నిత్యం రక్తసిక్తం..!
జాతీయ, ప్రధాన రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. వాహనాల అతివేగం, చోదకుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఒక్కరు చేసిన పాపానికి ఎందరో తనువు చాలిస్తున్నారు.
102 రోజుల్లో 91 మంది మృత్యువాత
ఈ నెలలో 16 మంది దుర్మరణం
ఈనాడు డిజిటల్, సూర్యాపేట, సూర్యాపేట నేరవిభాగం, న్యూస్టుడే
సూర్యాపేట పట్టణంలో ఈ నెల 11న జాతీయ రహదారి వంతెనపై డీసీఎంను వెనుక నుంచి ఢీకొనడంతో నుజ్జునుజ్జయిన కారు
జాతీయ, ప్రధాన రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. వాహనాల అతివేగం, చోదకుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఒక్కరు చేసిన పాపానికి ఎందరో తనువు చాలిస్తున్నారు. తల్లిదండ్రులకు ఆసరా అవుతారనుకున్న కుమారులు దూరమై పుట్టెడు శోకాన్ని మిగులుస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో రోజూ ఎక్కడో చోట రహదారి ప్రమాదం జరుగుతూనే ఉంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జనవరి నుంచి ఏప్రిల్ 11 వరకు 102 రోజుల వ్యవధిలోనే 91 మంది మృత్యువాత పడినట్లు పోలీసుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సూర్యాపేట పురపాలిక పరిధిలో ఈ నెల 4 నుంచి 11 వరకు తొమ్మిది రోజుల వ్యవధిలో జరిగిన వేర్వేరుగా రోడ్డు ప్రమాదాల్లో 13 మంది దుర్మరణం చెందడం విస్మయం కలిగిస్తోంది. ప్రధానంగా వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం, అతివేగం వల్ల జరిగిన ప్రమాదాలే ఎక్కువ.
ఈ నెలలో జరిగిన దుర్ఘటనలు ఇవీ..
- ఈ నెల 3న కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామం బస్టాండ్ సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆత్మకూర్(ఎస్) మండలం ఇస్తాళాపురం గ్రామానికి చెందిన మహిళ దుర్మరణం.
- 4న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మానసనగర్ సమీపంలో కారు, ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృత్యువాత.
- 5న సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
- 7న చిలుకూరు మండలంలోని కవిత జూనియర్ కళాశాల సమీపంలో వాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో వ్యక్తి మరణం.
- 8న సూర్యాపేట మండలం రాజునాయక్తండా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో అర్వపల్లి మండలం కొమ్మాల గ్రామానికి చెందిన యువకుడి దుర్మరణం.
- 9న సూర్యాపేట నుంచి స్వగ్రామం పిల్లలమర్రి గ్రామం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో యువకుడి మృతి.
- 9న ఆత్మకూర్ మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన బాలుడు ట్రాక్టర్ నడుపుతూ అదుపుతప్పి మృతి.
- 11న సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం.
- 11న సూర్యాపేట పట్టణంలోని జాతీయ రహదారి వంతెనపైన డీసీఎంను వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
కఠిన చర్యలు
-రాహుల్ హెగ్డే, ఎస్పీ, సూర్యాపేట
వాహనదారులు నిబంధనలు పాటించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాహన తనిఖీలను విస్తృతం చేశాం. పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం, ఇష్టారీతిన రాకపోకలు సాగించడం మార్చుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు.. కసరత్తు
[ 30-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడం, ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో సత్తా చాటేలా ప్రతిపక్ష భారాస వ్యూహరచన చేస్తోంది. -
ముందస్తుకు మస్తు స్పందన
[ 30-04-2024]
పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు. -
తేలిన బరి..!
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. -
పోటెత్తాలి.. పౌరుడా..!
[ 30-04-2024]
మిత్రులతో కబుర్లు చెబుతూ గంటల సమయాన్ని వృథా చేస్తుంటాం. మనకు సంబంధం లేని, ఎలాంటి ఉపయోగం లేని ఇతరుల విషయాల్లో కలగజేసుకుని మరీ వివరాలను ఆరా తీస్తుంటాం. -
కార్మికులకు కలిసొచ్చే కాలమే..!
[ 30-04-2024]
‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు. -
ఒకేసారి గెలిచిన ఇద్దరు యోధులు
[ 30-04-2024]
1991లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. -
పోలింగ్ నమోదుపై బెంగ
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్ శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం!
[ 30-04-2024]
ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలపై ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. -
కొల్లూరులో వీరగత్తె విగ్రహం గుర్తింపు
[ 30-04-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని పాటిగడ్డ శివాలయం, వైష్ణవ ఆలయాల మధ్య అరుదైన, అపురూపమైన వీరగత్తె విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్ గుర్తించారు. -
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో చోరీకి యత్నం
[ 30-04-2024]
గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసే క్రమంలో నిప్పు రవ్వలు రాజుకొని రూ.8.20 లక్షల నగదు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తొందర ఉందా.. అయితే అక్కడికి వెళ్లండి..!
[ 30-04-2024]
స్కానింగ్ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్ ల్యాబ్ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి. -
ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి
[ 30-04-2024]
అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్సింగ్ క్షేత్రమయుమ్, -
సర్కారు బడి.. గురుకుల ఒడి
[ 30-04-2024]
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
[ 30-04-2024]
మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం