ఎక్కడి చెత్త అక్కడే
పురపాలికల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. కార్మికుల హాజరు తక్కువగా ఉంటోంది. కేవలం 65 శాతం మందే విధులకు వస్తున్నారు. ఇంటింటి చెత్త సేకరణ 50 శాతమే జరుగుతోంది. కొందరు అధికారులు సిబ్బంది హాజరు తీసుకొని జారుకుంటున్నారు.
పురాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ఆపసోపాలు
సిబ్బంది హాజరు 65 శాతమే
పురపాలికల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. కార్మికుల హాజరు తక్కువగా ఉంటోంది. కేవలం 65 శాతం మందే విధులకు వస్తున్నారు. ఇంటింటి చెత్త సేకరణ 50 శాతమే జరుగుతోంది. కొందరు అధికారులు సిబ్బంది హాజరు తీసుకొని జారుకుంటున్నారు. శనివారం ఉదయం పారిశుద్ధ్య నిర్వహణను ‘న్యూస్టుడే’ బృందం పరిశీలించగా లోపాలు వెలుగుచూశాయి.
పర్యవేక్షణ కరవు
కామారెడ్డి గోదాంరోడ్డులో ఉదయం 8 గంటల సమయంలో..
కామారెడ్డి పట్టణం: జిల్లాకేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు. సిబ్బంది మొక్కుబడిగా పని చేస్తున్నారు. ఆయా వార్డుల్లో శనివారం పరిశీలించగా ఎక్కడా పకడ్బందీ చర్యలు కనిపించలేదు. ఉదయం 8 గంటలైనా.. విద్యానగర్, అశోక్నగర్, వివేకానందకాలనీ, స్టేషన్రోడ్డు, డెయిలీ మార్కెట్, పెద్దబజార్, నిజాంసాగర్రోడ్డు, దేవునిపల్లి, ధర్మశాల, సిరిసిల్ల రోడ్డులో చెత్త తొలగలేదు. బల్దియా కార్యాలయం ఎదుట ఉదయం 7.15 గంటల వరకు తరలించలేదు. గోదాం రోడ్డులో చెత్త పునర్వినియోగ కేంద్రం మూసేశారు. శానిటరీ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ లేదు.
కాల్వలు లేక ఇబ్బందులు
బాన్సువాడ పట్టణం ఒకటో వార్డులో...
బాన్సువాడ పట్టణం: బాన్సువాడ పురపాలికలోని 19 వార్డుల్లో 38 మంది, ప్రధాన రహదారిశుభ్రం చేయడానికి నలుగురిని కేటాయించారు. శనివారం ఏడుగురు గైర్హాజరయ్యారు. ఉదయం 5.14 నుంచి 5.30 మధ్య ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి చెత్త సేకరణ ఆటోలు బయలుదేరినా సమయానికి క్షేత్రస్థాయికి చేరుకోలేదు. 14వ వార్డుల్లో ఉదయం 5.38కి ఒక్క కార్మికురాలే కనిపించారు. 3, 4వ వార్డుల్లో ఉదయం 5.50- 6.20 మధ్య ఎవరూ లేరు. పర్యవేక్షణకు నలుగురు జవాన్లు ఉన్నా.. పుర కార్యాలయం చుట్టే తిరుగుతున్నారు. ఎన్జీవోస్ కాలనీ, సాయికృపానగర్లో చెత్త పేరుకుపోయింది. వాసవీకాలనీ, నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ, బండగల్లీలో కాల్వల నిర్మాణం లేక ఖాళీ ప్రదేశాల్లో మురుగు నిలుస్తోంది.
* జిల్లాలో మూడు పురపాలికల్లో నిత్యం 15-20 శాతం మంది కార్మికులు గైర్హాజరవుతున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిలో రోజుకు సరాసరి 70- 90 మంది విధులకు డుమ్మా కొడుతున్నారు. కొందరు వరుసగా 3- 4 రోజుల పాటు రాకపోవడంతో వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభావం పడుతోంది.
ఎల్లారెడ్డిలో వేకువజామునే హాజరు నమోదు చేస్తున్న అధికారి
పరిశీలన మరిచారు
ఎల్లారెడ్డి పురపాలిక: పంచాయతీ నుంచి పురపాలక స్థాయికి ఎదిగినా ఎల్లారెడ్డిలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఏ వార్డులోనూ సకాలంలో చెత్త తొలగడం లేదు. 80 శాతం సిబ్బంది విధులకు హాజరయ్యారు. ఇంటింటి చెత్త సేకరణకు ఆటోలు కొనుగోలు చేసినా పూర్తిస్థాయిలో పని చేయడం లేదు. వార్డుల్లో అధికారులు పరిశీలించలేదు. శానిటరీ ఇన్స్పెక్టర్ లేక పర్యవేక్షణకు అగచాట్లు తప్పడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్