ఉత్సవాలను చూద్దాం రండి
నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు, వాకాడు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర డిపోల నుంచి ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
వెంగమాంబ
నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు, వాకాడు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర డిపోల నుంచి ఆర్టీసీ అధికారులు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. 500 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహించనున్నారు. దుత్తలూరు, నర్రవాడ వైద్యాధికారులు వైద్య శిబిరాలను స్థానిక పీహెచ్సీ అన్నదాన సత్రం వద్ద ఏర్పాటు చేస్తున్నారు.
న్యూస్టుడే, దుత్తలూరు : మెట్టప్రాంత ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న దుత్తలూరు మండలం నర్రవాడలోని వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు ఐదు రోజులపాటు జరగనున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు ఐదు లక్షల మందికిపైగా భక్తులు వస్తారని ఆలయ ధర్మకర్తలు, అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ఈనెల 11వ తేదీ రాత్రి వెంగమాంబ పేరంటాలు పుట్టినిల్లు అయిన వడ్డిపాలెంలో నిలుపు కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. 12న రథోత్సవంతోపాటు సంతానంలేని మహిళలు వరపడే కార్యక్రమాలు జరుగుతాయి. 13న రథోత్సవం, 14న పగలు కల్యాణోత్సవం, పసుపు కుంకుమ ఉత్సవం, రాత్రి ప్రధానోత్సవం జరుగుతుంది. చివరి రోజైన 15న పొంగళ్లు, ఎడ్ల బండలాగు పందేలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఉచిత భోజనంతోపాటు తాగునీటి సమస్య తలెత్తకుండా వివిధ మార్గాల్లో కుళాయిలు ఏర్పాటు చేశారు. దుత్తలూరు మండలం నర్రవాడలో ఈ దేవస్థానం ఉంది. ఇక్కడికి ఒంగోలు నుంచి కందుకూరు, పామూరు మీదుగా దుత్తలూరు మార్గం, నెల్లూరు నుంచి దుత్తలూరు మీదుగా పామూరు మార్గం, కడప నుంచి బద్వేలు, ఉదయగిరి, దుత్తలూరు మీదుగా పామూరు మార్గం, పోరుమామిళ్ల నుంచి సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు మీదుగా పామూరు రోడ్డు మీదుగా నర్రవాడకు చేరుకోవచ్చు.
ఏర్పాట్లు చేస్తున్నాం: ఉషశ్రీ, ఆలయ కార్యనిర్వహణాధికారిణి
వెంగమాంబ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు, ఆలయ ధర్మకర్తల సూచనలు సలహాలతో దేవస్థానం వద్ద తగిన సౌకర్యాలు కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తునికి అమ్మవారి దర్శనం కలిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఇంట్లో ఓట్లు.. అమ్మకానికి లేవు
[ 07-05-2024]
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అయిదేళ్లుగా కానరాని నేతలు సందు, గొందుల్లో దర్శనమిస్తారు. ఇంటింటి ప్రచారానికి తెరదీస్తారు. ఆ క్రమంలో కొందరు ఏ ఇంట ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయో తెలుసుకుని. -
ఊరూరా గొలుసు.. చిదిమేస్తోంది బతుకు!
[ 07-05-2024]
ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర పేరుతో ఊరూరా తిరుగుతూ బెల్ట్షాపులపై లెక్కలేనన్ని మాటలు చెప్పిన జగన్... అధికారంలోకి రాగానే వాటన్నింటినీ మూసివేయిస్తానని ప్రగల్భాలు పలికారు. -
ఉద్యోగుల ఓట్లకు వైకాపా బేరసారాలు
[ 07-05-2024]
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు అధికార వైకాపా బేరసారాలు సాగిస్తోంది. తమ విధానాలపై గుర్రుగా ఉన్న ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. -
భూ భక్షణ చట్టం
[ 07-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ చట్టం. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అరాచక చట్టం కొత్తకష్టాలు తెచ్చిపెట్టింది. ఆక్రమణలకు పట్టం కట్టేలా ఉంది. మున్ముందు భూ రక్షణకు, ఆస్తుల భద్రతకు చెల్లుచీటి పలికే దీన్ని ఊహించుకుంటేనే భయానకం. -
భూ హక్కు చట్టంతో భూములు కొట్టేస్తారు
[ 07-05-2024]
భూహక్కు యాజమాన్య చట్టం పేరుతో పేదల భూములు కోట్టేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి కన్నేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. మండలంలోని చిన్నచెరుకూరులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పథకాలు నిర్వీర్యం అర్చకులపై దౌర్జన్యం
[ 07-05-2024]
గత తెదేపా ప్రభుత్వ పాలనలో బ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అయిదేళ్లలో తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్చకులపై అధికార వైకాపా దౌర్జన్యాలు తప్ప.. -
ఉదయగిరిలో వడగండ్ల వాన
[ 07-05-2024]
మండలంలో సోమవారం బలమైన ఈదురు గాలులతో ఒకమోస్తారు వడగండ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తాకిడి ఎక్కువగా ఉంది. -
అవ్వా తాతాలకు.. పింఛన్ టెన్షన్
[ 07-05-2024]
జిల్లాలో 37 మండలాలు, 768 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం 3,15,423 మంది పింఛనుదారులున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల మంజూరు నుంచి పంపిణీ వరకు లబ్ధిదారులను వంచనకు గురిచేస్తోంది. -
ఉదయగిరిలో పోస్టల్ ఓటింగ్ పరిశీలన
[ 07-05-2024]
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగులకు కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను సోమవారం కలెక్టరు హరినారాయణన్ పరిశీలించారు. -
జనం ఆస్తులపై జగన్ కుట్ర
[ 07-05-2024]
ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే అధికారికంగా దోచేందుకు కుట్ర పన్నింది. ‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’తో ప్రజల స్థలాలు, పొలాలు, భూములు తదితర ఆస్తులకు రక్షణ లేకుండా పోయే ప్రమాదం ఉందని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
బీసీ కాలనీలో మౌలిక వసతుల లేమి
[ 07-05-2024]
పంచాయతీ పరిధిలో రెండు వార్డులున్న బీసీ కాలనీ అనేక సమస్యలతో సతమతవుతోంది. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వీధులకు సిమెంటు రోడ్లు లేవు. కొన్ని వీధులకు ఉన్నా వాటికి అనుగుణంగా మురుగు కాలువలు లేవు. -
జనతాపేట.. సమస్యల మేట
[ 07-05-2024]
పట్టణంలోని జనతాపేట ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విస్తరించింది. రైల్వే పట్టాలకు పడమర వైపు ఉంది. రైల్వే శాఖ, పురపాలక సంఘాలకు నడుమ సమన్వయం లేక సమస్యలు పరిష్కారం కావడం లేదు.