logo

ఈ నెల 28న ఏపీ సెట్ పరీక్ష

ఏపీ సెట్-2024 పరీక్ష ఈ నెల 28న జరుగనుందని రీజినల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్ పేర్కొన్నారు.

Published : 27 Apr 2024 16:12 IST

కర్నూలు విద్య : ఏపీ సెట్-2024 పరీక్ష ఈ నెల 28న జరుగనుందని రీజినల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.టి.కె.నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగరంలోని పరీక్ష కేంద్రాలను శనివారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొత్తం 9 పరీక్ష కేంద్రాల్లో 3,883 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సెట్ నిర్వహణ కమిటీ సూచించిన నియమావాలిని తప్పనిసరిగా పాటించాలన్నారు. వేసవి కాలం దృశ్య పరీక్ష రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కావాల్సిన మౌళిక వసతులను కల్పించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని