logo

దేశ పర్యటనకు బయలుదేరిన అహోబిలం పీఠాధిపతి

అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ దేశ పర్యటనకు బయలుదేరారు.

Updated : 29 Mar 2024 17:37 IST

ఆళ్లగడ్డ గ్రామీణం: అహోబిలం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ దేశ పర్యటనకు బయలుదేరారు. అహోబిల మఠం నుంచి శుక్రవారం శిష్య బృందంతో కలిసి ప్రత్యేక వాహనాల్లో తిరుమలకు పయనమయ్యారు. అహోబిలం బ్రహ్మోత్సవాలకు వచ్చిన పీఠాధిపతి 15 రోజుల పాటు అహోబిలం మఠంలో బస చేశారు. బ్రహ్మోత్సవాలు పూర్తి కావడంతో దేశ పర్యటనలో భాగంగా తిరుమలలో జరిగే అన్నమాచార్య వర్ధంతి వేడుకలకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయన్ను ఆలయం మర్యాదలతో సాగనంపారు. ఆలయ ప్రధాన అర్చకుడు కీడంబి వేణుగోపాలన్, మఠం ప్రతినిధి సంపత్ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని