logo

తెదేపాను గెలిపించుకుందాం

రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు

Published : 29 Mar 2024 06:11 IST

కరపత్రం అందజేస్తున్న గౌరు చరితారెడ్డి
కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: రానున్న ఎన్నికల్లో తెదేపాను గెలిపించుకుందామని మాజీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి గౌరు చరితారెడ్డి అన్నారు. కల్లూరు మండల పరిధి పర్ల గ్రామంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి పత్రాలు అందజేశారు. ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని పేర్కొన్నారు. వైకాపాకు ఓటుతోనే తగిన బుద్ధి చెప్పాలని, అరాచక పాలనకు చరమగీతం పాడాలన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు తెదేపాలో చేరారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు మాదేష్‌, మేకల శేషన్న, మహానంది, శేఖర్‌, సుదర్శనం, ఉప్పర రామగిడ్డయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని