ఆవాసాలకు అమృతం కురిసింది
భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది.
పట్టణంలోని భారీ నీటి ట్యాంకు
భువనగిరి పట్టణం, న్యూస్టుడే: భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది. నిధులు ఆరు నెలల క్రితం మంజూరైనప్పటికి సాంకేతిక కారణాలతో పనుల ప్రతిపాదనలకు, పనులు ప్రారంభం కాలేదు. మంజూరైన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 50 శాతం వాటా, 20 శాతం రాష్ట్రం, 30 శాతం మున్సిపాలిటీ భరించాల్సి ఉంది. ప్రస్తుతం పట్టణంలోని 34 వార్డుల పరిధిలో ఏడు భారీ నీటి ట్యాంకుల ద్వార నల్లా నీటి సరఫరా జరుగుతోంది. మెట్రో వాటర్ వర్క్స్ నుంచి నిత్యం 5.5 ఎంఎల్డీల నీరు సరఫరా జరుగుతున్నప్పటికి నీటిని నిలువ చేసుకునేందుకు ప్రస్తుతం ట్యాంకులు లేకపోవడం గమనార్హం. దీంతో పైప్లైన్ల మరమ్మతులు, ఇతర సాంకేతికంగా సమస్య తలెత్తినప్పుడు నీటి సరఫరా నిలిచిపోతుంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నేటికీ నీటి సరఫరాకు పైప్లైన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో లేకపోవడం గమనార్హం. మెట్రో నుంచి సరఫరా అవుతున్న నీటితో పాటు స్థానికంగా బోర్ల ద్వారా లభిస్తున్న నీటిని ఆవాస ప్రాంతాల్లోని మినీ నీటి ట్యాంకుల్లోకి ఎక్కించి సరఫరా చేస్తున్నారు. నిధుల మంజూరుతో పట్టణంలో నీటి సరఫరాకు మరిన్ని నిర్మాణాలు ఒనగూరే అవకాశం ఉంది.
ప్రతిపాదనలు ఇలా...
అమృత్ పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఇంజినీరింగ్ విభాగం అధికారులు పలు నిర్మాణాలను ప్రతిపాదించారు. పనుల టెండర్లను కేఎంఆర్ సంస్థ దక్కించుకుంది. టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటికి ఎన్నికల కోడ్ కారణంగా పనులు ప్రారంభం కాలేదు. కోడ్ ముగియగానే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో పగిడిపల్లి, రాయగిరి, బొమ్మాయిపల్లి గ్రామ పంచాయతీల విలీనంతో పట్టణ పరిధి పెరిగింది. ఆయా గ్రామాల్లోని ఆవాస ప్రాంతాల్లో అప్పటి అవసరాల మేరకు నీటి ట్యాంకులు, పైప్లైన్లు నిర్మించారు. ప్రస్తుతం ఆయా పంచాయతీల పరిధిలో ఆవాస ప్రాంతాలు పెరిగాయి. నీటి డిమాండ్ పెరిగింది. పట్టణంతో పాటు విలీన ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు నిర్మాణపు పనులు ప్రతిపాదించారు. అమృత్ పథకం కింద పట్టణంలో 1.5 ఎంఎల్డీ, 1 ఎంఎల్డీ, 300 కేఎల్ మూడు ట్యాంకుల నిర్మాణాలను ప్రతిపాదించారు. ఆయా ట్యాంకులకు, ఆవాస ప్రాంతాలకు అనుసంధానించేందుకు ఆరు కిలోమీటర్ల పొడవు ఫీడర్ పైప్లైన్, మూడు కిలో మీటర్ల పొడవు డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్ నిర్మాణాలను ప్రతిపాదించారు. ఈ విషయమై ఇన్ఛార్జి డీఈ కొండల్రావును వివరణ కోరగా ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు.. కసరత్తు
[ 30-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడం, ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో సత్తా చాటేలా ప్రతిపక్ష భారాస వ్యూహరచన చేస్తోంది. -
ముందస్తుకు మస్తు స్పందన
[ 30-04-2024]
పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు. -
తేలిన బరి..!
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. -
పోటెత్తాలి.. పౌరుడా..!
[ 30-04-2024]
మిత్రులతో కబుర్లు చెబుతూ గంటల సమయాన్ని వృథా చేస్తుంటాం. మనకు సంబంధం లేని, ఎలాంటి ఉపయోగం లేని ఇతరుల విషయాల్లో కలగజేసుకుని మరీ వివరాలను ఆరా తీస్తుంటాం. -
కార్మికులకు కలిసొచ్చే కాలమే..!
[ 30-04-2024]
‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు. -
ఒకేసారి గెలిచిన ఇద్దరు యోధులు
[ 30-04-2024]
1991లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. -
పోలింగ్ నమోదుపై బెంగ
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్ శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం!
[ 30-04-2024]
ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలపై ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. -
కొల్లూరులో వీరగత్తె విగ్రహం గుర్తింపు
[ 30-04-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని పాటిగడ్డ శివాలయం, వైష్ణవ ఆలయాల మధ్య అరుదైన, అపురూపమైన వీరగత్తె విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్ గుర్తించారు. -
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో చోరీకి యత్నం
[ 30-04-2024]
గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసే క్రమంలో నిప్పు రవ్వలు రాజుకొని రూ.8.20 లక్షల నగదు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తొందర ఉందా.. అయితే అక్కడికి వెళ్లండి..!
[ 30-04-2024]
స్కానింగ్ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్ ల్యాబ్ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి. -
ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి
[ 30-04-2024]
అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్సింగ్ క్షేత్రమయుమ్, -
సర్కారు బడి.. గురుకుల ఒడి
[ 30-04-2024]
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
[ 30-04-2024]
మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్