర్వ స్పందన లభించింది. -
ఆటలు ఆడుకోవాలని ఉంది!
[ 06-05-2024]
‘వేసవి సెలవుల్లో ఆడుకోవాలని తహతహలాడాం. మా తల్లిదండ్రుల అనుమతి కూడా తీసుకున్నాం. కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా అంబేడ్కర్ స్టేడియంలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అట్టహాసంగా నిర్వహించేవారు. -
హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం
[ 06-05-2024]
శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసగించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ముందుకు వస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇష్టం లేదా?
[ 06-05-2024]
కరీంనగర్ ఎంపీలుగా బోయినపల్లి వినోద్కుమార్, బండి సంజయ్లు నియోజకవర్గానికి చేసిందేమి లేదని, -
ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా.. నిరంతర నిగా
[ 06-05-2024]
స్వేచ్ఛాయుత, సమర్థవంత ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం సాంకేతిక విధానాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి ఘర్షణలు, అల్లర్లకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. -
క్షేమంగా వెళ్లి వారంలోపే రండి!
[ 06-05-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో వారం రోజులే ఉంది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. -
అస్త్రం సంధించి.. ఆదర్శంగా నిలిచి..
[ 06-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఓటు అస్త్రాన్ని సంధించడంలో పల్లెలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. -
నిజామాబాద్లోనే పసుపు బోర్డు..
[ 06-05-2024]
కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని.. ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషి వల్లే ఇది సాధ్యమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఏళ్లుగా ఇక్కడి రైతుల డిమాండ్గా ఉన్న బోర్డును సాధించటం కోసం మోదీ వెంటపడి సాధించారన్నారు. -
భాజపాకు బుద్ధి చెప్పాలి
[ 06-05-2024]
శాసనసభ ఎన్నికల్లో భారాసను ఓడించినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకు బుద్ధి చెప్పాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన
[ 06-05-2024]
కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టి, ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం చేయడంతోపాటు వైద్యుడు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. -
జిల్లాల పునర్విభజన నిర్ణయాన్ని మానుకోవాలి
[ 06-05-2024]
జిల్లాల పునర్విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం మానుకోవాలని జిల్లా పరిరక్షణ కమిటీ నాయకుడు బొల్లి రామ్మోహన్ కోరారు. -
చిన్నబోయిన బొంకూర్
[ 06-05-2024]
వారంతా రోజూవారీ వ్యవసాయ కూలీలు.. రెక్కాడితేనే కుటుంబం గడిచే పరిస్థితి.. ఎప్పటిలాగే కూలీకి వెళ్లి శ్రమించారు. పనులు పూర్తి చేసుకొని చిరునవ్వులతో ఇళ్లకు తిరుగుపయనమయ్యారు. -
పురలో మారిన ముఖచిత్రం
[ 06-05-2024]
గడిచిన నాలుగేళ్ల జగిత్యాల పురపాలనలో వివిధ పార్టీల కౌన్సిలర్ల బలాబలాలు మారిపోయాయి. అధ్యక్ష పీఠంలో అనూహ్య మార్పులు, పాలకవర్గం కూర్పులో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ నేతలకు సవాల్గా మారాయి. -
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
[ 06-05-2024]
మండలంలోని కోర్కల్కు చెందిన పూదరి కుమార్(38) పెళ్లి కాదేమోననే బెంగతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వీణవంక ఎస్ఐ తిరుపతి తెలిపారు. -
అగ్నిగుండం
[ 06-05-2024]
ఈ వేసవి సీజన్లో తొలిసారిగా ఆదివారం జగిత్యాల జిల్లాలోని వెల్గటూరులో 47.1 డిగ్రీల సెల్సియస్ రాష్ట్ర స్థాయి అత్యధిక గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్