బరువు తగ్గిన జములమ్మ లడ్డూ
నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు.
50 గ్రాముల బరువున్న అమ్మవారి లడ్డూ
గద్వాల గ్రామీణం, న్యూస్టుడే: నడిగడ్డ ఇలవేల్పు భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్న జమ్మిచేడు జములమ్మ అమ్మవారి ఆలయం వద్ద లడ్డూ టెండర్దారులు భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏ మాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం అమ్మవారి లడ్డూ 80గ్రాములు ఉండాల్సి ఉండగా.. ఒక్కో లడ్డూను కేవలం 50గ్రాముల బరువుతో తయారీ చేస్తూ భక్తుల తలపై లడ్డూ తయారీదారులు శఠగోపం పెడుతున్నారు. పైగా ఒక్కో లడ్డూ రూ.15ల చొప్పున జత లడ్లను రూ.30కు విక్రయిస్తున్నారు. లడ్డూలో జీడీపప్పు, కిస్మిస్, యాలకులు, కండచక్కెర లాంటి పదార్థాలు ఏ మాత్రం కనిపించడం లేదని.. కనీసం నెయ్యి వాడకం కూడా సక్రమంగా లడ్డూ తయారీలో వినియోగించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. లడ్లను తయారు చేసిన గంటల వ్యవధిలోనే చాలా గట్టిగా మారుతోందని.. రుచిలోనూ మార్పులు ఉన్నాయని భక్తులు వాపోతున్నారు. బూందిని ముద్దగా తయారు చేసే సమయంలో నీళ్లతో చేతులు తడుపుకుంటున్నారని.. నెయ్యితో చేతులు తడుపుకుని లడ్డూ ముద్దను తయారు చేస్తే ప్రసాదం గట్టిగా మారదని భక్తులు అంటున్నారు. ఆలయ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో లడ్డూ తయారీ సమయంలో తలకు టోపీలు, ముఖానికి మాస్క్లు, చేతులకు గ్లౌజులు ధరించాలన్న సూచనలు పాటించడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులిహోర కూడా ఏమాత్రం రుచిగా లేదని భక్తులు వాపోతున్నారు. ఆలయం అధికారులు స్పందించి అమ్మవారి ప్రసాదాల నాణ్యతపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
[ 05-05-2024]
భారాసకి చెందిన పలువురు నాయకులు ఆదివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. -
ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు
[ 05-05-2024]
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలను పూర్తిగా మోసం చేసిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్రెడ్డి ఆరోపించారు. -
పాలమూరుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?
[ 05-05-2024]
పాలమూరుకు నరేంద్రమోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం: మురుగన్
[ 05-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ మూడో సారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని ఎట్టి పరిస్థితులలోను రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి మురుగన్ తేల్చి చెప్పారు. -
నేడు ఎర్రవల్లిలో జనజాతర
[ 05-05-2024]
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను ఏర్పాటు చేసింది. -
మాటలతో మోసం చేశారు: చల్లా
[ 05-05-2024]
రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వంద రోజుల అబద్ధానికీ జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
సామాజిక వాణి పాలమూరు బాణి
[ 05-05-2024]
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు ఎంతో హైరానా పడేవారు.. అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ జనాలకూ తెలిసేది కాదు. కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. -
నల్లమలకు చేరిన చిరుత
[ 05-05-2024]
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతంలో ఆరు రోజులుగా ప్రజలను హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు నల్లమల అటవీ ప్రాంతానికి చేరింది. -
వడ్డేపల్లి @ 46 డిగ్రీలు
[ 05-05-2024]
జిల్లాలో గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
ఎన్నికల నిర్వహణలో అధికారులది కీలకపాత్ర
[ 05-05-2024]
ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ అన్నారు. -
హస్తం దెబ్బకు కారు షెడ్డుకు
[ 05-05-2024]
భారాస పదేళ్ల పాలనలో అభివృద్ధి కంటే అవినీతి బాగా జరిగిందని అందుకే ప్రజలు శాసనసభ ఎన్నికల్లో ఓటుతో ఆ పార్టీకి బుద్ధి చెప్పారని నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. -
హోం ఓటింగ్కు 1,026 మందే దరఖాస్తు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లతో పాటు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటెయ్యలేని దివ్యాంగులకు హోం ఓటింగ్(ఇంటి వద్దే ఓటు వినియోగం)కు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. -
పేదల బతుకులు మార్చేందుకొచ్చా: ఆర్ఎస్
[ 05-05-2024]
ఎర్రబుగ్గ కార్లలో తిరిగేందుకు, హోదా కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కేవలం పేదల జీవితాల్లో మార్పుతీసుకువచ్చేందుకు మాత్రమే వచ్చానని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ప్రవీణ్కుమార్ అన్నారు. -
భారాసకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లే: మంత్రి జూపల్లి
[ 05-05-2024]
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రజల కష్టాలు తీరుతాయని, కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి మల్లు రవి గెలుపునకు ప్రతి ఒక్కరూ పని చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ : మన్నె
[ 05-05-2024]
రుణమాఫీ చేయకుండా, బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఎంపీ, భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. -
మరికల్లో భారీ చోరీ
[ 05-05-2024]
మరికల్ పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. బంగారం, నగదు కలిపి సుమారుగా రూ. 34 లక్షలు విలువ చేసే సొత్తును దొంగలు ఎత్తుకెళ్లారు. -
ఫలానావారి కుమార్తెలు 30లక్షల మంది
[ 05-05-2024]
1951లో తొలిసారి ఓటరు నమోదు చేపట్టారు. అప్పట్లో ఆచారాలు, సంప్రదాయాల కారణంగా మహిళలు తమ పేరుతో పాటు భర్త పేరు చెప్పేందుకు నిరాకరించారు.
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు