logo

ఇంట్లో చోరీకి పాల్పడిన భార్యాభర్తలకు దేహశుద్ధి

తల్లి బయటకు వెళ్లగా ఇంట్లో ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండటాన్ని గమనించిన దంపతులు చోరీకి పాల్పడగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకాపరమేశ్వరి

Published : 20 Jan 2022 02:40 IST

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: తల్లి బయటకు వెళ్లగా ఇంట్లో ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండటాన్ని గమనించిన దంపతులు చోరీకి పాల్పడగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణ సీఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భర్త మరణించడంతో ఒంటరిగా ఉంటున్న బత్తుల నర్సవ్వ అనే మహిళ ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఇంట్లో తన తొమ్మిదేళ్ల కొడుకు, ఏడాది వయసున్న కూతురు మాత్రమే ఉన్నారు. ఇది గమనించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన స్వప్న, రాజు ఇంట్లోకి ప్రవేశించి పిల్లలను బెదిరించి సుమారు రూ. 4 వేలు ఎత్తుకెళ్లారు. సాయంత్రం ఇంటికి చేరిన నర్సవ్వ విషయం గ్రహించి ఆందోళనకు గురవుతుండగా అంతలోనే స్వప్న, రాజు అటుగా వెళ్తుండటాన్ని కొడుకు గమనించి చెప్పాడు. వెంటనే కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని పిలిచి భార్యాభర్తలకు దేహశుద్ధి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. స్వప్న, రాజు దంపతులు కామారెడ్డిలో డ్రైనేజీ నిర్మాణ పనులు చేస్తూ ఉపాధి పొందుతుండగా తాగుడుకు బానిసలైనట్లు సీఐ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని