అవకాశాలు అందిపుచ్చుకోవాలని..
లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఓటరు ప్రసన్నానికి విభిన్న మార్గాల్లో అభ్యర్థుల ప్రయత్నం
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్, జహీరాబాద్: లోక్సభ ఎన్నికల్లో ప్రచారం పట్టాలెక్కింది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో అభ్యర్థులు రోజువారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జహీరాబాద్ లోక్సభకు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా బరిలోకి దిగుతున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా, భారాస ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. అందివచ్చిన అవకాశాలను అభ్యర్థులు ఉపయోగించుకుంటున్నారు.
స్థానిక నాయకుల అనుమతితోనే..
అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడానికి లోక్సభ అభ్యర్థులు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆయా పార్టీల అసెంబ్లీ ఇన్ఛార్జులను కాదని ప్రచారం చేసుకునే వీలు లేకుండా పోయింది. అందుకే స్థానిక నాయకుల అనుమతులు ముందే తీసుకుంటున్నారు. అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఉపాధిహామీ పనులు చేసే కూలీల వద్ద నుంచి అంగళ్ల వరకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
కుటుంబీకులు సైతం మేమంటూ..
భాజపా అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా ఆయన సోదరుడు ఎంబీ పాటిల్ ప్రచారం చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ఇక ఆయన కోడలు వచన పాటిల్ కూడా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్కు మద్దతుగా కుమార్తె గిరిజా షెట్కార్, కుమారుడు రాకేశ్ షెట్కార్ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులను కలిసి ప్రచార వ్యూహం రచిస్తున్నారు. సురేశ్ షెట్కార్ తమ్ముడు నగేశ్ షెట్కార్, ఆయన అన్న కుమారుడు సాగర్ షెట్కార్ కూడా ప్రచారంలో ఉన్నారు. భారాస అభ్యర్థి గాలి అనిల్కుమార్ ప్రధానంగా పార్టీ నేతలపై ఆధారపడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో పోటాపోటీగా..
ప్రధాన పార్టీలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీలకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. మొత్తం లోక్సభ నియోజకవర్గం పేరిట కొన్ని గ్రూపులు, నియోజకవర్గాల వారీగా మరికొన్నింటిని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్లలోనూ ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతున్నారు. నాయకుల సభలు, సమావేశాలను ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులు సైతం కార్యకర్తలను ఉద్దేశించి సందేశాలు పంపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు నూరైనా మెతుకు సీమలో గెలవాలి
[ 03-05-2024]
సిద్దిపేటలో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్షో శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. -
ఒకేలా కన్పిస్తూ.. గెలుపోటములు శాసిస్తూ..
[ 03-05-2024]
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరనేది తేలిపోయింది. పోలింగ్కు తక్కువ రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే.. సీఎం అబద్ధాల్ని ఆమోదించినట్లే
[ 03-05-2024]
‘అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక ప్రజల్ని మోసం చేసింది. -
లోక్సభ పోరు.. మరింత హోరు
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
ఈ రోజు ఇలా.. రేపు అలా..
[ 03-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఓటూ ప్రాధాన్యమే. బూత్ స్థాయి నుంచి అన్ని పార్టీలు శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. -
భాజపాతోనే దేశాభివృద్ధి
[ 03-05-2024]
భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. -
ఓటరు చైతన్యంపై ఆడియో ఆవిష్కరణ
[ 03-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్శాతం పెంచేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ మనుచౌదరి పిలుపునిచ్చారు. -
కల నెరవేరిస్తేనే.. విద్యాప్రగతి
[ 03-05-2024]
విద్యతోనే ప్రగతి సాధ్యం.. పేదరిక నిర్మూలనకు ఎంతో దోహదపడుతుంది.. డిగ్రీ వరకు విద్యాభ్యాసానికి ప్రభుత్వపరంగా వసతులు ఉన్నా ఆపై చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.. ఎన్నికల సమయంలో విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పే నేతలు ఆ తర్వాత వదిలేస్తున్నారు. -
తొలి ఓటు వేశారోచ్
[ 03-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తొలి సారిగా చేపట్టిన ఇంటి నుంచి ఓటు ప్రక్రియ సాఫీగా కొనసాగింది. -
రెండు కళ్లూ చాలవులే..
[ 03-05-2024]
కల్యాణ వేదికపై ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తిని సీతమ్మవారు ఓరకంట చూసి చిరుమందహాసం చేస్తోంది.. పక్కనే మరో వేదికపై వరుడి అలంకరణలో ఉన్న పరమేశ్వరుడిని చూసిన పార్వతిదేవి సిగ్గులొలికిస్తోంది. -
విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపా
[ 03-05-2024]
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్వేషాలను రెచ్చగొడుతూ అప్రజాస్వామిక రాజకీయాలు సాగిస్తున్న భాజపాను ఓడించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. -
లక్ష్యం.. సాకారం చేసుకొని..
[ 03-05-2024]
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఎంతోమంది ఈ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కలలు కంటుంటారు. -
కాంగ్రెస్ సర్కారుతోనే సంక్షేమం: మంత్రి పొన్న
[ 03-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజల సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్