ఉపాధికి చేయూత జాతీయ స్థాయి ఘనత
కరోనా పరిస్థితులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మ నిర్బర్ పథకం కింద రెండు సంవత్సరాలుగా రుణాలు అందిస్తోంది.
వీధి వ్యాపారులకు రుణాల పంపిణీలో ముందంజ
మొదటి పది స్థానాల్లో సంగారెడ్డి, జహీరాబాద్ పురపాలికలు
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ, జహీరాబాద్ : కరోనా పరిస్థితులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వీధి వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మ నిర్బర్ పథకం కింద రెండు సంవత్సరాలుగా రుణాలు అందిస్తోంది. సంగారెడ్డి, జహీరాబాద్ పురపాలికలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని దేశంలోనే తొలి పది స్థానాల్లో నిలిచాయి. వరుసగా మూడో సారి ఈ ఘనతను దక్కించుకున్నాయి. మొదటి విడత రూ.10 వేలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ రుణాన్ని సక్రమంగా చెల్లించిన వారికి రెండో విడత రూ.20 వేల రుణాన్ని వీధి వ్యాపారులకు ఇచ్చారు. వీటినీ చెల్లించిన వారికి రూ.50 వేల చొప్పున అందజేశారు. లక్షలోపు పట్టణ జనాభా కేటగిరీలో ఈ రెండు పురపాలికలు ఘనత సాధించాయి. ఇదే స్ఫూర్తితో మిగిలిన మున్సిపాలిటీలు ముందుకు సాగితే చిరు వ్యాపారులకు మరింత ఆర్థిక సహాయం అందుతుంది. ఈ నేపథ్యంలో కథనం.
కమిషనర్లు, మెప్మా విభాగం చొరవ
జిల్లాలో 8 పురపాలక సంఘాలున్నాయి. లక్షలోపు జనాభా విభాగంలో సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలు అత్యధిక రుణాలు ఇచ్చి ముందంజలో నిలిచాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి జహీరాబాద్లో 722 మందికి రూ.3.29 కోట్లు పంపిణీ చేయగా.. దేశంలో ఆరో స్థానం దక్కింది. సంగారెడ్డిలో 628 మందికి 2.15 కోట్లు రుణాలు అందించారు. ఈ పట్టణం జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండో విడత రుణాలు సక్రమంగా చెల్లించిన చిరు వ్యాపారులకు మూడో విడత రుణాలను పంపిణీ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల పురపాలక కమిషనర్లతో పాటు మెప్మా విభాగంలో పని చేసే సీవోలు బ్యాంకర్ల వద్దకు వెళ్లి రుణాలు ఇప్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేశారు. వ్యాపారులు తీసుకున్న రుణాలు ప్రతి నెలా చెల్లిస్తున్నారా లేదా అని ఆరా తీస్తున్నారు. ఎవరైనా వెనుకడుగు వేస్తే.. అవగాహన కల్పించి చెల్లించేలా చూస్తున్నారు.
అందరి కృషితోనే గుర్తింపు: గీత, మెప్మా పీడీ
సంగారెడ్డి, జహీరాబాద్ పురపాలికలు అందరి కృషి ఫలితంగానే దేశంలోనే మొదటి పది స్థానాల్లో నిలిచాయి. ఈ గుర్తింపును ఇక ముందు కూడా కొనసాగించాలి. మిగతా పట్టణాల్లోనూ వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించి గుర్తింపు సాధించాలి.
తొలి రెండు విడతల్లో..
సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలు తొలి, రెండో విడత రుణాల విభాగంలోనూ జాతీయ స్థాయిలో టాప్ టెన్లో చోటు దక్కించుకున్నాయి. 2020-21 సంవత్సరానికి జహీరాబాద్ పురపాలికలో 3,633 మందికి రూ.3.63 కోట్లు పంపిణీ చేయగా ఆరో స్థానం, సంగారెడ్డిలో మొదటి విడత కింద రూ.10 వేల చొప్పున 3,387 మందికి రూ.3.38 కోట్లు ఇవ్వగా 9వ స్థానం సాధించాయి. 2021-22లో రెండో విడతలోనూ సంగారెడ్డిలో ఒక్కో వ్యాపారికి రూ.20 వేల చొప్పున 922 మందికి రూ.1.84 కోట్లు, జహీరాబాద్లో 779 మందికి రూ.1.55 కోట్ల రుణాలు అందిచాయి. సంగారెడ్డి 8, జహీరాబాద్ 10వ స్థానంలో నిలిచాయి. చిరు వ్యాపారులు చాలా మంది రుణాలు తీసుకున్న తరువాత నెల వారీ చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఈ రెండు పురపాలికల్లో మెప్మా సిబ్బంది ప్రత్యేక చొరవ చూపి.. వాయిదాలు సక్రమంగా చెల్లించేలా చొరవ చూపారు.
సంగారెడ్డిలో దుకాణాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు రంగులు ఎగరాలి.. మెతుకు సీమ మురవాలి
[ 10-05-2024]
ముష్కరుల చేతిలో ఇందిరాగాంధీ తూటాలకు బలైనప్పుడు దేశానికి ప్రధానిగా, మెదక్కు ఎంపీగా ఉన్నారని, చివరి శ్వాస, ఆఖరి రక్తపుబొట్టు చిందేవరకు ఈ ప్రాంతానికి ఆమె ప్రాతినిధ]్యం వహించారని.. మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే ఆమె కన్ను మూశారని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. -
343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
[ 10-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
ఓటెందుకు వేయాలంటే..
[ 10-05-2024]
ఎంత ఎక్కువ పోలింగ్ నమోదైతే అంత చక్కటి తీర్పు వస్తుందన్నది నిపుణుల మాట. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలో గణనీయంగా పోలింగ్ నమోదవుతున్నా.. -
భారాస అభ్యర్థికి మద్దతిస్తూ తీర్మానం
[ 10-05-2024]
చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్ యాదవ సంఘం సభ్యులు మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓట్లు వేస్తామని గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 10-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
స్థానిక నాయకా.. బాధ్యత నీదిక!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు విస్తరించి ఉండటంతో సమయాభావంతో అభ్యర్థులు, స్టార్ ప్రచారకర్తలు అన్నిచోట్లా రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలు చేపట్టలేరు. -
వేగులు.. నేతలకు గుబులు
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గరపడింది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఓటు పవిత్రమైనది
[ 10-05-2024]
ఓటు పవిత్రమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యతగా గుర్తించాలి. -
నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్
[ 10-05-2024]
‘శత చండీ హోమం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో కాంగ్రెస్, భాజపా ముఖ్యమంత్రులు ఎవరూ ఈ హోమం చేయలేదు. -
మోదీతో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవు
[ 10-05-2024]
కేంద్రంలో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. -
12 వేల కోట్లతో అభివృద్ధి చేశా: బండి సంజయ్
[ 10-05-2024]
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి మోసం చేసిందని, వీటి అమలుకు ప్రశ్నించేది, కోట్లాడేది తానేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
గురుశిష్యుల ప్రయాణమే.. బ్రహ్మచారి
[ 10-05-2024]
ముప్పై ఏళ్ల గురుశిష్యుల కలల ప్రయాణంతో పురుడుపోసుకుంది బ్రహ్మచారి చిత్రం. -
మద్యం తాగొద్దన్నందుకు తండ్రిని హతమార్చిన తనయుడు
[ 10-05-2024]
మద్యం తాగి కుటుంబ సభ్యులను హింసిస్తున్నావని, పద్ధతి మార్చుకోవాలని సూచించిన తండ్రిని, తనయుడు కత్తితో పొడిచి చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 10-05-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితుణ్ని కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్