ప్రభుత్వం నుంచి డబ్బులొచ్చాయని వృద్ధురాలికి టోకరా
ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ మహిళకు ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వచ్చాయని ఆశ చూపి రూ.15 వేలతో దుండగుడు ఊడాయించిన ఘటన మండలంలోని చిన్నకందుకూర్లో వెలుగుచూసింది.
వృద్ధురాలిని ద్విచ్రవాహనంపై తీసుకెళ్తున్న నిందితుడి సీసీ పుటేజీ
యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్టుడే: ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ మహిళకు ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వచ్చాయని ఆశ చూపి రూ.15 వేలతో దుండగుడు ఊడాయించిన ఘటన మండలంలోని చిన్నకందుకూర్లో వెలుగుచూసింది. సీఐ జానకీరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకందుకూర్కు చెందిన షేక్ మల్లికాబీ (72) వద్దకు శుక్రవారం గుర్తుతెలియని దుండగుడు వచ్చి మైనార్టీ సంక్షేమశాఖ నుంచి ఆమె పేరుపై భారీ మొత్తంలో డబ్బులు వచ్చాయని ఆశచూపాడు. ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దని సూచించాడు. ముందుగా మీ సేవలో రూ.15 వేలు డీడీ చెల్లించిన వెంటనే తన ఖాతాలోకి డబ్బులు జమవుతాయని నమ్మబలికాడు. దానికి అధికారినైన తాను పూర్తిగా సహకరిస్తానని ఆమెను ద్విచక్ర వాహనంపై వంగపల్లికి తీసుకెళ్లాడు. ఆమె పోగు చేసుకున్న రూ.8 వేలు అతనికి ఇచ్చి బతిమాలుకోగా, ఇక ఆ డబ్బులు రావని వెళ్లబోయాడు. దీంతో ఆమె తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అప్పగించి, వాటిని అమ్మి చెల్లించాలని కోరారు. ఆ దుండగుడు వాటిని తీసుకొని ఇప్పుడే వస్తానంటూ అక్కడి నుంచి ఉడాయించాడు. ఎంతకీ రాకపోవడంతో, తాను మోసపోయినట్లు గుర్తించి కుటుంబసభ్యులు, గ్రామస్థులతో కలిసి శనివారం యాదగిరిగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని ఆదివారం వంగపల్లిలోని సీసీ పుటేజీలను పరిశీలించి ఆ వ్యక్తి చిత్రాలు సేకరించామని సీఐ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదిలో 9
[ 01-05-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నల్గొండ జిల్లా 96.11శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. -
ఉదయం 7 గంటలకే పని ప్రదేశంలో ఉండాలి
[ 01-05-2024]
ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ఉదయం 7 గంటల వరకే కూలీలు పని ప్రదేశంలో ఉండాలని ఉపాధిహామీ రాష్ట్ర చీఫ్ విజిలెన్స్ అధికారిణి కె.ఉషా కోరారు. -
నల్గొండ డయాసిస్ బిషప్గా బాధ్యతలు స్వీకరణ
[ 01-05-2024]
ఏసు ప్రభువు సేవలో కొనసాగేందుకు దేవుడు కల్పించిన వరంలా భావిస్తూ నల్గొండ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తున్నానని నూతన బిషప్ కరణం ధమన్కుమార్ తెలిపారు. -
రూ.7.20 లక్షల ఆర్థిక సాయం అందజేత
[ 01-05-2024]
చౌటుప్పల్లో నివాసముండే కోతులాపురానికి చెందిన ఏనుగు భూపాల్రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితం అయ్యాడు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం: జగదీశ్రెడ్డి
[ 01-05-2024]
కార్యకర్తలకు ఎటువంటి ఆపద వచ్చినా ఆదుకొని.. అండగా ఉంటామని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
సూర్యాపేట జయ విద్యార్థుల ప్రతిభ
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మహాత్మాజ్యోతిభా ఫులే వెనకబడిన తరగతుల గురుకులాల్లో 99.69శాతం ఫలితాలు సాధించారు. -
పోలీసుల అదుపులో గంజాయి విక్రేతలు
[ 01-05-2024]
నార్కట్పల్లి పోలీసు ఠాణాలో గంజాయి అమ్మకాలతో పాటు సేవిస్తున్న అయిదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల స్వీకరణ
[ 01-05-2024]
సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సింగిరెడ్డి గోవర్ధన్రెడ్డి మంగళవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. -
భాజపాతో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం: జగదీశ్రెడ్డి
[ 01-05-2024]
భాజపాతో కాంగ్రెస్కు లోపాయికారి ఒప్పందం ఉందని, లేకుంటే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసినట్లే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కూడా అరెస్టు చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. -
సాధించా‘ఆరు’..!
[ 01-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వెల్లడైన పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గతేడాది రాష్ట్రంలో 15వ స్థానాన్ని కైవసం చేసుకున్న సూర్యాపేట జిల్లా ఈ ఏడాది ఆరో స్థానంలో నిలిచింది. -
పేదల బతుకుల్లో వెలుగులు నింపాం: జానారెడ్డి
[ 01-05-2024]
కాంగ్రెస్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల బతుకుల్లో వెలుగులు నింపామని, గ్రామాల అభివృద్ధి జరిగిందని సీఎల్పీ మాజీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. -
స్థానం..25
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా బాలికలు తమ ప్రతిభను చాటారు. అత్యధికంగా పది గ్రేడు పాయింట్లు సాధించి అగ్రభాగాన నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
-
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
-
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
-
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు