logo

బాలికలకు ఆర్థిక సాయం

దోమకొండకు చెందిన బీసు గాయత్రి ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతుండగా వైద్య ఖర్చుల నిమిత్తం పలువురు నాయకులు సోమవారం రూ.36,500 సోమవారం ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని

Published : 18 Jan 2022 03:31 IST

క్యాన్సర్‌ బాధితురాలు గాయత్రికి నగదు అందజేస్తున్న నాయకులు

దోమకొండ, న్యూస్‌టుడే: దోమకొండకు చెందిన బీసు గాయత్రి ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతుండగా వైద్య ఖర్చుల నిమిత్తం పలువురు నాయకులు సోమవారం రూ.36,500 సోమవారం ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్‌గౌడ్‌, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ నాగరాజురెడ్డి, ఉపసర్పంచి శ్రీకాంత్‌, మాజీ సర్పంచి నర్సయ్య, వార్డు సభ్యులు శ్రీనివాస్‌, రవికుమార్‌, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టరు రాజు కలిసి సదరు మొత్తాన్ని అందజేశారు.
మాచారెడ్డి, న్యూస్‌టుడే: కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికైన సోమారంపేట గ్రామానికి చెందిన బానోత్‌ వెన్నెలను సోమవారం కామారెడ్డి నియోజకవర్గ భాజపా ఇన్‌ఛార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభినందించారు. ఆర్థిక సహాయంగా రూ.20 వేలు అందజేశారు.

పర్వతాధిరోహకురాలు వెన్నెలను అభినందిస్తున్న భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెంకటరమణారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని