హక్కు వినియోగం.. పరిఢవిల్లు ప్రజాస్వామ్యం
ఓటు... రాజ్యాంగం ప్రజలకు కల్పించిన వజ్రాయుధం. దీనిని వినియోగించి తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునేందుకు వీలుంటుంది. నచ్చకపోతే అదే ఓటుతో గద్దె దింపేందుకూ అవకాశం ఉంటుంది. ఓటు సద్వినియోగంతో మంచి నేతను ఎన్నుకోవడం ద్వారా పారదర్శక పాలనకు మార్గం సుగమం అవుతుంది.
యువత.. నమోదును విస్మరించొద్దు
జాతీయ ఓటరు దినోత్సవం నేడు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
ఓటు... రాజ్యాంగం ప్రజలకు కల్పించిన వజ్రాయుధం. దీనిని వినియోగించి తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునేందుకు వీలుంటుంది. నచ్చకపోతే అదే ఓటుతో గద్దె దింపేందుకూ అవకాశం ఉంటుంది. ఓటు సద్వినియోగంతో మంచి నేతను ఎన్నుకోవడం ద్వారా పారదర్శక పాలనకు మార్గం సుగమం అవుతుంది. అందుకే అర్హులందరూ ఓటు హక్కును పొందాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ‘న్యూస్టుడే’ కథనం.
అవగాహన కార్యక్రమాలు
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటరు నమోదు, ఓటు హక్కు సద్వినియోగంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2011 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. 18ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు కావాలని సూచించటంతోపాటు ఓటు విలువపై ప్రచారం చేస్తున్నారు. ఓటరు నమోదు, ఓటు వినియోగంతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ప్రస్తుతానికి నిర్వహించడం లేదు.
ఈరోజే ఎందుకంటే..
18 ఏళ్లు నిండిన యువత ఓటరు నమోదుపై అంతగా ఆసక్తి చూపకపోవటాన్ని ఎన్నికల సంఘం గుర్తించింది. యువతను ఓటరు నమోదు దిశగా చైతన్యం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జనవరి 25న ఎన్నికల సంఘం 2011 నుంచి జాతీయ ఓటరు దినోత్సవంగా నిర్వహిస్తోంది.
ఎలా దరఖాస్తు చేయాలంటే..
* కొత్తగా ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపునకు ప్రత్యేక ఫారంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వీటికోసం బూత్స్థాయి అధికారిని సంప్రదించాలి.
* 2022 జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండుతున్న వారందరు రూ ఫారం-6లో దరఖాస్తు చేసుకోవాలి.
* జాబితాలో పేరు తొలగించాలన్నా, మృతిచెందిన వారి పేర్లు, నివాసం మారిన వారు, ఇతర అభ్యంతరాలున్న వారు ఫారం-7లో వివరాలు సమర్పించాలి.
* పేర్లు తప్పుగా నమోదయినా, మార్పులు, చేర్పులు చేయాలన్నా, ఓటరు పేరు, భర్త, తండ్రి పేరు సవరణకు ఫారం-8లో దరఖాస్తు చేసుకోవాలి.
* ఒక నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు ఉండి నివాసం, పోలింగ్ కేంద్రం పరిధి మారినప్పుడు జాబితాలో నివాస ప్రాంతానికి మార్పు కోసం ఫారం-8(ఎ)ను నింపి అందజేయాలి.
అంతర్జాలంలోనూ అవకాశం..
వెబ్సైట్ల ద్వారా అంతర్జాలంలోకి ప్రవేశించాలి. అందులో ఫారం-6, 7, 8, 8ఎ స్టేటస్ అని వస్తాయి. కావాల్సిన దరఖాస్తు పత్రంపై నొక్కి వివరాలు నమోదు చేసుకోవచ్చు. చిరునామా, జన్మదిన తేదీ, కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబ బంధం, తదితర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంతర్జాలంలో దరఖాస్తు చేయటమే కాకుండా దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే వీలుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు రంగులు ఎగరాలి.. మెతుకు సీమ మురవాలి
[ 10-05-2024]
ముష్కరుల చేతిలో ఇందిరాగాంధీ తూటాలకు బలైనప్పుడు దేశానికి ప్రధానిగా, మెదక్కు ఎంపీగా ఉన్నారని, చివరి శ్వాస, ఆఖరి రక్తపుబొట్టు చిందేవరకు ఈ ప్రాంతానికి ఆమె ప్రాతినిధ]్యం వహించారని.. మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే ఆమె కన్ను మూశారని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. -
343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
[ 10-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
ఓటెందుకు వేయాలంటే..
[ 10-05-2024]
ఎంత ఎక్కువ పోలింగ్ నమోదైతే అంత చక్కటి తీర్పు వస్తుందన్నది నిపుణుల మాట. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలో గణనీయంగా పోలింగ్ నమోదవుతున్నా.. -
భారాస అభ్యర్థికి మద్దతిస్తూ తీర్మానం
[ 10-05-2024]
చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్ యాదవ సంఘం సభ్యులు మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓట్లు వేస్తామని గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 10-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
స్థానిక నాయకా.. బాధ్యత నీదిక!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు విస్తరించి ఉండటంతో సమయాభావంతో అభ్యర్థులు, స్టార్ ప్రచారకర్తలు అన్నిచోట్లా రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలు చేపట్టలేరు. -
వేగులు.. నేతలకు గుబులు
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గరపడింది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఓటు పవిత్రమైనది
[ 10-05-2024]
ఓటు పవిత్రమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యతగా గుర్తించాలి. -
నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్
[ 10-05-2024]
‘శత చండీ హోమం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో కాంగ్రెస్, భాజపా ముఖ్యమంత్రులు ఎవరూ ఈ హోమం చేయలేదు. -
మోదీతో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవు
[ 10-05-2024]
కేంద్రంలో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. -
12 వేల కోట్లతో అభివృద్ధి చేశా: బండి సంజయ్
[ 10-05-2024]
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి మోసం చేసిందని, వీటి అమలుకు ప్రశ్నించేది, కోట్లాడేది తానేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
గురుశిష్యుల ప్రయాణమే.. బ్రహ్మచారి
[ 10-05-2024]
ముప్పై ఏళ్ల గురుశిష్యుల కలల ప్రయాణంతో పురుడుపోసుకుంది బ్రహ్మచారి చిత్రం. -
మద్యం తాగొద్దన్నందుకు తండ్రిని హతమార్చిన తనయుడు
[ 10-05-2024]
మద్యం తాగి కుటుంబ సభ్యులను హింసిస్తున్నావని, పద్ధతి మార్చుకోవాలని సూచించిన తండ్రిని, తనయుడు కత్తితో పొడిచి చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 10-05-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితుణ్ని కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!