నిండుగా వెళ్లి.. నిండా ముంచి
నిబంధనల కళ్లకు గంతలు కట్టి భారీ సామర్థ్యంతో వాహనాలు తిప్పుతున్నారు. రవాణా శాఖ ఆదేశాలు విస్మరించి నిండుగా ఇసుక నింపి తరలిస్తున్నారు.
ఇసుక వాహనాలతో రోడ్లు ఛిద్రం
20 టన్నులకు మించి వెళ్లొద్దన్న న్యాయస్థానం
భారీ సామర్థ్యంతో వెళ్తున్న టిప్పర్
ఈనాడు-కర్నూలు, సి.బెళగల్-న్యూస్టుడే: నిబంధనల కళ్లకు గంతలు కట్టి భారీ సామర్థ్యంతో వాహనాలు తిప్పుతున్నారు. రవాణా శాఖ ఆదేశాలు విస్మరించి నిండుగా ఇసుక నింపి తరలిస్తున్నారు. ‘‘ అధిక బరువుతో వెళ్తున్న ఇసుక వాహనాల కారణంగా రోడ్లు ఛిద్రమవుతున్నాయి... గ్రామాలకు బస్సులు రాని పరిస్థితి నెలకొందని ’’ కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కర్నూలు-తిమ్మనదొడ్డి- మంత్రాలయం రహదారిలో 20 టన్నుల బరువు మించిన లారీలు అనుమితించొద్దని ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాలు ఎవరూ పట్టించుకోలేదు.. అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయలేదు.. అధిక బరువుతో ఇసుక వాహనాలు శుక్రవారం దర్జాగా వెళ్లాయి.
నరక దారులుగా మారాయి
గుంతలమయంగా ముడుమాల దారి
కె.సింగవరం, కొత్తకోట రీచ్ల నుంచి ఇసుక వాహనాలు పోలకల్లు, గూడూరు, సుంకేసుల మీదుగా నిడ్జూరు- మునగాలపాడు - కర్నూలు రోడ్డుపై వెళ్తున్నాయి. ముడుమాల, పల్దొడ్డి, కొండాపురం రీచ్ల నుంచి ముడుమాల-పోలకల్లు మీదుగా గూడూరు-కర్నూలు, ఎమ్మిగనూరు-ఆదోని మార్గంలో తిరుగుతున్నాయి. పల్దొడ్డి, కొండాపురం రీచ్ల నుంచి గుండ్రేవుల-సంగాల-పలుకుదొడ్డి మీదుగా సి.బెళగల్, ఎమ్మిగనూరుకు వెళ్తుంటాయి. ఆయా మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
* సంగాల నుంచి గురజాల వెళ్లే దారిలో రోడ్డుపై ఉన్న కల్వర్టు వాహనాల ధాటికి పూర్తిగా దెబ్బతింది.
బస్సులు బంద్..ఆటోలే దిక్కు
మాది కొండాపురం. పదో తరగతి చదువుతున్నా. కొండాపురం నుంచి ముడుమాల ఉన్నత పాఠశాలకు గతంలో ఆర్టీసీ బస్సులో వెళ్లేవాళ్లం. రోడ్డు బాగోలేదని ప్రస్తుతం బస్సు సర్వీసులు సరిగా తిప్పడం లేదు. చేసేది లేక ఆటోలో ప్రమాదకరంగా వెళ్తున్నాం. నెలకు రూ.600 చెల్లిస్తున్నాం. ఆటోలు రాకపోతే ఒక్కోసారి 60 మంది కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం.
శ్రీలత, ముడుమాల, ఉన్నత పాఠశాల విద్యార్థిని
అధికారానికి భయపడి.. తనిఖీలు మరిచారు
* పది టైర్ల లారీలో 25 టన్నులు, 12 టైర్లు.. 31 టన్నులు, 16 టైర్ల లారీలో 35 టన్నుల మేర తీసుకెళ్లడానికి అనుమతులు ఉన్నాయి. దీంతోపాటు లోడుపై 3 టన్నులు మార్జిన్ ఇచ్చి, అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో వెళ్తే కేసులు నమోదు చేసే అధికారం రవాణా శాఖ అధికారులకు ఉంది. అధిక సామర్థ్యంతో వెళ్తున్న వాహనాలు గుర్తించి అదనంగా నింపిన లోడుకు ఒక టన్నుకు రూ.2-10 వేల వరకు జరిమానా విధించొచ్చు.
* రీచ్ల నుంచి 10 టైర్ల లారీ 30-35 టన్నుల లోడుతో ఇసుక తీసుకెళ్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. తడి ఇసుక కావడంతో మరింత బరువు ఉండటంతో రోడ్లు భారీగా దెబ్బతింటున్నాయి. గుత్తేదారులు అధికార పార్టీ నేతలు కావడంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయడానికి సాహసించడం లేదు.
రాత్రింబవళ్లు రాకపోకలు
* సి.బెళగల్ మండలంలో కొత్తకోట, కె.సింగవరం, ఈర్లదిన్నె, ముడుమాల, పల్దొడ్డి, కొండాపురం పరిధిలో ఇసుక రీచ్లున్నాయి. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, మరో నాయకుడు ఉప గుత్తేదారులుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో రీచ్ నుంచి నిత్యం 2 వేల మెట్రిక్ టన్నుల ఇసుక తరలిస్తున్నారు. రీచ్ల వద్ద వేబ్రిడ్జిలు ఏర్పాటు చేయలేదు. సీసీ కెమెరాలు మచ్చుకైనా కనిపించవు. గతంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుకు తాళం వేశారు.
* గత ప్రభుత్వ హయాంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే వాహనాలకు అనుమతి ఉండేదని, ఇప్పుడు రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉన్నాయి. గ్రీన్కో ప్రాజెక్టు పనులకు ఇసుక తీసుకెళ్లే లారీలు 55 టన్నుల సామర్థ్యంతో, నాడు-నేడు పనులకు సంబంధించి 45 టన్నుల మేర ఇసుక నింపి వాహనాలను పంపిస్తున్నారు. ప్రభుత్వ నిర్మాణాల పేరుతో ఇసుకను తీసుకెళ్లి బయట విక్రయిస్తున్నారు.
108 వాహనాలు రావడం లేదు
-నడిపి పెద్దయ్య, ఈర్లదిన్నె
ఈర్లదిన్నె నుంచి కర్నూలుకు వెళ్లాలంటే గతంలో గంట సమయం పట్టేది. రోడ్లు ధ్వంసం కావడంతో ప్రస్తుతం 3 గంటలు పడుతోంది. ద్విచక్ర వాహనాల్లో వెళ్లాలంటే నరకం చూడాల్సి వస్తోంది. రీచ్ల పరిధిలోని గ్రామాల్లోకి 108 వాహనాలు రావడం లేదు. ఎవరికైనా ఆరోగ్యం విషమిస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది.
ఆటోకు రూ.40 వేల ఖర్చు
- మనోహర్, ఆటో డ్రైవర్
ముడుమాల-గూడూరు-కర్నూలు రహదారిపై నిత్యం మూడు ట్రిప్పులు ఆటో నడిపేవాడిని. రోడ్డు అధ్వానంగా మారడంతో ఒక్కసారి వెళ్లి రావడమే గగనమవుతోంది. సరకులు, ప్రయాణికులను రవాణా చేయగా వచ్చిన ఆదాయం ఆటో మరమ్మతులకు సరిపోవడం లేదు. గత నెల సర్వీసుకి ఇస్తే రూ.40 వేల ఖర్చు వచ్చింది. ఇలాగైతే ఆటోడ్రైవర్లు బతికేది ఎలా.
నడుం నొప్పి బాధిస్తోంది
ఇసుక లారీలతో రోడ్లు గుంతలమయమయ్యాయి. మోకాళ్ల లోతు గుంతల్లో బస్సులు తిప్పాలంటే మరమ్మతులకు గురవుతున్నాయి. ఆయా రోడ్లల్లో సర్వీసు తిప్పడానికి విధులు కేటాయిస్తున్నారంటేనే హడలిపోతున్నాం. ప్రయాణికుల కష్టాలు దృష్టిలో పెట్టుకుని సర్వీసు తిప్పుతుంటే మా ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ రోడ్ల వల్లనే నడుం నొప్పి వచ్చింది.
లక్ష్మీనాయక్, ఆర్టీసీ బస్సు డ్రైవర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 26-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకుడు డి.విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. -
బుగ్గన నామినేషన్ పెండింగ్లో ఉంచిన ఎన్నికల అధికారి
[ 26-04-2024]
డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్ను ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. -
ఇంటింటికి తెలుగుదేశం
[ 26-04-2024]
పెద్దకడుబుర్ మండలం జాలవడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM