మత్తులో కారు నడిపి.. కుటుంబంలో విషాదాన్ని నింపి..
మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ వ్యక్తి, ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతిచెందగా, వివాహం జరగాల్సిన యువతితోపాటు ఆరుగురికి గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదంలో బాలుడి దుర్మరణం, ఆరుగురికి గాయాలు
తూప్రాన్, చేగుంట: మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ వ్యక్తి, ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతిచెందగా, వివాహం జరగాల్సిన యువతితోపాటు ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం తూప్రాన్ శివారులో జరిగింది. ఎస్సై శివానందం తెలిపిన ప్రకారం.. మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లికి చెందిన అంబర్పేట యాదగిరి, మంజుల దంపతుల కూతురి వివాహం ఈ నెల 24వ తేదీన జరగాల్సి ఉంది. ఈ సందర్భంగానే వస్త్రాల కొనుగోలుకు దంపతులతోపాటు, పెళ్లి జరగాల్సిన యువతి, యాదగిరి తమ్ముడు బాలకృష్ణ, రాధ దంపతులు వారి ఇద్దరు కుమారులు అఖిల్(15), అరవింద్తో కలిసి ట్రాలీ ఆటోలో తూప్రాన్కు వస్తున్నారు. ఈ క్రమంలో 44వ జాతీయ రహదారిపై హల్దీవాగు వంతెన సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన కారు.. ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిందపడిన అఖిల్పై నుంచి కారు వెళ్లడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మరో ఆరు మంది గాయపడ్డారు. క్షతగాత్రులను తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తి తూప్రాన్ పురపాలిక పరిధి పోతరాజ్పల్లికి చెందిన యస్కి నవీన్గౌడ్గా పోలీసులు గుర్తించారు. మద్యం తాగి కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.
కుమారుడిని కోల్పోయి..: అఖిల్ చందాయిపేటలో ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. ఇటీవలే పరీక్షలు రాశాడు. తమ కళ్లముందే కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ‘ఉన్నత చదువులు చదివి, ఇంటికి వెలుగు అవుతావని అనుకున్నాం బిడ్డా, ఇంతలోనే దేవుడు అన్యాయం చేశాడని’ శోకంలో మునిగిపోయారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అరవింద్ గ్రామంలోనే ఆరో తరగతి చదువుతున్నాడు. గాయాలతోనే అన్న మృతదేహం వద్ద విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్రావు పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
సదాశివపేట: మనస్తాపంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం సదాశివపేట పట్టణంలో జరిగింది. సీఐ మహేష్గౌడ్ తెలిపిన ప్రకారం మండలానికి చెందిన ఓ కుటుంబం పట్టణంలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె (17) బీఫార్మసీ చదువుతోంది. వివిధ కారణాలతో రెండు నెలలుగా మానసిక వేదనతో ఇంట్లోనే ఉంటోంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో పంకాకు ఊరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ‘నా మరణానికి ఎవరు కారణం కాదని ఉత్తరంలో పేర్కొందని సీఐ చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..
మూసాపేట, న్యూస్టుడే: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రామకృష్ణ తెలిపిన ప్రకారం..మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సీతారాంనగర్ గ్రామానికి చెందిన లంగడి రమేష్(20) రెండేళ్ల క్రితం నగరానికి వలసొచ్చాడు. కూకట్పల్లి ప్రకాష్నగర్లోని అతని అన్న ప్రసాద్ ఇంటికి సమీపంలోని ఓ గదిలో ఒంటరిగా ఉంటున్నాడు. ‘డెలివరీ బాయ్’గా పనిచేస్తున్న అతడికి కొన్నాళ్లుగా ఆర్థిక సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా రమేష్ ఫోన్ ఎత్తకపోవడంతోపాటు కన్పించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు ఆదివారం రాత్రి అతడి గదికి వెళ్లి చూశారు. అప్పటికే అతడు గదిలోని ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయి కన్పించాడు. శనివారమే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో ఒకరు..
మెదక్, న్యూస్టుడే: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మెదక్లో వెలుగు చూసింది. పట్టణ సీఐ దిలీప్కుమార్ తెలిపిన వివరాలు.. మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన కుర్తివాడ మల్లేశం(49) పని నిమిత్తం ఆదివారం మెదక్ పట్టణానికి వచ్చారు. సోమవారం ఉదయం స్థానిక బంగ్ల చెరువులో శవమై కనిపించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్ద మృతుడి ద్విచక్ర వాహనం, చరవాణి లభించింది. తన భర్త మృతిపై అనుమానం ఉందని భార్య యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు సాధించేలా..
[ 29-04-2024]
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్ల వద్దకు వెళ్తోంది. -
రణమా.. ఉపసంహరణమా!
[ 29-04-2024]
నామపత్రాల దాఖలు... పరిశీలన ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తరువాయి. ఎవరు ఉంటారు... ఎవరెవరు ఉపసంహరించుకుంటారనేది నేడు తేలనుంది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దసంఖ్యలో నామపత్రాలను దాఖలు చేశారు. -
భారాసతోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
[ 29-04-2024]
కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆదివారం రాత్రి చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
మోదీ.. బీసీ.. ట్రస్టు..
[ 29-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు పైకి ప్రసంగాలు చేస్తూనే తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారు. -
మహిళా వాణి.. వినిపించదేమి..!
[ 29-04-2024]
మెదక్ లోక్సభ పురుడు పోసుకొని 72 ఏళ్లయింది. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు మహిళలే ఎంపీలుగా ఎన్నికవడం గమనార్హం. తాజా ఎన్నికల్లోనూ 54 మంది బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థులు శూన్యం.. కీలకమైన చట్టసభల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలుదక్కకపోవడం గమనార్హం. -
కల సాకారమయ్యేలా.. భరోసానిచ్చేలా..
[ 29-04-2024]
ఉన్నత విద్య అభ్యసించి నచ్చిన రంగంలో రాణించి సత్తా చాటాలన్నది ఎంతోమంది నిరుపేద విద్యార్థుల కల. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసి ఏదో ఓ పని చేసుకుంటుంటారు. -
తాగేదెలా?
[ 29-04-2024]
జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ రోజున గొడవలు సృష్టించే రౌడీలు, కేడీలు, పాత నేరస్థుల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. -
ప్రజాశక్తితో.. ఏడాదిలో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు
[ 29-04-2024]
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!