పరుగులో చిరుత
చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్, జాగింగ్ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్లో నిర్వహిస్తున్న జూనియర్
దుబాయ్ జూనియర్ ఏషియాడ్ పోటీలకు ఎంపికైన సాయిసంగీత
న్యూస్టుడే, మహబూబ్నగర్ క్రీడలు
చిన్నప్పుడు సరదాగా తండ్రితో పాటు రన్నింగ్, జాగింగ్ చేసిన క్రీడాకారిణి సాయి సంగీత పదేళ్లుగా అథ్లెట్గా రాణిస్తోంది. జాతీయ స్థాయి టోర్నీల్లో సత్తాచాటి ఏప్రిల్ 24 నుంచి 27 వరకు యూఏఈ రాజధాని దుబాయ్లో నిర్వహిస్తున్న జూనియర్ ఏషియాడ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు ఎంపికైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన దొడ్ల శ్యాంసుందర్, రాజేశ్వరి దంపతుల మొదటి సంతానం సాయి సంగీత. నాగర్కర్నూల్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న తండ్రి రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెట్. సాయి సంగీత చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తి చూపటంతో ఆమెకు శిక్షణ ఇప్పించి ప్రోత్సహించారు. 2014లో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటి హకీంపేటలోని క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందింది. 2014 నుంచి 2023 వరకు అక్కడే సాధన చేస్తూ ఇంటర్ చదివింది. ఆమె శారీరక సామర్థ్యాల ఆధారంగా హర్డిల్స్, ఆ తర్వాత 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్ల పరుగులో ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చారు. 2023-24 విద్యా సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని అల్వాస్ డిగ్రీ కళాశాలలో క్రీడా కోటా కింద సీటు సాధించింది. అక్కడే వసతి పొంది చదువుతూ అథ్లెటిక్స్లో శిక్షణ తీసుకుంటోంది. ఇప్పటివరకు 18 రాష్ట్రస్థాయి టోర్నీలతో పాటు 22 జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సొంతం చేసుకుంది.
సాధించిన విజయాలివే.. : 2017 ఆదిలాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 అథ్లెటిక్స్ పోటీల్లో హర్డిల్స్ విభాగంలో పాల్గొని స్వర్ణ పతకం సాధించి అదే సంవత్సరం మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ స్థాయిలో సైతం కాంస్యం కైవశం చేసుకుంది. 2019 కర్ణాటక రాష్ట్రం ఉడిపిలో నిర్వహించిన సౌత్జోన్ పోటీల్లో 200 మీటర్ల పరుగులో స్వర్ణం దక్కించుకుంది. 2022 గుంటూరులో నిర్వహించిన సౌత్జోన్ జాతీయ స్థాయి పోటీల్లో 200 మీటర్ల పరుగులో రజతం అందుకుంది. 2022 మధ్యప్రదేశ్లో నిర్వహించిన యూత్ నేషనల్స్ పోటీల్లో 200 మీటర్ల పరుగులో రజతం సొంతం చేసుకుంది. 2022 అసోం రాష్ట్రం గౌహతిలో నిర్వహించిన జూనియర్ నేషనల్స్ పోటీల్లో 100 మీటర్ల పరుగులో రజతం, 200 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించింది. 2023 వరంగల్లో నిర్వహించిన సౌత్జోన్ పోటీల్లో 100 మీటర్లు, 200 మీటర్లు పరుగు విభాగాల్లో రజత పతకాలు కైవసం చేసుకుంది. 2023 తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో నిర్వహించిన జూనియర్ నేషనల్స్ పోటీల్లో 200 మీటర్ల పరుగులో కాంస్యం సాధించింది. 2024 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖ్నవూలో నిర్వహించిన ఫెడరేషన్ కప్ పోటీల్లో 400 మీటర్ల పరుగులో, 200 మీటర్ల పరుగు విభాగాల్లో స్వర్ణ పతకాలు అందుకుని దుబాయ్లో జరిగే జూనియర్ ఏషియాడ్ టోర్నీకి ఎంపికైంది.
ఒలింపిక్స్కు ఎంపికే లక్ష్యం.. : అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు నాన్నతో పాటు హకీంపేట క్రీడా పాఠశాలలో శిక్షకులు ఆదిత్య, రతన్బోస్ ప్రోత్సాహం అందించారు. ప్రస్తుతం మంగళూరులో అజిత్ కుమార్ వద్ద శిక్షణ పొందుతున్నా. కొవిడ్ సమయంలో రెండేళ్ల పాటు ఇంటి వద్దే ఉండాల్సి రావటంతో చాలా ఇబ్బందిపడ్డా. సాధన లేక నిరుత్సాహానికి లోనయ్యా. కొవిడ్ అనంతరం సాధన చేసి గుంటూరు సౌత్జోన్ పోటీల్లో పాల్గొని రజతం సాధించాను. ఒలింపిక్స్కు ఎంపికవటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నా.
సాయి సంగీత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
[ 05-05-2024]
భారాసకి చెందిన పలువురు నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. -
ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు
[ 05-05-2024]
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను పూర్తిగా మోసం చేసిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి ఆరోపించారు. -
పాలమూరుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?
[ 05-05-2024]
పాలమూరుకు నరేంద్రమోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మురుగన్
[ 05-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ మూడో సారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని ఎట్టి పరిస్థితులలోను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి మురుగన్ తేల్చి చెప్పారు. -
నేడు ఎర్రవల్లిలో జనజాతర
[ 05-05-2024]
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను ఏర్పాటు చేసింది. -
మాటలతో మోసం చేశారు: చల్లా
[ 05-05-2024]
రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికీ జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
సామాజిక వాణి పాలమూరు బాణి
[ 05-05-2024]
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు ఎంతో హైరానా పడేవారు.. అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ జనాలకూ తెలిసేది కాదు. కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. -
నల్లమలకు చేరిన చిరుత
[ 05-05-2024]
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతంలో ఆరు రోజులుగా ప్రజలను హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు నల్లమల అటవీ ప్రాంతానికి చేరింది. -
వడ్డేపల్లి @ 46 డిగ్రీలు
[ 05-05-2024]
జిల్లాలో గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ఎన్నికల నిర్వహణలో అధికారులది కీలకపాత్ర
[ 05-05-2024]
ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ అన్నారు. -
హస్తం దెబ్బకు కారు షెడ్డుకు
[ 05-05-2024]
భారాస పదేళ్ల పాలనలో అభివృద్ధి కంటే అవినీతి బాగా జరిగిందని అందుకే ప్రజలు శాసనసభ ఎన్నికల్లో ఓటుతో ఆ పార్టీకి బుద్ధి చెప్పారని నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. -
హోం ఓటింగ్కు 1,026 మందే దరఖాస్తు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లతో పాటు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటెయ్యలేని దివ్యాంగులకు హోం ఓటింగ్(ఇంటి వద్దే ఓటు వినియోగం)కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. -
పేదల బతుకులు మార్చేందుకొచ్చా: ఆర్ఎస్
[ 05-05-2024]
ఎర్రబుగ్గ కార్లలో తిరిగేందుకు, హోదా కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కేవలం పేదల జీవితాల్లో మార్పుతీసుకువచ్చేందుకు మాత్రమే వచ్చానని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ప్రవీణ్కుమార్ అన్నారు. -
భారాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లే: మంత్రి జూపల్లి
[ 05-05-2024]
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రజల కష్టాలు తీరుతాయని, కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి మల్లు రవి గెలుపునకు ప్రతి ఒక్కరూ పని చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ : మన్నె
[ 05-05-2024]
రుణమాఫీ చేయకుండా, బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. -
మరికల్లో భారీ చోరీ
[ 05-05-2024]
మరికల్ పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. బంగారం, నగదు కలిపి సుమారుగా రూ. 34 లక్షలు విలువ చేసే సొత్తును దొంగలు ఎత్తుకెళ్లారు. -
ఫలానావారి కుమార్తెలు 30లక్షల మంది
[ 05-05-2024]
1951లో తొలిసారి ఓటరు నమోదు చేపట్టారు. అప్పట్లో ఆచారాలు, సంప్రదాయాల కారణంగా మహిళలు తమ పేరుతో పాటు భర్త పేరు చెప్పేందుకు నిరాకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్