పట్టుపట్టి.. ర్యాంకు కొట్టి..!
అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి.
తల్లిదండ్రులతో ధీరజ్రెడ్డి
గుర్రంపోడు, న్యూస్టుడే: అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి. అలాంటి లక్ష్యాన్ని నిర్ధేశించుకుని, అన్ని కష్టాలకు ఓర్చి యూపీఎస్సీ ఫలితాల్లో ర్యాంకు సాధించారు పెంకీసు ధీరజ్. నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం అల్వాల గ్రామానికి చెందిన ధీరజ్ పెంకీసు సత్యనారాయణరెడ్డి, హేమలత దంపతుల కుమారుడు. బ్యాచిలర్ డిగ్రీని మధ్యలో ఆపేసి దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేశారు. మూడుసార్లు విఫలమైనా పట్టువదలకుండా నాలుగోసారి యూపీఎస్సీ పరీక్షలకు గట్టిగా ప్రయత్నించి 173వ ర్యాంకు సాధించి పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. మెరుగైన సమాజం కోసం సేవలందిస్తానని చెబుతున్న ధీరజ్ తనకు ఐపీఎస్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
- ధీరజ్రెడ్డి పదోతరగతి వరకు అల్వాలలో చదివి అనంతరం ఇంటర్మీడియట్కు హైదరాబాద్ వెళ్లారు. తండ్రి సత్యనారాయణరెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా, తల్లి హేమలత ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. ధీరజ్రెడ్డి డిగ్రీ చదువుతున్న సమయంలో ఒకసారి తండ్రి పనిచేసే కళాశాలకు వెళ్లిన సందర్భంలో అక్కడి పేద విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రత్యక్షంగా చూసి ఇలాంటి విద్యార్థుల సమస్యలు తీర్చగలిగే స్థాయి అధికారిగా అవ్వాలనుకున్నారు. అదే స్ఫూర్తితో సివిల్స్ రాయాలనుకున్నారు. అందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించటంతో ఐదేళ్లూ అదే లక్ష్యంతో చదివి విజయం సాధించగలిగారు.
- 2019 నుంచి 2024 వరకు అదే లక్ష్యంతో నిరంతర శ్రమతోనే నాలుగో ప్రయత్నంలో విజయం సాధించానని ధీరజ్ అంటున్నారు. స్కోరింగ్ పేపర్స్ మీద ఎక్కువ రివిజన్ చేశానని. తక్కువ సమయంలో అయిపోయేలా షార్ట్ నోట్స్ ఎక్కువగా రాసుకుని చదివేవాడినని ధీరజ్ వెల్లడించారు. ఇంటర్వ్యూలో డిఫెన్స్ వంటి అంశాల్లో కఠినమైనవి అడుగుతారనుకున్నానని, కాని తన అలవాట్ల గురించి, ఇంగ్లిష్ మీద, మైథాలజీ అంశాలపై ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఒకటి రెండు సార్లు విఫలమైనా విజయం సాధించేవరకూ పట్టువదలకూడదని సూచించారు. ఐదేళ్ల కాలంలో ఫంక్షన్లు వగైరా బంద్ చేసి నిత్యం సాధన చేశాడని తండ్రి సత్యనారాయణరెడ్డి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన
[ 30-04-2024]
యాదాద్రి కలెక్టరేట్ కార్యాలయం ముందు వలిగొండ మండలం రైతులు ధాన్యం రోడ్డుపై పోసి నిరసన తెలుపుతూ ధర్నా చేశారు. -
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తున్నాం
[ 30-04-2024]
పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హన్మంత్ కే జెండగే అన్నారు. -
కారు.. కసరత్తు
[ 30-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడం, ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో సత్తా చాటేలా ప్రతిపక్ష భారాస వ్యూహరచన చేస్తోంది. -
ముందస్తుకు మస్తు స్పందన
[ 30-04-2024]
పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు. -
తేలిన బరి..!
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. -
పోటెత్తాలి.. పౌరుడా..!
[ 30-04-2024]
మిత్రులతో కబుర్లు చెబుతూ గంటల సమయాన్ని వృథా చేస్తుంటాం. మనకు సంబంధం లేని, ఎలాంటి ఉపయోగం లేని ఇతరుల విషయాల్లో కలగజేసుకుని మరీ వివరాలను ఆరా తీస్తుంటాం. -
కార్మికులకు కలిసొచ్చే కాలమే..!
[ 30-04-2024]
‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు. -
ఒకేసారి గెలిచిన ఇద్దరు యోధులు
[ 30-04-2024]
1991లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. -
పోలింగ్ నమోదుపై బెంగ
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్ శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం!
[ 30-04-2024]
ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలపై ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. -
కొల్లూరులో వీరగత్తె విగ్రహం గుర్తింపు
[ 30-04-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని పాటిగడ్డ శివాలయం, వైష్ణవ ఆలయాల మధ్య అరుదైన, అపురూపమైన వీరగత్తె విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్ గుర్తించారు. -
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో చోరీకి యత్నం
[ 30-04-2024]
గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసే క్రమంలో నిప్పు రవ్వలు రాజుకొని రూ.8.20 లక్షల నగదు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తొందర ఉందా.. అయితే అక్కడికి వెళ్లండి..!
[ 30-04-2024]
స్కానింగ్ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్ ల్యాబ్ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి. -
ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి
[ 30-04-2024]
అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్సింగ్ క్షేత్రమయుమ్, -
సర్కారు బడి.. గురుకుల ఒడి
[ 30-04-2024]
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
[ 30-04-2024]
మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
టీ20 ప్రపంచకప్.. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇవే..
-
చివరి అరగంటలో అమ్మేశారు.. సూచీలకు నష్టాలు