చీర కొంగులతోనే ఉరిబిగించారు
కామారెడ్డి సబ్ డివిజన్లోని మాచారెడ్డి, దేవునిపల్లి పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిన వేర్వేరు హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల
రెండు హత్య కేసులను ఛేదించిన పోలీసులు
మాట్లాడుతున్న కామారెడ్డి డీఎస్పీ సోమనాథం, పక్కన గ్రామీణ సీఐ చంద్రశేఖర్రెడ్డి, మాచారెడ్డి, దేవునిపల్లి ఎస్సైలు శ్రీనివాస్రెడ్డి, రవికుమార్
కామారెడ్డి నేరవిభాగం, న్యూస్టుడే: కామారెడ్డి సబ్ డివిజన్లోని మాచారెడ్డి, దేవునిపల్లి పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిన వేర్వేరు హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ సోమనాథం వివరాలు వెల్లడించారు. దేవునిపల్లి ఠాణా పరిధిలోని లింగాపూర్ శివారులో హత్యకు గురైన కామారెడ్డి మండలానికి చెందిన మహిళ(32)ను లింగంపేట మండలం పర్మళ్ల తండాకు చెందిన బాదావత్ ప్రకాశ్ చంపినట్లు గుర్తించారు. వీరిద్దరికీ గతంలో ఉన్న పరిచయం మేరకు నవంబరు 17న జిల్లా కేంద్రం నుంచి ద్విచక్రవాహనంపై కంది చేనులోకి వెళ్లారు. ఇద్దరూ కలిసి మద్యం తాగిన అనంతరం డబ్బుల విషయమై గొడవపడ్డారు. ఇన్నాళ్లూ తనను శారీరకంగా వాడుకున్నందుకు నీకు ఇవ్వాల్సిన రూ.లక్ష చెల్లిపోయిందని మహిళ చెప్పడంతో కోపగించిన ప్రకాశ్ ఆమె కొంగునే గొంతుకు బిగించి హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న వెండి పట్టగొలుసులు ఎత్తుకెళ్లి రూ.1500కు అమ్ముకున్నాడు. భార్య కనిపించడం లేదని ఆమె భర్త దేవునిపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ప్రకాశ్ను పట్టుకొని విచారించగా విషయం బయటపడింది. నిందితుణ్ని రిమాండుకు తరలించామని పేర్కొన్నారు.
సొంత మరిది చేతిలోనే.. మాచారెడ్డి మండలం వాడి గ్రామ శివారులో తాడ్వాయి మండలానికి చెందిన మహిళ(38) నవంబరు 28న హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహం ఈ నెల 1న బయట పడింది. పోలీసుల దర్యాప్తులో సొంత మరిది కుంట అల్లూరి రాజు హత్య చేసినట్లుగా గుర్తించారు. భర్త మరణించినప్పటి నుంచి చనువుగా ఉన్న ఆమె కొన్నాళ్లుగా దూరం పెట్టడంతో మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో నవంబరు 28న వాడి గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో చీర కొంగుతో ఉరేసి హత్య చేశాడు. తర్వాత ఆమె పర్సులో ఉన్న నగదు తీసుకొని ఉడాయించాడు. నిందితుణ్ని పట్టుకొని రిమాండుకు తరలించామన్నారు. రెండు హత్య కేసుల ఛేదనలో చురకైన పాత్రను పోషించిన కామారెడ్డి గ్రామీణ సీఐ చంద్రశేఖర్రెడ్డి, మాచారెడ్డి, దేవునిపల్లి ఎస్సైలు శ్రీనివాస్రెడ్డి, రవికుమార్, ప్రొబెషనరీ మహిళా ఎస్సై శ్రీహిత, కానిస్టేబుళ్లు రవికిరణ్, మురళి, విశ్వనాథ్, నరేష్, కిరణ్, రామస్వామి తదితరులను డీఎస్పీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?