బరిలో.. తొలిసారి
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో బరిలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా..
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో బరిలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. వారు ప్రచారం సైతం ప్రారంభించారు. రెండు నియోజకవర్గాలకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా, భారాస నుంచి బరిలో నిలుస్తున్న ఆరుగురు అభ్యర్థుల్లో ఐదుగురు లోక్సభ బరిలో నిలవడం తొలిసారి కావడం విశేషం. భువనగిరి నుంచి భాజపా తరఫున బరిలో నిలుస్తున్న బూర నర్సయ్యగౌడ్ గతంలో ఒక సారి ఎంపీగా విజయం సాధించి.. గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
కుందూరు రఘువీర్రెడ్డి..
నల్గొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున కుందూరు రఘువీర్రెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి తనయుడైన రఘువీర్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి బరిలో నిలిచేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పలు సర్వేల నివేదికల నేపథ్యంలో అధిష్ఠానం రఘువీర్కు లోక్సభ సీటు హామీ ఇవ్వడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, లోక్సభ పరిధిలో ఇద్దరు మంత్రులు సహా నలుగురు ఎమ్మెల్యేలు ఉండడం తన గెలుపునకు దోహదం చేస్తాయని ధీమాగా ఉన్నారు.
కంచర్ల కృష్ణారెడ్డి..
నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సోదరుడైన కృష్ణారెడ్డి.. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి లోక్సభ బరిలో భారాస తరఫున నల్గొండ నుంచి పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో కేసీఆర్, కేటీఆర్ పర్యటనలు, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విస్తృత పర్యటనలతో పాటు గతంలో పార్టీ క్యాడర్ బలంగా ఉండడం తన విజయానికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.
శానంపూడి సైదిరెడ్డి..
శానంపూడి సైదిరెడ్డి రాజకీయాలకు కొత్త కాకపోయినా.. లోక్సభ ఎన్నికల్లో తొలిసారి తలపడబోతున్నారు. గతంలో భారాస తరఫున హుజూర్నగర్ ఎమ్మెల్యేగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన ఇటీవలే భాజపా తీర్థం పుచ్చుకున్నారు. వెంటనే భాజపా అధిష్ఠానం ఆయనను నల్గొండ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో తమకు విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
చామల కిరణ్కుమార్రెడ్డి..
చామల కిరణ్కుమార్రెడ్డి కాంగ్రెస్లో పలు ఉన్నత పదవుల్లో పని చేసినప్పటికీ చట్టసభకు పోటీ పడడం ఇదే తొలిసారి. భువనగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న ఆయన.. నియోజకవర్గంలో అత్యధిక మంది తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడం, రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటు ప్రస్తుతం పార్టీ క్యాడర్ బలంగా ఉండడం తనకు కలిసొస్తుందని భావిస్తున్నారు.
క్యామ మల్లేష్..
భువనగిరి నుంచి భారాస తరఫున బరిలో నిలుస్తున్న క్యామ మల్లేష్ తొలిసారి లోక్సభ బరిలో నిలుస్తున్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున ఇబ్రహీంపట్నం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో భారాసలో చేరారు. బీసీ నినాదం కింద భారాస తమ అభ్యర్థిగా మల్లేష్ను బరిలో నిలిపింది. లోక్సభ పరిధిలో అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నంలో తనకున్న పరిచయాలు, నియోజకవర్గంలో గతంలో భారాస బలంగా ఉండడం తనకు కలిసొస్తుందని ధీమాగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన
[ 30-04-2024]
యాదాద్రి కలెక్టరేట్ కార్యాలయం ముందు వలిగొండ మండలం రైతులు ధాన్యం రోడ్డుపై పోసి నిరసన తెలుపుతూ ధర్నా చేశారు. -
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తున్నాం
[ 30-04-2024]
పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హన్మంత్ కే జెండగే అన్నారు. -
కారు.. కసరత్తు
[ 30-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడం, ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో సత్తా చాటేలా ప్రతిపక్ష భారాస వ్యూహరచన చేస్తోంది. -
ముందస్తుకు మస్తు స్పందన
[ 30-04-2024]
పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు. -
తేలిన బరి..!
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. -
పోటెత్తాలి.. పౌరుడా..!
[ 30-04-2024]
మిత్రులతో కబుర్లు చెబుతూ గంటల సమయాన్ని వృథా చేస్తుంటాం. మనకు సంబంధం లేని, ఎలాంటి ఉపయోగం లేని ఇతరుల విషయాల్లో కలగజేసుకుని మరీ వివరాలను ఆరా తీస్తుంటాం. -
కార్మికులకు కలిసొచ్చే కాలమే..!
[ 30-04-2024]
‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు. -
ఒకేసారి గెలిచిన ఇద్దరు యోధులు
[ 30-04-2024]
1991లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. -
పోలింగ్ నమోదుపై బెంగ
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్ శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం!
[ 30-04-2024]
ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలపై ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. -
కొల్లూరులో వీరగత్తె విగ్రహం గుర్తింపు
[ 30-04-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని పాటిగడ్డ శివాలయం, వైష్ణవ ఆలయాల మధ్య అరుదైన, అపురూపమైన వీరగత్తె విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్ గుర్తించారు. -
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో చోరీకి యత్నం
[ 30-04-2024]
గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసే క్రమంలో నిప్పు రవ్వలు రాజుకొని రూ.8.20 లక్షల నగదు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తొందర ఉందా.. అయితే అక్కడికి వెళ్లండి..!
[ 30-04-2024]
స్కానింగ్ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్ ల్యాబ్ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి. -
ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి
[ 30-04-2024]
అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్సింగ్ క్షేత్రమయుమ్, -
సర్కారు బడి.. గురుకుల ఒడి
[ 30-04-2024]
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
[ 30-04-2024]
మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.