మయూరిలో పక్షుల సంరక్షణ కేంద్రం
పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచే కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు (మయూరీ నర్సరీ) ఇక పక్షుల కిలకిలరావాలతో సందడి చేయనుంది.. ఎకరం స్థలంలో రూ.1.65 కోట్లతో ఏర్పాటు చేయనున్న పక్షుల సంరక్షణ కేంద్రం పార్కుకు మరింత వన్నె తేనుంది..
పరిపాలన అనుమతి ఇచ్చిన అటవీశాఖ
రూ.1.65 కోట్ల వ్యయంతో ఎకరా స్థలంలో ఏర్పాటుకు నిర్ణయం
న్యూస్టుడే, పాలమూరు
మహబూబ్నగర్ సమీపంలో ఉన్న కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు
పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచే కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు (మయూరీ నర్సరీ) ఇక పక్షుల కిలకిలరావాలతో సందడి చేయనుంది.. ఎకరం స్థలంలో రూ.1.65 కోట్లతో ఏర్పాటు చేయనున్న పక్షుల సంరక్షణ కేంద్రం పార్కుకు మరింత వన్నె తేనుంది.. కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర అటవీశాఖ పరిపాలన ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ జూ పార్కులో, మేడ్చల్ జిల్లాలో మాత్రమే పక్షుల సందర్శన కేంద్రం ఉంది. మూడోది మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మయూరీ నర్సరీలో నిర్మించనున్నారు. అందుకోసం మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు వెళ్లి అక్కడున్న పక్షుల సంరక్షణ, సందర్శన కేంద్రాలను పరిశీలించనున్నారు. జిల్లా అదనపు కలెక్టర్తోపాటు అటవీశాఖ ఉమ్మడి జిల్లా కన్జర్వేటర్, డీఎఫ్వో తదితరులు త్వరలోనే ఆయా ప్రాంతాలను సందర్శించనున్నారు. ఈ మేరకు జిల్లా అటవీశాఖ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
కేసీఆర్ ఎకో పార్కును వివిధ పథకాల ద్వారా రూ.7.40 కోట్లతో 2,087 ఎకరాల్లో సుందరంగా అభివృద్ధి చేశారు. ఈ పార్కును చూడటానికి హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది పర్యాటకులు జిల్లాకు వస్తున్నారు. ఇప్పుడు మరో అరుదైన పక్షుల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుండటంతో ఈ పార్కుకు మరింత శోభ రానుంది.
11 రకాల జాతులకు చెందిన పక్షులు : కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో ఏర్పాటు చేసే సందర్శన కేంద్రంలో 11 రకాల జాతులకు చెందిన పక్షులను ఉంచనున్నారు. మకావోస్ ఫించ్, కాక్టెల్, రెయిన్బో లోరీకీట్, లవ్ బర్డ్స్, రోసెల్లా, బడ్గేరీగర్, పారాకీట్, కోక్కాటో, టర్కీ, పీజియన్ తదితర జాతుల 100కు పైగా పక్షులను కేంద్రంలో సంరక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయమై జిల్లా అటవీశాఖ అధికారి గంగారెడ్డితో మాట్లాడగా కేసీఆర్ అర్బన్ ఏకో పార్కులో పక్షుల సందర్శన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందుకోసం త్వరలోనే వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన పక్షుల కేంద్రాలను పరిశీలిస్తామని, మంచి ప్రమాణాలను పాటించి ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలమూరులో గెలిచి.. దిల్లీలో మెరిసి
[ 28-04-2024]
వెనకబడిన ప్రాంతంగా పేరున్న మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఉద్దండులైన ఎంపీలను అందించింది. ఇక్కడ గెలిచిన పలువురికి మంత్రి పదవులు దక్కగా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. -
భారాస హయాంలోనే అభివృద్ధి
[ 28-04-2024]
50 ఏళ్ల కాంగ్రెస్, తెదేపా పాలనలో పాలమూరుకు ఏమైనా న్యాయం జరిగిందా? అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆయన చేపట్టిన ‘పోరుబాట’ బస్సుయాత్ర శనివారం నాగర్కర్నూల్లో కొనసాగింది. -
యువత.. మార్చేను నేతలరాత
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు యువ మంత్రం జపిస్తున్నారు. -
రానున్న ఐదురోజులు వడగాల్పులు: కలెక్టరు హెచ్చరిక
[ 28-04-2024]
రానున్న ఐదు రోజులు నారాయణపేట జిల్లాలో తీవ్రమైన వడగాల్పులతో పాటు ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో 45డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. -
నేడు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 28న టీఎస్ ఆర్జేసీ, ఆర్డీసీ సెట్ - 2024 నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి రవిప్రకాశ్ తెలిపారు. -
ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దు
[ 28-04-2024]
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు విధిగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. ఈ నెల 29న ఓటరు చైతన్య శోభాయాత్ర పేరుతో జిల్లా కేంద్రంలో మెగా ర్యాలీ నిర్వహించే కార్యక్రమంపై -
అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగొద్దు: కలెక్టర్
[ 28-04-2024]
జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. -
క్రియాశీల నేతలకు ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రాధాన్యం
[ 28-04-2024]
భాజపా, భారాస అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని.. లోక్సభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే యువజన కాంగ్రెస్ కార్యకర్తల్లో 60 శాతం మందికి స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, -
కృష్ణానీటిపై జగన్తో కేసీఆర్ చీకటి ఒప్పందం : యెన్నం
[ 28-04-2024]
కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేలా జగన్తో అప్పటి సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
దామరగిద్దలో వివాహిత దారుణహత్య
[ 28-04-2024]
దామరగిద్దలో మహిళ దారుణ హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన మహిళ మరో ఇంట్లో మృతదేహమై కనిపించింది. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యం
[ 28-04-2024]
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి మైదానంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వహించిన సభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. -
నేడు బీసీ గురుకులాల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకులాల జిల్లా సమన్వయకర్త సుగుణశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!