మర పట్టలేదు.. లక్ష్యం చేరలేదు
కలెక్టరు కోయ శ్రీహర్ష ఇటీవల ధన్వాడ ప్రాంతంలో తనిఖీ నిర్వహించి సీఎంఆర్ బియ్యం ఇవ్వని మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు పెట్టించారు. ఎన్నోసార్లు ఆయన సమీక్షలు నిర్వహించినా మిల్లర్లు కదలడం లేదు.
సీఎంఆర్పై మిల్లర్ల బేఖాతరు
న్యూస్టుడే, నారాయణపేట
కలెక్టరు కోయ శ్రీహర్ష ఇటీవల ధన్వాడ ప్రాంతంలో తనిఖీ నిర్వహించి సీఎంఆర్ బియ్యం ఇవ్వని మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు పెట్టించారు. ఎన్నోసార్లు ఆయన సమీక్షలు నిర్వహించినా మిల్లర్లు కదలడం లేదు. మరిన్ని చర్యలకు ఉపక్రమించేలోగా సీఎంఆర్ లక్ష్యం పూర్తిచేయాలి. బియ్యం పక్కదారి పట్టకుండా చూసుకోవాలి.
గత సంవత్సరం ఖరీఫ్, యాసంగి సీˆజన్లకు సంబంధించిన వరి ధాన్యం మర ఆడించడంలో మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. అధికారుల అలసత్వం కారణంగా లక్ష్యం మేరకు ధాన్యం మర ఆడించలేకపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు గడువుల మీద గడువు విధిస్తున్నా మిల్లర్లు సకాలంలో బియ్యం ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు సీఎంఆర్ బకాయిలు చెల్లించని మిల్లర్లపై అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఖరీఫ్కు సంబంధించి కేవలం 17శాతం మాత్రమే పూర్తయ్యింది. మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో బియ్యం అప్పగిస్తారో లేక బకాయి పడతారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
జిల్లాలో ఖరీఫ్కు సంబంధించి 38 మిల్లులకు 48,536 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా, 32,576 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 5,203 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించారు. అదేవిధంగా 2022-23 యాసంగి సీజన్కు సంబంధించి మొత్తం 1.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుచేయగా ఆరు మిల్లులకు 50,229 మెట్రిక్ టన్నులు కేటాయించారు. 34,186 మెట్రిక్ టన్నులు బియ్యం రావల్సి ఉండగా ఇప్పటి వరకు 14,989 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించారు. మరో 19,194 మెట్రిక్ టన్నులు అప్పగించాల్సి ఉంది. గడువులోగా బియ్యం అప్పగించకపోవడంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశంతో బియ్యం తీసుకోవడం నిలిపివేశారు. ఈ యేడాది యాసంగి సీˆజన్కుగాను 1.35లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా 105 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలుచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అంతంతగా వస్తుండటంతో పెద్దగా కొనుగోళ్లు జరుగడంలేదు. పంటలు కోతదశలో ఉండటంతో ఇప్పటి వరకు 81,200 మెట్రిక్ టన్నులు కొనుగోలుచేశారు. మరో పదిరోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగే అవకాశం ఉంది.
ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యాన్ని జిల్లాలోని 38 మిల్లులకు, యాసంగి సీˆజన్ ఆరు మిల్లులకు కేటాయించారు. గడువులోగా సీఎంఆర్ ఇవ్వకపోతే చర్యలు తప్పవని కలెక్టరు హెచ్చరిస్తున్నారు.
చర్యలు చేపడతాం: జిల్లాలో ఖరీఫ్, యాసంగి సీజన్లకు సంబంధించి మిల్లర్లు పూర్తిస్థాయిలో సీఎంఆర్ బియ్యం అప్పగించలేదు. అధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించి బియ్యం అప్పగించాలని మిల్లర్లకు చెప్పినా నేటికి పూర్తిస్థాయిలో అప్పగించలేదు. సాధ్యమైనంత త్వరగా బియ్యం అప్పగించాలని మిల్లర్లకు ఆదేశిస్తున్నాం. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
దేవదాసు, పౌరసరఫరాలశాఖ డీఎం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్వి మోసపూరిత హామీలు: భారాస
[ 30-04-2024]
రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్దానికి జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదల సంక్షేమానికి పాటుపడిన కేసీఆర్ నాయకత్వంలోని భారాసను గెలిపించాలని పార్టీ నాగర్కర్నూల్ లోకసభ స్థానం అభ్యర్థి ప్రవీణ్కుమార్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
దశాబ్దాల కల నెరవేరదేమి?
[ 30-04-2024]
ఉమ్మడి జిల్లాలో కేంద్ర విద్యాలయాల ఏర్పాటుపై కొన్నేళ్లుగా వివక్ష కొనసాగుతోంది. కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయం, సైనిక స్కూళ్లకు మంచి డిమాండ్ ఉంది. -
మైలారం గుట్టపై తవ్వకాలకు ససేమిరా
[ 30-04-2024]
రాళ్లతో వ్యాపారం చేస్తూ రూ.కోట్లు గడిస్తున్న మైనింగ్ మాఫియా మైలారం గుట్టపై తవ్వకాలకు సిద్ధమైంది. గుట్టపై కన్నేసిన వ్యాపారులు 2017లోనే మైనింగ్, పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు 20 ఏళ్ల వరకు అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
గెలుపు ఖాయం.. భారీ మెజార్టీయే లక్ష్యం
[ 30-04-2024]
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావటంతో ఇక్కడి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడానికి కృషిచేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సూచించారు. -
రక్తనిధి కేంద్రంలో... తగ్గుతున్న నిల్వలు
[ 30-04-2024]
పట్టణంలోని జనరల్ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రోజు రోజుకు రక్తపు నిల్వలు తగ్గుతున్నాయి. అత్యవసర పరిస్థితిలో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పేదోళ్లు ఇంటర్ చదవద్దా?
[ 30-04-2024]
ఉమ్మడి పాలమూరులో వెనకబడిన జిల్లా నారాయణపేట. కార్మికులు, వలస కూలీల జిల్లాగా పేరుంది. -
ఇండియా కూటమిని గెలిపిద్దాం : మంత్రి జూపల్లి
[ 30-04-2024]
ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. -
నాడు మామ.. నేడు అల్లుడు
[ 30-04-2024]
మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఆడబిడ్డ పోటీ చేస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, ఓడించేందుకు నాడు మామ, నేడు అల్లుడు కుట్ర చేస్తున్నారని భాజపా లోక్సభ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. -
ఇథనాల్ పాపం భాజపా, భారాసలదే
[ 30-04-2024]
కేంద్రం, రాష్ట్రంలోని భాజపా, భారాస ప్రభుత్వాల అనుమతులతోనే మరికల్ మండలం చిత్తనూరు శివారులో అప్పట్లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటైందని మహబూబ్నగర్ లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. -
రూ. 50 కోసం దుకాణాలకు నిప్పు
[ 30-04-2024]
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ పక్కన ఉన్న వీధి వ్యాపారుల షెడ్డులో డబ్బా దుకాణాలు దహనం చేసిన నిందితుడిని గుర్తించి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై గోవర్దన్ సోమవారం తెలిపారు. -
కస్తూర్బా విద్యాలయం సిబ్బందిపై వేటు
[ 30-04-2024]
కేజీబీవీలో నలుగురు సిబ్బందిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో ఇందిర ఉత్తర్వ్యులు జారీ చేశారు.