వలస విద్యార్థికి అవస్థలే!
తల్లిదండ్రులు వలస వెళ్లారు. పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. పాఠశాలలో హాజరు శాతం తగ్గకుండా ఉండాలని సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేసింది.
సీజనల్ హాస్టళ్ల నిర్వహణ గాలికి
రాత్రివేళలో ఇంటికి పంపుతున్న సిబ్బంది
ఆదోని మండలం పెద్దతుంబళంలోని హాస్టల్ వద్ద విద్యార్థులు
ఆదోని గ్రామీణం, ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్టుడే: తల్లిదండ్రులు వలస వెళ్లారు. పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. పాఠశాలలో హాజరు శాతం తగ్గకుండా ఉండాలని సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేసింది. అవి అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. ఆదోని డివిజన్లో 71 సీజనల్ హాస్టళ్లు మంజూరయ్యాయి. కొన్ని గ్రామాల్లో ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. పత్తికొండ మండలంలో నాలుగు కేంద్రాలు మంజురు కాగా ఒకటి మాత్రమే ప్రారంభించారు.
ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామంలో ఏపీ సమగ్రశిక్ష సౌజన్యంతో విశాల గ్రూప్, శ్రీ భీమాంజనేయ పొదుపు గ్రూప్లకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. జనవరి 11, జనవరి 19 తేదీల్లో సీజనల్ వసతిగృహాలను ప్రారంభించారు. గ్రామంలో రెండు ఒకేచోట ఏర్పాటు చేశారు. రెండు చిన్న గదుల్లో కనీస వసతులు లేవు. విశాల సంఘంలో 52 మంది, భీమాంజనేయ సంఘంలో 28 మంది పిల్లలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. ఆదివారం ‘న్యూస్టుడే’ పరిశీలించగా మొత్తం 80 మందికిగాను 28 మంది విద్యార్థులే ఉన్నారు. అన్నం, నీళ్లు చారు వడ్డించారు. ఉపాధ్యాయుడు, కేర్టేకర్, వంట మనిషి, సహాయకుడు ఉండటం లేదు. రాత్రి వేళలో పిల్లలను ఇంటికి పంపిస్తున్నామని సిబ్బంది తెలిపారు.
* ఆదోని ఎంఈవో శివరాములు మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
మంజూరైనా.. ప్రారంభించలేదు పత్తికొండ మండంలోని దూదేకొండ, జూటూరు, పెద్దహుల్తి గ్రామాలకు మరో ఐదు వసతిగృహాలు మంజూరయ్యాయి. నిర్వహణ బాధ్యత దక్కించుకున్న అధికార పార్టీకి చెందిన ఓ నేత వాటిని ప్రారంభించలేదు. ఆయా గ్రామాల్లో విద్యార్థులు తమ తల్లిదండ్రుల వెంట వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సెలవు రోజుల్లో ఇంటికే..
భోజనం చేస్తున్న విద్యార్థులు
మండల పరిధిలోని పుచ్చకాయలమడ గ్రామంలో రెండు వసతిగృహాలను 2022 నవంబరు 18న ప్రారంభించారు. రెండూ ప్రాథమిక పాఠశాలలోని పాత భవనాల్లో కొనసాగుతున్నాయి. మొత్తం 103 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కో కేంద్రంలో ఇద్దరు కేర్ టేకర్లు, ఇద్దరు టీచర్, వాలంటీరు ఉండగా.. ఒక కేర్టేకర్, ఒక టీచర్ సెలవులో ఉన్నారు. ఆదివారం రెండు కేంద్రాల్లో కలసి 60 శాతం మంది విద్యార్థులే ఉన్నారు. సెలవు రోజు కావటంతో కొందరు పిల్లలు ఇంటి వద్దనే ఉంటున్నారని తెలిసింది. రాత్రి 7 గంటలకు పిల్లలు తమ ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
న్యూస్టుడే, పత్తికొండ గ్రామీణం
మధ్యాహ్నానికే మూత
హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామంలోని సీజనల్ వసతిగృహంలో దాదాపు 50 మంది విద్యార్థుల వరకు వసతి పొందుతున్నారు. గది చిన్నదిగా ఉండటంతో ఆరుబయట కూర్చొని చదువుకోవాల్సి వస్తోందని విద్యార్థులు తెలిపారు. దీనికితోడు మెనూ సక్రమంగా అమలుకావడం లేదని పేర్కొన్నారు. వసతిగృహ నిర్వాహకుడు అక్కడే ఉండాల్సి ఉండగా ఆదివారం తాళం వేసుకుని బయటకు వెళ్లడంతో విద్యార్థులు ఆరు బయటే చదువుకుంటున్నారు.
న్యూస్టుడే, హాలహర్వి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 26-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకుడు డి.విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. -
బుగ్గన నామినేషన్ పెండింగ్లో ఉంచిన ఎన్నికల అధికారి
[ 26-04-2024]
డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్ను ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. -
ఇంటింటికి తెలుగుదేశం
[ 26-04-2024]
పెద్దకడుబుర్ మండలం జాలవడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?