logo

కేంద్ర బలగాల కవాతు

ఆదోని పట్టణంలో కర్నూల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ శివ నారాయణస్వామి ఆధ్వర్యంలో గురువారం కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి.

Updated : 28 Mar 2024 15:55 IST

ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలో కర్నూల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ శివ నారాయణస్వామి ఆధ్వర్యంలో గురువారం కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. రాబోయే జనరల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలున చోటుచేసుకోకుండా సెంట్రల్  ఫోర్స్ ఎస్‌ఎస్‌బీ, ఆదోని పోలీసువారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆదోని పట్టణలో బీమా సర్కిల్- ఫరీద్ సాహెబ్ మొహల్లా- మట్కరి గేరి -చిన్న మార్కెట్ -చాంద్ సౌదర్గా మీదుగా ఎస్‌కేడీ కాలనీ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌బీ అసిస్టెంట్ కమాండెంట్ రాజేష్, 2 టౌన్  ఇన్‌స్పెక్టర్‌, సిబ్బంది పాల్గొ్న్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని