logo

మంచాలు మూలకు.. రోగులకు వెతలు

నంద్యాల పట్టణం సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు వార్డులో పలు విలువైన మంచాలను మూలకు పడేశారు

Published : 24 Mar 2023 05:11 IST

నంద్యాల పట్టణం సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు వార్డులో పలు విలువైన మంచాలను మూలకు పడేశారు. చిన్న చిన్న మరమ్మతులు చేయిస్తే వినియోగించుకునే అవకాశం ఉన్నా సరే అధికారులు పట్టించుకోవడం లేదు. 15 మంచాలను ఇలా పక్కన పడేశారు. వీటిలో శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులు, బాలింతలకు ఉపయోగించే ప్రత్యేక మంచాలు సైతం ఉన్నాయి. ఇవి మూలకు చేరడం వల్ల శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు సాధారణ బెడ్లపైనే పడుకుని ఇబ్బందులు పడుతున్నారు.అధికారులు స్పందించి అధునాతన మంచాలను బాగుచేయించి వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉంది.
 న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని