దారి తప్పుతోంది
‘‘కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు తాజాగా గుట్కా స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బీటెక్ విద్యార్థి కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో చాలా మంది గంజాయి, డ్రగ్స్
గంజాయి, డ్రగ్స్కు బానిసవుతున్న యువత
న్యూస్టుడే, నిజామాబాద్ నేరవార్తలు
* ‘‘కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు తాజాగా గుట్కా స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బీటెక్ విద్యార్థి కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే తరహాలో చాలా మంది గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.’’
* ‘‘వేల్పూర్ మండలానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు గంజాయికి బానిసగా మారాడు. ఇందుకోసం బస్సులో రాజధానికి వెళ్లి సరకును తీసుకొచ్చాడు. తీరా గంజాయితో నేరుగా పోలీసులకు చిక్కాడు.’’
* ‘‘డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని కట్టడి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 28న ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్షలో కమిషనరేట్ నుంచి సీపీ నాగరాజు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సైతం పాల్గొంటున్నారు. వీటి కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమీక్షలో సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.’’
రాజధానికి వెళ్లి..
గంజాయి, గుట్కా, ఇతర మాదక ద్రవ్యాల కోసం యువత బానిసగా మారుతున్నారు. కొంతకాలంగా అక్రమ రవాణాలోనూ భాగస్వామ్యం అవుతున్నారు. హైదరాబాద్లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారు అక్కడ దారి తప్పుతున్నారు.
* ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జిల్లాకు గుట్కా దిగుమతి అవుతోంది. ఏవోబీ సరిహద్దుల నుంచి ఉమ్మడి ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ మీదుగా గంజాయి జిల్లాకు తరలివస్తోంది. నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నా తరచూ స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు.
* ఇలాంటి వారిపై పీడీ అస్త్రాన్ని ప్రయోగించాలని గతంలోనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తాజాగా గుట్కా అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులపై పీడీ ప్రయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సీపీ నాగరాజు ప్రకటించారు. ఇదే తరహాలో పాత నేరస్థులు, స్మగ్లర్లపై తిరిగి షీట్లు తెరిస్తే కట్టడికి ఆస్కారం ఉంటుంది.
పెరిగిన వినియోగం
గతంతో పోలిస్తే మత్తు పదార్థాల వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. ఒకవైపు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. ఫలితంగా 2020తో పోలిస్తే 2021లో కేసుల సంఖ్య రెండింతలైంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల యువత, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు బానిసలుగా మారుతుండడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
కేసులు ఇలా...
సం|| గంజాయి గుట్కా
2019 7 28
2020 4 132
2021 116 13
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!