ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో జరిగిన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
మద్దూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ
మద్దూరు సభావేదికపై సీఎం రేవంత్ రెడ్డి, వంశీచంద్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, కోస్గి జడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి
మద్దూరు,కోస్గి, నారాయణపేట- న్యూస్టుడే : అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో జరిగిన కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మొదటిసారి 7500 మెజార్టీతో విజయం సాధించానని, ఇటీవలి ఎన్నికల్లో 33వేల మెజార్టీతో కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్రానికి సీఎంని అందించారని వ్యాఖ్యానించారు. 1967లో అచ్యుతారెడ్డి మంత్రిగా పనిచేశారని, తరువాత మంత్రి యోగం దక్కలేదన్నారు. ఆ లోటును భర్తీచేస్తూ సోనియాగాంధీ కొడంగల్కు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారన్నారు. కృష్ణా- వికారాబాద్ రైల్వేలైన్ ఏర్పాటు కాలేదన్నారు. కొడంగల్ అభివృద్ధిని చూసి భారాస, భాజపాలు నాటకాలు ఆడుతున్నాయని, కొడంగల్ ప్రజలు వీరిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వంద రోజుల్లో రూ.5వేల కోట్ల నిధులు తీసుకువచ్చామన్నారు. పేట-కొడంగల్ పథకానికి అప్పట్లో సీఎం కిరణ్కుమార్రెడ్డి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ డీకే అరుణ అడ్డుపడ్డారని విమర్శించారు. ఆ పథకాన్ని ఇప్పుడు పట్టాలకెక్కిస్తే చూస్తూ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
ఓర్వలేక కుట్రలు
తొలినాళ్లలో పాలమూరుకు చెందిన బూర్గుల రామకృష్ణరావు సీఎం అయితే, 70 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ప్రాంతీయుడికి అవకాశం వచ్చిందన్నారు. ఓర్వలేక కొందరు కుట్రలు, కుతంత్రాలు పన్నుతుంటే మీరందరూ చూస్తూ ఊరుకుంటారా? అని కార్యకర్తలను రేవంత్రెడ్డి ప్రశ్నించారు. అన్ని పార్టీలు జెండాలు పక్కనబెట్టి పాలమూరు అభివృద్ధికోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. నా బలగం, బంధువులు కొడంగల్ ప్రజలేనని..50వేల మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. మహిళా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఓట్లు అడగాలని కోరారు.
మద్దూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి
పోటీలో ఉన్నది రేవంత్రెడ్డే: వంశీచంద్ లోక్సభ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ పాలమూరు ప్రజలు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి నుంచి ఇప్పుడు పాలమూరు బిడ్డ రేవంత్రెడ్డిని ఆ రాష్ట్రాల నాయకులు ప్రచారానికి పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు. పాలమూరులో పోటీ చేస్తున్నది రేవంత్రెడ్డి అని ప్రతికార్యకర్త గుర్తించుకోవాలన్నారు. తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి, మాజీ ఎంఎల్సీ రాములునాయక్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, కొడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విపక్షాలపై విమర్శనాస్త్రాలు
ఈనాడు, మహబూబ్నగర్ : పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశాలు.. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో సీఎం పర్యటన సాగింది. నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో మంగళవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహబూబ్నగర్లో భాజపా అభ్యర్థి డీకే అరుణ, నాగర్కర్నూల్లో భారాస అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మద్దూరులో జరిగిన సమీక్షల్లో ఎక్కువగా డీకే అరుణపైనే విమర్శలు చేశారు. నారాయణపేట జిల్లాలో భాజపాకు గట్టి పట్టు ఉండటంతో సీఎం భాజపానే లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్లు తెలుస్తోంది. నాగర్కర్నూల్లో భారాస అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్పై పలు ప్రశ్నలు సంధించారు. భాజపా, భారాసలు పాలమూరుకు ఏం చేశాయని ప్రశ్నించారు. పాలమూరు వ్యక్తి సీఎంగా ఉన్నాడని, తనకు మద్దతు ఇవ్వాలని ఇక్కడ రెండు ఎంపీ సీట్లు గెలిపిస్తే మాదిగల ఏబీసీడీ వర్గీకరణ, ముదిరాజ్లను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చడానికి, బోయ, వాల్మీకిలను ఎస్టీలోకి మార్చడం కోసం దిల్లీలో పోరాడానికి వంశీచంద్, మల్లు రవిని గెలిపించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
[ 06-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని రాహుల్గాంధీ అన్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో ఆదివారం జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. -
ప్రయాణ ప్రాంగణాల్లో జన జాతర
[ 06-05-2024]
పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాక చిన్నా.. పెద్దా లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఆర్టీసీ ఉగాది ఛాలెంజ్ పేరిట ప్రతి స్టేజీ వద్ద బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, అందుకు తగ్గట్లు బహుమతులు కూడా ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. -
డిగ్రీ ప్రవేశాలకు వేళాయె
[ 06-05-2024]
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రకటన శుక్రవారం విడుదలైంది. మూడు విడతల్లో జరిగే ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
ఎన్నికల్లోనే వినిపించే రైల్వేకూత
[ 06-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో రైల్వే లైను కోసం నలభై ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. దశాబ్దాలు గడిచినా ఆ కల నేరవేరటం లేదు. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో కృష్ణా-వికారాబాద్ రైల్వే లైను ప్రతిపాదన రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. -
ఎన్నికల సంఘం వాట్సాప్ ఛానల్
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది. -
రేవంత్ పాలనను కుప్ప కూల్చాలి : ఆర్ఎస్ ప్రవీణ్
[ 06-05-2024]
రాష్ట్రంలో రేవంత్ పాలనను కుప్పకూల్చి, కేసీఆర్ పాలనను తిరిగి తెచ్చుకోవాలని నాగర్కర్నూల్ భారాస పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన రోడ్షోలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో కలిసి మాట్లాడారు. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యం
[ 06-05-2024]
విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఉండటం వలన, వివాహ శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో ఇళ్లకు తాళాలు వేసి సొంతూరు, ఇతర గ్రామాలు, పట్టణాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు. -
అంజన్నా! నీ భూమి కాపాడుకో
[ 06-05-2024]
అటు రాయచూరు, ఇటు జిల్లా కేంద్రం నారాయణపేట, మరోవైపు మహబూబ్నగర్, హైదరాబాద్ వెళ్లడానికి చక్కని రవాణా సదుపాయం ఉన్న పట్టణం మక్తల్... అంతే కాదు వ్యాపార, ఆధ్యాత్మిక కేంద్రంగానూ ఈ పట్టణానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. -
బడి బాగుకు రూ.8.71 కోట్లు
[ 06-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.8.71 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పనులు పూర్తి చేసే బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’