logo

కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య ఆరా

ఓ దుండగుడి దాడిలో గాయపడిన నెల్లూరు నగర తెదేపా ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పరామర్శించారు.

Updated : 29 Nov 2022 15:26 IST

నెల్లూరు నగరపాలక సంస్థ :  ఓ దుండగుడి దాడిలో గాయపడిన నెల్లూరు నగర తెదేపా ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పరామర్శించారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటంరెడ్డికి ఫోన్ చేసి వెంకయ్య నాయుడు పలకరించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరును, తనకు అందుతున్న వైద్యాన్ని కోటంరెడ్డి వివరించారు. పూర్తిగా కోలుకొని కోటంరెడ్డి తిరిగి ప్రజా క్షేత్రంలోకి రావాలని వెంకయ్య ఆకాంక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని