logo

భారాసను చిత్తుగా ఓడించాలి: ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి

బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని దోచుకు తిన్న భారాసను పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

Updated : 16 Apr 2024 17:41 IST

భువనగిరి: బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని దోచుకు తిన్న భారాసను పార్లమెంటు ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. భారాస చేసిన అవినీతిని ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేయాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్న రేవంత్ సర్కార్‌కు ప్రజల మద్దతు ఊడగట్టి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. భువనగిరి గడ్డ కాంగ్రెస్ అడ్డ అని కాంగ్రెస్ గెలుపును ఎవరు అడ్డుకోలేరని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పంజాల రామాంజనేయులు గౌడ్, శివరాజ్ గౌడ్, తంగళ్ళపల్లి రవికుమార్, మధుసూదన్ రెడ్డి, కసటి నారాయణరెడ్డి, శ్యామ్ గౌడ్, జహంగీర్, ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని