గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం
పీఏపల్లి మండల పరిధిలో ఏఎమ్మార్పీ అనుసంధాన కాల్వ ఇన్ఫాల్ రెగ్యులేటర్ వద్ద మంగళవారం గల్లంతైన ఇద్దరు గల్లంతవగా.. వారి మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. కుటుంబానికి ఆసరగా నిలుస్తున్న
పెద్దఅడిశర్లపల్లి, న్యూస్టుడే: పీఏపల్లి మండల పరిధిలో ఏఎమ్మార్పీ అనుసంధాన కాల్వ ఇన్ఫాల్ రెగ్యులేటర్ వద్ద మంగళవారం గల్లంతైన ఇద్దరు గల్లంతవగా.. వారి మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. కుటుంబానికి ఆసరగా నిలుస్తున్న కుమారులను ఈ విషాద ఘటన దూరం చేసి కన్నవారికి తీరని దుఃఖం మిగిల్చింది.
శ్మశానమే ఇల్లు.. చెత్త కుప్పలే బతుకుదెరువు
రెక్కాడితే కానీ పూట గడవని కుటుంబాలు వారివి. కనీసం తలదాచుకునేందుకు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో శ్మశాన వాటికే వారికి నివాసమైంది. జీవనోపాధి లేక ఇల్లు గడవాలంటే ఊరూరు తిరిగి వీధులు, చెత్త కుప్పలపైనున్న వ్యర్థాలను సేకరించి సొమ్ము చేసుకుని పొట్టపోసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. ఏ ఒక్కరోజూ చెత్తకుప్పలను ఆశ్రయించకపోతే ఆ రోజు పస్తులుండాల్సిన దుస్థితి వారిది. ఇంతటి దయనీయ పరిస్థితిలో బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్న వారి కుటుంబాలను కాల్వ రూపంలో విధి వెక్కిరించింది. నాంపల్లి మండలం నెమిళ్లగూడేనికి చెందిన కొండపల్లి సైదులు - ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వీరిలో పెద్దకుమారుడు రాము(19) వీరి ఆటో నడుపుతూ తల్లిదండ్రుల సీసాలు ఏరుకునే వృత్తిలో సాయ పడుతుంటాడు. సైదులు బంధువు కప్పెర రమేష్కు ఇద్దరు భార్యలు కాగా.. పెద్ద భార్య ధనమ్మ కుమారుడు సిద్ధూ (12) సైతం తండ్రికి సాయంగా ఆటోలో వెళ్తూ చెత్తకుప్పలపై సీసాలు సేకరిస్తూ చేదోడువాదోడుగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలోనే వీరు మంగళవారం అక్కంపల్లి జలాశయం సమీపంలోని ఇన్ఫాల్ రెగ్యులేటర్ పక్కన చెత్తకుప్పలో సీసాలు సేకరిస్తున్నారు. ప్రమాదవశాత్తు కాల్వలో రాము, సిద్ధూ గల్లంతయ్యారు. గుడిపల్లి పోలీసులు ఏఎమ్మార్పీ మోటార్లు నిలిపివేయించి బుధవారం మధ్యాహ్నం జాలరులతో తెప్పలపై గాలింపు చర్యలు చేపడుతుండగా అనుసంధాన కాల్వ చివర్లో ముందుగా సిద్ధూ, సాయంత్రం రాము మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం దేవరకొండ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.వీరబాబు తెలిపారు. చేతికందొచ్చిన కుమారులు విగత జీవులుగా మారడంతో బాధిత తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ప్రభుత్వపరంగా ఆదుకుంటాం: ఎమ్మెల్యే
బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, కొండమల్లేపల్లి సీఐ వై.రవీందర్, సర్పంచి గోర్ల సైదమ్మ, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ ఎస్.శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యక్తి దారుణ హత్య
[ 10-05-2024]
మండలంలోని ఆంగోతుతండాలో ఓ వ్యక్తి గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు జగ్రు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు -
నిర్లక్ష్యమా.. అవగాహన లోపమా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకునే వారిలో 90శాతం పైగా ఉన్నత చదువులు చదివిన వారే ఉంటారు -
విమర్శలు చేసే.. విజయం కాంక్షించే
[ 10-05-2024]
భువనగిరి లోక్సభ భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ప్రజల్లో శాశ్వతంగా గుర్తు ఉండేలా అభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి
[ 10-05-2024]
ప్రజలు గత 25 ఏళ్లుగా తనను గెలిపించి.. మంత్రి అయ్యే వరకు తీసుకొచ్చారని శాశ్వతంగా గుర్తు ఉండేలా తాను అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
పారదర్శకంగా లోక్సభ ఎన్నికలు
[ 10-05-2024]
ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.. -
మూత్ర పిండం.. పొంచి ఉన్న గండం
[ 10-05-2024]
మానవునికి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. వాతావరణ పరిస్థితుల్లో భాగంగా కిడ్నీ గండం ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతుంది. -
తస్మాత్ జాగ్రత్త.. స్థానికేతరులు వెళ్లాల్సిందే!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు ముందు జిల్లాలో 48గంటల నిబంధనలు పటిష్టంగా అమలు చేయనున్నారు. -
నిరంతరం నిఘా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. -
నాడు హవా.. నేడు నామమాత్రం
[ 10-05-2024]
ఉమ్మడి జిల్లాలో నాడు కమ్యూనిస్టులదే హవా. జాతీయస్థాయిలో రికార్డు స్థాయి మెజార్టీ సాధించింది వారే. ఎన్నిక ఏదైనా గెలుపు కమ్యూనిస్టులదే అనే స్థాయి. -
సరిహద్దులు దాటుతున్న తెలంగాణ మద్యం
[ 10-05-2024]
వారం రోజుల క్రితం కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఏపీ రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తూ.. నందిగామ పోలీసులకు పట్టుబడ్డాడు. -
గట్టెక్కేలా.. ప్రత్యేక వ్యూహం
[ 10-05-2024]
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి -
నిర్బంధం చేస్తేనే.. వస్తారా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు మరో రెండు రోజులు గడువు పెంచడం చూస్తే విద్యావంతులు కూడా ఓటు వేసేందుకు ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారత ఎన్నికల్లో మా ప్రమేయం ఉండదు’: రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న