వడగండ్ల వానతో అతలాకుతలం
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి.
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో కొట్టుకుపోగా మిగిలిన వడ్లు
సిద్దిపేట అర్బన్, దుబ్బాక, మిరుదొడ్డి, చేర్యాల, చిన్నకోడూరు, హుస్నాబాద్ గ్రామీణం, కోహెడ గ్రామీణం, న్యూస్టుడే: సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వడగండ్లతో కూడిన గాలివాన కురిసింది. నారాయణరావుపేట మండలంలో అతలాకుతలం చేసింది. పంటలు నేలకొరిగాయి. రాఘవాపూర్, పుల్లూరు గ్రామాల్లో వడగండ్లు పడ్డాయి. ధాన్యం కుప్పలపై పరిచిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. రహదారులపై చెట్లు నేలకూలాయి. గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచింది.
- దుబ్బాక, హబ్షీపూర్, చేర్వాపూర్, చీకోడ్, చిట్టాపూర్, అప్పనపల్లి, చెల్లాపూర్, మల్లయ్యపల్లిలో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన, తూకం వేసిన ధాన్యం కుప్పలు, సంచులు తడిశాయి. కవర్లు కప్పి, వాన వరద కుప్పలపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నా గాలివాన ఉద్ధృతికి చెల్లాచెదురయ్యాయి. నష్టం కలిగించింది. శుక్రవారం వరకు 79 మంది రైతుల 4 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని దుబ్బాక పీఏసీఎస్ సీఈవో మోహన్ తెలిపారు. మిరుదొడ్డి మండలంలో చిరుజల్లులు కురిశాయి. వాతావరణ చల్లబడింది. చిన్నకోడూరు మండలంలో పొద్దుతిరుగుడు గింజల బస్తాలు తడిశాయి.
- హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ, మీర్జాపూర్, వంగరామయ్యపల్లి, భల్లునాయక్తండా, కేశవాపూర్, మల్లంపల్లి గ్రామాల్లో మొదట ఈదురు గాలులు మొదలయ్యాయి. తర్వాత వర్షం కురిసింది. జిల్లెలగడ్డలో పలువురి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. మామిడి కాయలు రాలి నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు.
- కూరెళ్లలో రైతు బండారి మల్లయ్యకు చెందిన ఆవుపై మామిడి చెట్టు కూలి మృతి చెందింది. ఇదే గ్రామం కొండేటి కనకయ్యకు చెందిన మామిడి తోటలోని కాయలు నేలరాలాయి.
మబ్బును చూసి.. పచ్చి పంటను కోసి..
న్యూస్టుడే, చేర్యాల: గత నాలుగైదు రోజులుగా వరుణుడు దోబూచులాడుతున్నాడు. ఒకవైపు భానుడు భగభగ. మండే ఎండలు ఓవైపు.. ఆకాశంలో కారుమబ్బులు మరోవైపు కమ్ముతున్నాయి. దీంతో రైతుల గుండెల్లో గుబులు మొదలవుతోంది. అకాల వర్షాలతో మార్కెట్యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడానికి ఆరబోసిన ధాన్యం తడిసిపోతుందన్న భయంలో రైతులు ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికీ కోయకుండా ఉన్న చేను పొలంలోనే రాలిపోవడం, పైరుపైనే ధాన్యం మొలకెత్తుతుందని జంకుతున్నారు. మరో పాతిక రోజులు వర్షాలు లేకపోతే బాగుండు అన్నట్లుగా ఆకాశం కేసి రైతులు దయనీయంగా చూస్తున్నారు. ఈ నెల ఒకటినే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా తూకాలు మాత్రం ఆలస్యమయ్యాయి. ఆరబోయడానికి, రాత్రి కాపలా కాయడానికి రైతులు అవస్థ పడ్డారు. వాస్తవానికి పైరు పూర్తిగా పక్వానికి వచ్చాక నిమ్మపండు రంగులోకి మారి, ధాన్యం కంకులు కిందికి ఒంగినప్పుడు నూర్పిడి చేసుకోవాలి. కోత సమయానికి పది రోజుల ముందే నీటి తడులు ఆపేయాలి. మరో వారం రోజులు ఆగాల్సి ఉంటుంది. అకాల వానకు పంటంతా నష్టపోతామని భావించిన రైతులు బురద పొలంలోనే ఆకుపచ్చగా ఉన్న పైరును కోసేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి నుంచే ఓటు.. చైతన్యం చాటు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ ఎనలేనిది. దాన్ని పొందడమే కాకుండా.. వినియోగించుకోవడం అత్యంత ప్రధానం. వంద శాతం ఓటింగ్ ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం. వయోభారం, అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న వారిలో కొందరు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. -
ఓటింగ్ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి
[ 02-05-2024]
ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీలో ఉండడంతో అవసరమైన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను సిద్ధం చేస్తున్నారు. -
గోబెల్స్ ప్రచారం నమ్మొద్దు: హరీశ్రావు
[ 02-05-2024]
భాజపా అభ్యర్థి రఘునందన్రావు కల్పిత దృశ్యాలు సృష్టించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. గత దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థి భారాసలో చేరారని వీడియో సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందారన్నారు. -
వసతులు కొరవడి.. అన్నదాత అలజడి
[ 02-05-2024]
జిల్లాలో యాసంగి వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్పత్తులు చేతికి అందడంతో ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నారు. -
ఎండ పెరిగి.. మీటర్లు తిరిగి
[ 02-05-2024]
ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం పెరిగి గృహజ్యోతి కింద జీరో బిల్లులు పొందే లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వ నిబంధనల మేరకు 200 యూనిట్లలోపు వినియోగించుకునే వారికి జీరో బిల్లు ఇస్తారు. -
రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్కు మద్దతు
[ 02-05-2024]
ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని ఆచార్య కోదండరాం అన్నారు. బుధవారం మెదక్లో ఆయన మాట్లాడారు. -
కార్మికుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం
[ 02-05-2024]
కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ పిలుపునిచ్చారు. కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని బుధవారం కౌడిపల్లి మండల కేంద్రంలో భవన -
అప్రమత్తతోనే ప్రశాంతం
[ 02-05-2024]
ఎన్నికలు సజావుగా సాగాలంటే.. అన్ని స్థాయిల్లో అప్రమత్తత అవసరం. ప్రధానంగా పటిష్ఠ బందోబస్తు.. నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. లోక్సభ ఎన్నికల వేళ నూతన సాంకేతికత తోడుగా ప్రశాంతంగా ఎన్నికల క్రతువు పూర్తి చేసేందుకు చర్యలు ఆరంభించారు. -
రాజకీయ భవిష్యత్తు.. చేరికలను ప్రోత్సహిస్తూ..
[ 02-05-2024]
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బల్దియాకు చెందిన సీనియర్ నేత రాబోయే పురపాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలన్న తలంపుతో తన అనుచరులతో ఓ ప్రధాన పార్టీ నుంచి మరో ప్రధాన పార్టీలో చేరిపోయారు. -
కేసీఆర్ మా ఫోన్లు ట్యాపింగ్ చేయించారు
[ 02-05-2024]
మల్లన్న సాగర్ నిర్వాసితులమైన తమ ఫోన్లను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని నిర్వాసితులు ఎండీ హయాతుద్దీన్, వై.శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బుధవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో వారు మాట్లాడుతూ.. -
జొన్న రైతులకు బకాయిల బెంగ
[ 02-05-2024]
అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు నుంచి విపణికి తరలించి విక్రయాలు చేపట్టే వరకు ఇదే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులను అధిగమించినా పంట విక్రయాల బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కర్షకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. -
మహిళా సంఘాలకు సీఎస్సీ కేంద్రాలు
[ 02-05-2024]
పొదుపులు.. బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం.. జమ చేయడం వరకే పరిమితమైన మహిళా పొదుపు సంఘాల సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులు చేపట్టనున్నారు. -
7, 8 తేదీల్లో మాక్ పోలింగ్పై శిక్షణ
[ 02-05-2024]
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. -
ఓటమి భయంతోనే భాజపా ఆరోపణలు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా తక్కువ సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి ఉందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తున్నారని జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ఆరోపించారు. -
నకిలీ పత్రాలతో ప్లాట్ల విక్రయం
[ 02-05-2024]
నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బుధవారం ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమీన్పూర్కు చెందిన దుర్గాప్రసాద్, సుబ్బారావు, రవి గౌడ్ ముఠాగా ఏర్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..