జోరుగా ఉపాధి పనులు
జిల్లాలో ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సీజన్ కావడం.. వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు
నిత్యం 50 వేల మందికి పైగా హాజరు
ఎస్.కొండాపూర్లో..
మెదక్, న్యూస్టుడే: జిల్లాలో ఉపాధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సీజన్ కావడం.. వ్యవసాయ పనులు పెద్దగా లేకపోవడంతో పనులకు వెళ్లేందుకు కూలీలు ఆసక్తి చూపుతున్నారు. ప్రతిరోజు సగటున 50 వేల మందికి పైగా హాజరవుతున్నారు. ఇటీవల భత్యాన్ని కేంద్రం మరింత పెంచింది. జిల్లా ఉన్నతాధికారులు గ్రామాల వారీగా లక్ష్యాన్ని విధించడంతో పనిచేసే వారి సంఖ్య పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి గ్రామపంచాయతీకి 150 మంది కూలీలు హాజరయ్యేలా లక్ష్యం విధించగా సగటున 116 మంది వస్తున్నారు.
వలసలు నివారించేందుకు, ఉన్న ఊరిలో పనులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధిహమీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ పథకం ద్వారా 190 రకాల పనులను చేపట్టే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా 47 లక్షలు పూర్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. 2024-25లో 50 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జలసంరక్షణకు ప్రాధాన్యం
జిల్లా వ్యాప్తంగా జల సంరక్షణకు అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఫీడర్ ఛానళ్ల ఏర్పాటు, చెరువులు, కుంటల్లో పూడిక తీయడం, పొలాలకు వచ్చే నీటి కాలువలను బాగు చేయడం వంటి పనులు చేపడుతున్నారు. దీంతో పాటు వ్యవసాయ పొలాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు.
భానుడి ప్రతాపంతో..
భానుడి ప్రతాపం కారణంగా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే పనులకు వెళ్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తుస్తున్నారు. ప్రతి కూలీకి 2 లీటర్ల నీళ్లకు రూ.2.50 చెల్లిస్తున్నారు. ఇటీవలే కూలి రూ.272కు నుంచి రూ.300 వరకు పెంచడంతో ఈ నెల 1వ తేదీ నుంచి పనులకు కూలీల రాక జోరందుకుంది. సెలవుదినాల్లో కాస్త తగ్గుతోంది. ప్రస్తుతం సగటున రూ.210 అందుతోంది.
ప్రతి కూలీకి పని కల్పిస్తాం: శ్రీనివాస్రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
పనుల సీజన్ కావడంతో ప్రతి పంచాయతీలో నిత్యం 150 మంది కూలీలు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ లెక్కన 70 వేలకు పైగా రావాలి. సగటున 50 వేలకు పైగా వస్తున్నారు. భత్యం పెంచడంతో ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో పనులు చేసే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టు సాధించేలా..
[ 29-04-2024]
కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఓటర్ల వద్దకు వెళ్తోంది. -
రణమా.. ఉపసంహరణమా!
[ 29-04-2024]
నామపత్రాల దాఖలు... పరిశీలన ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించడమే తరువాయి. ఎవరు ఉంటారు... ఎవరెవరు ఉపసంహరించుకుంటారనేది నేడు తేలనుంది. గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దసంఖ్యలో నామపత్రాలను దాఖలు చేశారు. -
భారాసతోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
[ 29-04-2024]
కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆదివారం రాత్రి చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
మోదీ.. బీసీ.. ట్రస్టు..
[ 29-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పట్టున్న నియోజకవర్గాలపై దృష్టి సారించాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఆయా పార్టీల ముఖ్య నేతలు పైకి ప్రసంగాలు చేస్తూనే తెరచాటు మంత్రాంగాలు నడుపుతున్నారు. -
మహిళా వాణి.. వినిపించదేమి..!
[ 29-04-2024]
మెదక్ లోక్సభ పురుడు పోసుకొని 72 ఏళ్లయింది. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కేవలం ముగ్గురు మహిళలే ఎంపీలుగా ఎన్నికవడం గమనార్హం. తాజా ఎన్నికల్లోనూ 54 మంది బరిలో ఉండగా, వీరిలో మహిళా అభ్యర్థులు శూన్యం.. కీలకమైన చట్టసభల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలుదక్కకపోవడం గమనార్హం. -
కల సాకారమయ్యేలా.. భరోసానిచ్చేలా..
[ 29-04-2024]
ఉన్నత విద్య అభ్యసించి నచ్చిన రంగంలో రాణించి సత్తా చాటాలన్నది ఎంతోమంది నిరుపేద విద్యార్థుల కల. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే మానేసి ఏదో ఓ పని చేసుకుంటుంటారు. -
తాగేదెలా?
[ 29-04-2024]
జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. నిబంధనల ప్రకారం ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, పైపులైన్ల లీకేజీలతో నీరు కలుషితమవుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ రోజున గొడవలు సృష్టించే రౌడీలు, కేడీలు, పాత నేరస్థుల కదలికపై ప్రత్యేక నిఘా పెట్టింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించింది. -
ప్రజాశక్తితో.. ఏడాదిలో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారు
[ 29-04-2024]
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు